భారతదేశం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
భారతదేశం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

31, మార్చి 2020, మంగళవారం

ప్రతీ రోజుకీ ఆ పేరు ఎలా వచ్చిందంటే..

సూర్యోదయ సమాయానికి ఉన్న గ్రహాన్ని ఆధారంగా తీసుకుని ప్రతీ రోజికి ఆ పేరు పెట్టారు, మన పురాతన ఖగోళ శాస్త్రవేత్తలు.

జ్యోతిషం ప్రకారం ఉన్న నవ గ్రహాలలో, రాహు కేతులకు పెద్ద ప్రాధాన్యం ఇవ్వకపోయినా, వాటి ప్రభావం లేదని అనుకోకూడదు. ఈ రెంటినీ మినహిస్తే, మిగిలిన ఏడు గ్రహాలు సూర్యోదయానికి ఉండేటందున, వాటి పేరుపై ఆ రోజు పిలవబడుతుంది.

హోర అంటే, రెండున్నర ఘడియల సమయం అన్నమాట. ఒక ఘడియ అంటే, దాదాపుగా 24 నిమిషాల సేపు ఉంటుంది. అంటే, ఆ విధంగా రెండున్నర ఘడియలు దాదాపుగా ఒక గంట పాటు. ఇక్కడ ఒక చిన్న సవరింపు. ఇరవై సెకన్ల సమయాన్ని మనం లెక్కలోకి తీసుకుని, ప్రతీ రోజు నిమిషాన్ని ఎక్కువ చేసుకుంటూ మూడు రోజుల తరువాత సమయాన్ని అదే విధంగా ఉంచుకోవాలి.  ఉదాహరణకి ఈ వారంలోని ఆదివారం నాడు, అంటే, 29/Mar/2020 నాడు భాగ్యనగరంలో సూర్యోదయం ఆరుగంటల పద మూడు నిమిషాలకు అవుతూ, ప్రతీ రోజూ ఒక నిమిషం తగ్గుతోంది. కానీ మంగళ బుధవారాలు ఒకే సమయాన్ని లెక్కలోకి తీసుకున్నాం. ఎందుకంటే, రోజుకి ఇరవై సెకన్లపాటు వదిలేసిన సమయాన్ని ఇక్కడ కలిపేసుకున్నాం అనమాట.
ఆవిధంగా ప్రతీరోజుని లెక్కగడితే, ఆ నాటి ఉదయానికి ఉన్న గ్రహాన్ని ఆధారంగా ఆరోజునకు ఆ పేరు వచ్చింది. ఇది వ్రాస్తున్న సమయంలో అంటే, 8:05 pm of 31/March/2020, గురు హోర నడుస్తోంది.


మరిన్ని వివరాలు మఱో సారి

-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్
 కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి

3, జనవరి 2015, శనివారం

స్త్రీలు - జుత్తు

ఈ పోస్టు చాలా మంది ఆడవాళ్లకు నచ్చక పోవచ్చు. ఎందుకంటే, ఇది మా జీవితం, మా ఇష్టం, నువ్వెవ్వడివి నన్ను’ఇలా ఉండాలి..’ అని శాసించడానికి అనేది వారి యొక్క భావన.


అలాంటి భావన ఉన్నవారు, ఈ పోస్టుని ఇక్కడితో చదవడం ఆపేసి, మీకు ఇష్టమైన మఱో పని చేసుకోండి.


భారతీయ సాంప్రదాయానికి పట్టుకొమ్మలాంటిది రామాయణం. రామాయణాన్ని విష వృక్షంగా అభివర్ణించినది ఓ ఆడది. ఆ విషయం ఇక్కడ అప్రస్తుతం. ఆ విషయం గురించి చర్చ కూడా వృధా ప్రయాసే.


అలాంటి రామాయణంలోని ఓ విషయాన్ని ఇక్కడ వ్రాసుకుంటున్నాను. ఇష్టమైన వారు చదవండి, కష్టమైన వారు ఏమి చెయ్యాలో నేను చెప్పను.


కస్యప మహర్షికి ఉన్న భార్యలలో ఇద్దరు ఎప్పుడూ విరుద్దమైన భావనతో కలిగి ఉంటారు. వారు దితి మఱియు అదితి. రామాయణాన్ని ఓ భారతీయ తత్వ శాస్త్రంగా చూడాలనుకునేవారికి ఇది ప్రధమ ఉదాహరణ. భార్యాభర్తలు ఇద్దరు కాదు ఒక్కరుగా బ్రతకాలని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోని వారికి ఏమి చెప్పినా అర్దం కాదు. దానికి తోడు, పాశ్చాచ్య సాంస్కృతి అన్న పేరుతో, పులిని చూచి నక్కలు వాత పెట్టుకున్నట్లుగా వ్యవహరిస్తున్నారు.


ఆంగ్లంలో అయితే, బెట్టర్ హాఫ్ (better half) అని అనవచ్చు, కానీ ఆ అమ్మాయికి గౌరవం ఉండదు. ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే, అసలు విషయం జారిపోతుంది.


దితి అంటే రెండుగా చూచునది, అలాగే, అదితి అంటే, రెండుగా చూడనిది. ఇక్కడ కోడిగుడ్డుపై ఈకలు పీకేరకాలు ఈ అదితి అర్దానికి వక్రభాష్యం ఇస్తారు. రెండుగా చూడటం లేదంటే, మూడు చూస్తోంది అన్నమాట. ఏం? మూడే ఎందుకు చూడాలి, నాలుగుగా చూడకూడదా, అంటూ అసలు విషయాన్ని ప్రక్కదారి పట్టిస్తారు. రెండుగా చూడనిది అంటే, బహు విషయాలుగా కాకుండా ఒక్కటిగా మాత్రమే చూచేది అని అర్దం చేసుకుంటే, ఉన్నతమైన భావన కలిగినట్లౌతుంది.


ఇంద్రుడు అదితికుమారుడు. ఇంద్రుడిని చంపే శక్తి కలిగిన పుత్రుడు కావాలని ఓ సారి అదితి వ్రతం చేస్తూ ఉంటుంది. ఆ సందర్బంలో స్త్రీలకు అశౌచం ఎప్పుడు కలుగుతుందో తెలియ జేసే ఘటన ఇక్కడ వివరించ బడి ఉంది. ఆ ఘటన ఏమిటంటే, స్త్రీలు ఎప్పుడూ వారి జుత్తుని ముడి వేయ్యకుండా ఉంచ కూడదు. అయితే, కొప్పులాగా ముడి వేసుకుని ఉండాలి లేదా జడలాగా అల్లుకుని ఉండాలి.


ఈ నాటి స్త్రీలకు సినిమాలే ప్రతి పాదిక. నూటికి తొంభై ఐదు శాతం స్త్రీలు ఆ సినిమాల ప్రభావం వల్ల జుట్టుని విరబోసుకుని తిరుగుతున్నారు. వివాహితలు కాని వారు అలా తిరిగారు అంటే, ఏదోలే వారి వంక చుట్టూ ఉన్న జనాలు చూడాలి అన్న భావనతో తిరిగారు అనుకోవచ్చు. వివాహితలు కూడా అలా తిరుగుతూ ఉంటే... ఇక వారికి ఎలా చెప్పాలో


వాళ్లకీ వీళ్లకీ చెప్పడం దేనికి, నాకు నేను చెప్పుకుంటే, ఎంతో శ్రేష్టం. అందుకని అన్నీ మూసుకుని, నా గోడుని ఇక్కడ వెళ్లగక్కుకుంటున్నాను.


-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్
కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి

7, డిసెంబర్ 2014, ఆదివారం

What is worth living .. జీవించడం అంటే..

జీవితం ... ఈ క్రింద ఉన్న వీడియో ఒక ప్రింటర్ వారి వ్యాపారాత్మక ప్రకటన. కాకపోతే, ఇందులో ఉన్న కధనం బాగుంది.










చివ్వరలో ఇచ్చిన వాక్యాన్ని కొంచం మార్చితే చాలా నచ్చింది.


to live side by side with someone, is a life worth living


ఈ చిన్న మాటలో ఎంత అర్దం దాగిఉందో కదా అనిపించింది .. భారతీయ సాంప్రదాయంలో విడాకులు అనే ప్రశక్తే లేదు .. ఆ విషయాన్ని ఎందుకు గమనించరో భారతీయులు. పాశ్చాచ్య దేశాలను చూచి వారి ఆత్మగౌరవాన్ని పోగొట్టుకుంటున్న ఈ నాటి దంపతులకు అహల్య వృత్తాంతం ఎందుకు అర్దం కావటం లేదో!!!


-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్
కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి

22, సెప్టెంబర్ 2013, ఆదివారం

ప్రయాగలు : వాటి వివరము

భారతీయ సంస్కృతిలో రెండు అంతకన్నా ఎక్కువనదుల సంగమమాన్ని ప్రయాగ అంటారు. ఈ విషయం నాకు ఈ మధ్యనే తెలిసింది. మొన్నామధ్య నాన్నగారి అస్తికలు ప్రయాగలో, అలహాబాద్ లోని ప్రయాగలో నిమజ్జనం చెయ్యడానికి వెళ్లి వచ్చిన తరువాతనే ఈ విషయం అర్దం అయ్యింది.

 

పేరు ఏ ఏ నదుల సంగమము
ప్రయాగ రాజ్ గంగ యమున సరస్వతి సంగమము
దేవ ప్రయాగ అలకనంద భాగీరధి సంగమము
రుద్ర ప్రయాగ అలకనంద మందాకిని సంగమము
కర్ణ ప్రయాగ పిండార్ గంగ అలకనంద సంగమము
నంద ప్రయాగ అలకనంద నంద సంగమము
విష్ణు ప్రయాగ అలకనంద విష్ణుగంగ సంగమము
సూర్య ప్రయాగ మందాకిని అలసత్రంగి సంగమము
ఇంద్ర ప్రయాగ భాగీరధి వ్యాస గంగ సంగమము
సోమ ప్రయాగ సోమనది మందాకిని సంగమము
భాస్కర ప్రయాగ భస్వతి భాగీరధి సంగమము
హరి ప్రయాగ హరి గంగ భాగీరధి సంగమము
గుప్త ప్రయాగ నీల గంగ భాగీరధి సంగమము
శ్యామ ప్రయాగ శ్యామ గంగ భాగీరధి సంగమము
కేషబ్ ప్రయాగ అలకనంద సరస్వతి సంగమము

 

కాకపోతే, వీటిల్లో చాలా చోట్లు ప్రస్తుత కాలంలో తెలియబడటం లేదు. ఉదాహరణకి అలసత్రంగి అనే నది ఒకటి ఉన్నది అని నాకు ఇంత వరకూ తెలియదు. వీటిల్లో వేటి గురించైనా తెలిసిన వారు, ఆ యా వివరాలను తెలియజేయ మనవి.

18, ఏప్రిల్ 2012, బుధవారం

నీతి శాస్త్రం : నడువడి ఎలా ఉండాలి

ఈ మధ్య కాలంలో ఏమీ వ్రాయాలని అనిపించక వ్రాయటం లేదు. ఇవ్వాళ మాత్రం ఇది వ్రాయక తప్పదని నిశ్చయించుకుని మొదలు పెడుతున్నాను. ఇక్కడ ప్రస్తావించే విషయాన్ని మానవ దృక్పధంతో ఆలోచిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. దీనిని కులమతాలకు అతీతంగా ఆలోచించాలి. భావం ప్రధానం కాని భాష్యం కాదు అని అనుకుంటే, సమగ్రంగా అర్దం అవుతుంది.

కొంతకాలంగా వీలు చేసుకుని శ్రీ మహా భాగవతము చదువుతున్నాను. అందలి కొన్ని విషయాలు ఇప్పుడు నన్ను ఇలా ప్రేరేపించాయి. పోతనగారి గురించి నేను ఏమి వ్రాసినా అది దయ్యాలు వేదాలు వల్లించినట్లుంటుంది. ఎందుకంటే, సాహిత్యం అనే పదమే కానీ దానిలోని గొప్పతనన్ని చాలా కాలం వరకూ ( .. గ్రహించడం మాట అటువుంచి, ఆ గొప్పతనాన్ని .. ) హేయాభావంతో చూస్తూ బ్రతికిన నాకు దాని గురించి ప్రస్తావించడం మినహా ఆఖ్యానించకూడదని అవగతం అయ్యింది. అలాంటి సాహిత్యానికి తలమానికమైన భాగవత, తెలుగు అనువాద రచయిత అయిన పోతనగారి గురించే!! అందునా నేను కామెంట్ చెయ్యటమా!!! హరి హరి.. ఎంతటి సాహసమో కదా అని చదివే వారు ముక్కున వేలువేసుకుని నోటితోనే కాదు చేతితోకూడా నవ్వుతారు. ఇప్పటికే ఎన్నో రాళ్ళు పడ్డాయి, వాటికి తోడుగా మరిన్ని అవసరమా నాకు. అందుకని పోతనగారిని ప్రస్తావిస్తూ, వారి కవితా చాతుర్యానికి వేవేల కొనియాడుతూ, వారు రచించిన కొన్ని పద్యాలను ఇక్కడ ప్రస్తావిస్తాను.

శ్రీ కృష్ణ భగవానుని నిర్యాణాంతరం ద్వారక నుండి ఖిన్నుడై వచ్చిన అర్జునుని చూచి ధర్మరాజు దుఃఖ హేతువుని తెలియక ప్రశ్నించిన ఘట్టమున రచించిన శ్లోకములు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

క. ఓడితివో శత్రువులకు నాడితివో సాధుదూషాలామ్ముల్
గూడితివో పరసతులను వీడితివో మానధనము వీరుల నడుమన్.

క. తప్పితివో యిచ్చెద నని, చెప్పితివో కపట సాక్షి చేసిన మేలుం
దప్పితివో శరణార్ధుల, రొప్పితివో ద్విజులఁ బసుల రోగుల సతులన్.

క. అడిచితివో భూసురులను, గుడిచితివో బాల వృద్ధు గురువులు వెలిగా
విడిచితివో యాశ్రితులను, ముడిచితివో పరుల విత్తములు లోభమునన్

అనిఅడుగుతారు ధర్మరాజు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. వీటి అర్దాలు నాకు అంతగా అవగతం అవ్వక పోయినా, నాకు అర్దం అయ్యినంత వరకూ ఏమి అర్దం అయ్యిందో వ్రాస్తాను.

మొదటి శ్లోకంలో ..

౧) శత్రువుల చేతిలో ఓడి పోయ్యావా
౨) సాధువుల యందు దూషణ చేసావా
౩) పరసతులను కూడి రమించావా, అంటే పర స్త్రీలతో రతి సంగమం కావించావా
౪) వీరుల మధ్యలో ఉండి మానము ధనము వంటి వాటిని వదిలి ప్రవర్తించావా

రెండొవ శ్లోకంలో ..

౫) ఏదైనా చేస్తాను అని ఇచ్చిన మాట తప్పావా
౬) కపటమైనటువంటి శాక్ష్యం చెప్పావా
౭) చేసిన మేలుకి తిరిగి మేలు చెయ్యడం అనే ప్రక్రియను తప్పావా (లేక మఱో భావంగా, మేలు చేసిన వారి మేలుని మెచ్చుకోక పోగా దెప్పి పొడిచేటట్టుగా ప్రవర్తించడం చేసావా )
౮) శరణార్దులను రక్షించకుండా ఏడిపించావా అంత యేకాక, పైన ప్రస్తావించిన వాటిల్లో, ద్విజులు రాజులు రోగులు లేదా స్త్రీలు ఉన్నారా

మూడొవ శ్లోకంలో ..

౯) భూసురులు అంటే రాజులను అణచావా
౧౦) బాలలను వృధులను గురువులను .. [[ ఏమి చేసారు అని అన్నారో అర్దం కాలేదు. నాకు తెలుగుని అర్దం చేసుకునే ఇంగితం లేనందున ]]
౧౧) ఆశ్రయించి ఉన్న వారిని విడిచి వెళ్లి పోయ్యావా
౧౨) లోభత్వం కలిగి ఉండి పరుల విత్తమును దాచుకున్నావా

అని నాకు అర్దం అయ్యింది. అంతే కాకుండా నాకు మఱింకో విషయం కూడా అర్దం అయ్యింది. ఒక వేళ అర్జునుడు పైన ఉదహరించిన వాటిల్లో ఏదైనా చేసి ఉన్నట్లైతే, కొన్నింటి యందు తత్వ చింతన చేస్తేనే అర్దమయ్యే విషయాలు కూడా ఇందులో ఉన్నాయి. మరికొన్నింటిలో తత్వ చింతన చేసినా నిస్పక్ష పాతంగా ఆలోచించగలిగే మనసు కలిగి ఉండాలి. అప్పుడే చేసిన పని తప్పు అని తెలిసి చింతిస్తారు. ఉదాహరణకి, సాధువుల యందు దూషణ అనే కార్యం తీసుకున్నాం అనుకుంటే, అర్జునుడు దూషణ చేసి ఉన్నా, అది సాధువులయందు అని గ్రహించడానికి మనసు ఒప్పుకోదు. వారేదో వెధవ పని చేసారు కాబట్టి నేను దూషణ చేసాను అని సమర్దించు కునే వాడు. అలా సమర్దించుకున్నా, తన తప్పు తెలుసుకుని పశ్చాతాపంతో దుఃఖించే స్థితికి చేరుకోవడం అంటే ఎంతో నిబద్దతతో కూడుకున్న వ్యక్తిత్వం కలిగిన వారై ఉండాలి. అలాంటి స్థితిలో అర్జునుడు ఉన్నాడు అని అనుకోవాలి.

ఇక్కడ ఉన్న విషయాలను క్షుణ్ణంగా కాకపోయినా మన స్థాయికి తగ్గట్టుగా ఆలోచించుకున్నా, చాలా విషయాలు మనకు అవగతం అవుతాయి. కానీ ఇక్కడ ప్రస్థావించినవి ఎన్ని వందల ఏళ్ళ క్రిందట అనే మాట ప్రక్కన పెడితే, ఎన్ని రోజులు క్రిందటిదైనా పాత చింతకాయ పచ్చడి రుచిగానే ఉన్నట్లు, ఈ మాటలు కూడా చాలా ప్రశస్తంగా మరింత క్రొత్తగా ఈ నాటి రోజులకు అనుగుణంగా రచించారా అన్నట్లు ఉన్నాయి. ఎవ్వరి గురించో నాకెందుకు, నా గురించి నేను ఆలోచించుకుంటే..

అను నిత్యం నేను శత్రువుల చేతిలో ఓడిపోతూనే ఉన్నాను. సాధువుల యందు దూషణ చేస్తూనే ఉన్నాను. పర సతులను కూడి బ్రతకటం లేదు కానీ కపట శాక్ష్యాలు అప్పుడప్పుడు చెబుతూ ఉంటాను. చేసిన మేలుకి కృతఙ్ఞతా పూర్వకంగా తిరిగి మేలు చేయకపోయినా, వారి సహృదయానికి గుర్తుగా ఉన్న (నా యందు వారు చేసిన) మేలుని మఱచి జీవిస్తూ ఉంటాను. ఆఖరులో లోభత్వం కలిగి పరుల విత్తమును అని అనను కానీ నాకు ఉధ్యోగం ఇచ్చే వ్యవస్థను సంకట స్థితిలో ఉంచి నా జీతాన్ని బేరం చేస్తూనే ఉన్నందున వారి ధనాన్ని ఆకాక్షించి దోచుకుని దాచుకుంటున్నాను అనిపిస్తోంది.

ఇదంతా నా గురించి నేను ఆత్మ విమర్స చేసుకునే సమయంలో ఒలికిన భావనలోని కొన్ని వాక్యాలు మాత్రమే. కానీ నా గురించి తీసి ప్రక్కన పెడితే, ప్రస్తుతం నేను ఉన్న సమాజంలో ఎంతమంది ఇలాంటి వాటిని గమనించి మెచ్చుకుంటారు? మెచ్చుకోవడం ఒక మాట అయితే, వాటిని అవగాహన చేసుకుని అర్దం చేసుకుని ఆ విధంగా జీవించే వారు ఎంతమంది? ఇలాంటి ప్రశ్నల పరంపర ప్రక్కన పెడితే ఇంత చక్కగా ప్రతీ మనిషి తన తోటి వారియందు సతు బుద్ది కలిగి ఉండాలి అని మన గ్రంధాలు చెబుతున్నాయని ఒప్పుకునే వారు చాలా అఱుదు అని నా అభిప్రాయం

31, డిసెంబర్ 2011, శనివారం

కొత్త సంవత్సరమా !!

స్వతహాగా నాకు ఆంగ్ల సంవత్సరం అంటే పెద్ద పట్టింపు ఉండేది కాదు. అది మఱో రోజు. కానీ ఈ మధ్య అందిన ఓ సమాచారం నన్ను ఆలోచించ చేసింది. ఆ సమాచారాన్ని యధావిధిగా ఇక్కడ ఉంచే ప్రయత్నం చేస్తాను. ఇది కొందరికి నచ్చక పోవచ్చు. కానీ నాకు నచ్చింది అందుకని ఇక్కడ ఉంచుతున్నాను.

జనవరి ౧ వ తారీఖున క్యాలెండర్ మారుతుంది

తెల్లవాడిని అనుసరించే గొఱెలు నమ్మే విషయం భారతీయ సింహాలు నమ్మే విషయాలు
తేదీ మార్పు అర్దరాత్రి 12 గంటలకు  తేదీ మారుతుందా?
ఎలా మారుతుంది?
ఏమార్పు కనిపిస్తుంది?
ఈ తేదీ మార్పునకు ఆధారం ఏమీ లేదు..
సూర్యోదయంతో చీకట్లు తొలగి ప్రపంచం నిదుర వీడి వెలుగు రేఖలు ప్రసరించాక సహజంగా వచ్చిన మార్పుతో తారీఖు మారుతుంది.
     
సంవత్సరం మార్పు జనవరి 1వతారీఖునకు గానీ డిసెంబర్ 30వ తారీఖునకు కానీ ప్రకృతిలో కానీ, వాతావరణంలో కానీ, గ్రాహాల స్థితిలో కానీ, భూమి గమనంలో కానీ ఏమార్పు ఉండదు. చాలా మంది తెల్లవాడి గొఱ్ఱెలకు జనవరి 1 నే సంవత్సరం  మారుతుందనుకుంటారు ఉగాది నాడు ప్రకృతిలో క్రొత్త ఆకులు చిగిర్చి, కోయిల పాటతో, శోభాయమానమైన వాతావరణంతో, నవీన శోభతో గ్రహ గమనాల ఆధారంగా కలిగే మార్పునే క్రొత్త సంవత్సరంగా భారతీయ సింహాలు భావిస్తారు.
     
క్యాలెండర్ మార్పు తెల్లవాడి క్యాలెండర్లో కేవలం వారాలు, తేదీలు మాత్రమే తెలుస్తాయి
ఏ రోజు ఏమి చెయ్యాలో / ఎప్పుడు తెలవారుతుందో / ఎప్పుడు ఏఏ మార్పులు వస్తాయో చెప్పలేని ఒక గీతల కాగితం గోడకు వేలాడుతుంది
తిధి, వారం, నక్షత్రం, కరణం, యోగం, అనే పంచ అంగాలతో సంవత్సరం పొడువునా ఏరోకు ఏమి చెయ్యాలో, విత్తు ఏప్పుడు నాటాలో, పెండ్లి ఎప్పుడు చెయ్యాలో, పగలు, రాత్రి, ఎప్పుడెప్పుడు వస్తాయో, చంద్రుడి గమనం ఏమిటో వివరిస్తూ, గ్రహాణాలు ఎప్పుడు వస్తాయో చెబుతూ, జీవితానికి క్రమపద్దతిలో ప్లానింగ్ ఇచ్చేది భారతీయ పంచాంగం

శాస్త్రీయంగా, విఙ్ఞానంగా, సనాతనంగా ఈ దేశంలో వస్తున్న పద్దతులను వదిలేసి, అశాస్త్రీయతకు ఆధారమైన తెల్ల వాడి పద్దతులపై ఎందుకీ వ్యామోహం?

వైఙ్ఞానీకంగా, ప్రకృతి సహజంగా, మానవాభివృద్ధికి ఆధారంగా ఉన్న మన ఉగాదిని సంబరంగా నూతన సంవత్సరంగా జరుపుకుందాం..

తెల్ల వాడి గొఱ్ఱెలుగా మారొద్దు. భారతీయ సింహాలు కండి..

11, అక్టోబర్ 2011, మంగళవారం

మింగుడు పడలేని నిజం

వృత్తి రీత్యా చాలా ప్రదేశాలు తిరిగినా, ప్రస్తుతం భాగ్యనగరంలో స్థిరపడ్డాను. నా వృత్తిలో ఎక్కువకాలం నేను భాగ్యనగరంలోనే గడిపాను అలాగే పెళ్ళైన తరువాత ఆరేళ్ళనుంచి ఇక్కడే ఉన్నాను. కావున ఇంకెక్కడికీ వెళ్ళాలనుకోవటం లేదు. ఇక్కడే ఉంటాను అనుకుంటున్నాను. కానీ కొన్ని నిజాలు నన్ను ఆలోచనలోకి తోస్తున్నాయి. వాటిల్లో మొదటిది ఆత్మహత్యల వివరాలు అలాగే మహిళలపై జరుగుతున్న హింసలపై ప్రభుత్వం చూపిస్తున్న గణాంకాలు. ఈ గణాంకాలు వెలుగులోకి వచ్చినవి మాత్రమే అని మఱచి పోకుండా, వెలుగులోకి రాకుండా ఎన్ని ఉన్నాయో అన్న భావన మరింత కృంగదీస్తోంది.
భారత దేశంలో హింస గురించి లెక్కా పత్రాలు తయారు చేసే పనిని కేంద్ర ప్రభుత్వ హోమ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో, NCRB, నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో, వారు నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం వారి వెబ్ సైట్ నందు 2009  సంవత్సర ప్రతిపాదకపట్టీ ఉంది. వారి లెక్కల ప్రకారం భారత దేశంలో మహిళలపై జరుగుతున్న హింసలలో ఆంద్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని. నమ్మబుద్ది కావటం లేదు కదూ, కానీ ఇది నిజమని లెక్కలే చెబుతుంటే, ఇదా నా ఆంద్రప్రదేశ్ అని ఏడవాలనిపిస్తోంది.
వీరి లెక్కలలో మఱో నగ్న సత్యం ఏమిటంటే, 2009 సంవత్సరంలో ఆత్మహత్యల ద్వారా చనిపోయిన వారి సంఖ్య 1,27,151. అంటే, సంవత్సరానికి 365 రోజుల లెక్కన ప్రతీ రోజు దాదాపుగా మూడువొందల యాభై మంది చనిపోతున్నారు. ప్రతీ నాలుగున్నర నిమిషాల వ్యవధిలో ఒక్కరు చొప్పున గంటకి పదిహేను మంది చొప్పున చనిపోతున్నారంటే, ఎందుకో అర్దం కాని పరిస్థితి. ఇదా నా భారత దేశం అని ఎంత చింతిస్తున్నానో అర్దం కావటం లేదు.
మొన్నా మధ్య అమెరికా వెళ్ళినప్పుడు ఇలాంటి వార్తలనే వారి నేషనల్ మ్యూజియంలో ఉన్నప్పుడు చిత్రీకరించి దానిపై ఓ పుటా వ్రాదామనుకున్నంతలో, హతవిధీ ఇలాంటి నిజాలు అక్కడే కాదు హింసా ప్రవృత్తి ఉన్న ప్రతీ చోట ఇది పునరావృత్తం అవుతూనే ఉంటుంది అనిపించింది. అమెరికాలో ప్రతీ రెండు గంటలకీ పన్నెండు మంది పిల్లలను హత్య చేస్తున్నారన్న విషయం నమ్మలేని మఱో నగ్న సత్యం.
USTripLiquidHub1 2010 248
ఇది నేను కల్పించిన చిత్రం కాదు, ఫిలడెల్ఫియాలోని నేషనల్ మ్యూజియం వారు బహిరంగంగా ఉంచినది.

ఎందుకీ హింసా ప్రవృత్తి? .. ఇప్పుడు కాదు, మఱోసారి.

23, జూన్ 2011, గురువారం

అమెరికా వాళ్ళే పిసినారోళ్ళు కాదు

ఇంతకు ముందు అమెరికా వాళ్ళ పిసినారి తనం గురించి ఓ వివరం వ్రాసుకున్నట్లు గుర్తు. కానీ ఇవ్వాళ ఈ లంకెలోని వ్యాసాన్ని చదివిన తరువాత నోటివెంట మాటరాలేదు. అమెరికా వారి గురించి వ్రాసుకున్నప్పుడు ఎనిమిది వందల బిలియన్ డాలర్ల గురించి ప్రస్తావిస్తే, గ్రాంట్ థ్రాన్‍టన్ సంస్థలో పనిచేస్తున్న హరీష్ చెపొచ్చేదేమిటంటె, ఇరవై బిలియన్ డాలర్ల ($20m) సొమ్ము నికరంగా నగదురూపంలో ప్రైవేట్ ఇన్వెస్టర్ల వద్ద మూలుగుతోంది. ఇంత పెద్ద మొత్తం కూడా పెట్టుబడికి సిద్దంగా ఉంది.

ఈయన కన్నా ఓ అడుగు ముందుకు వేసి బెంగళూర్ స్థానంగా వ్యాపారాన్ని నడుపుతున్న IDC Ventures యొక్క అధిపతి అయిన సుధీర్ సేథి ఇంకొంచం ముందుకెళ్ళి తొక్కలో ఇరవై ఏమిటి, చక్కగా ఓ డెబ్బైయ్యో లేదా డెబ్బైఅయిదు బిలియన్ డాలర్లు పెట్టుబడి చెయ్యక నగదు రూపంలో మూలుగుతున్నాయి అని అంటున్నారు. ఇలా అనడమే కాకుండా, వారి ఆలోచనలకు సాధ్యాసాధ్యలకు అనువైనటువంటి ఆలోచనలకు రూపం ఇచ్చేలాగా అంకెలతో గారడి చేస్తున్నారు.

ఈ అంకెల గారడి అంతా హంబక్.. పనిలేని వాళ్ళు వ్రాసుకునే చెత్త రాతలు అని అనుకుందాం అనుకుంటే, నేను బొర్లా పడ్డట్టే. ఎందుకంటే, ఈ సంవత్సరంలో మే నాటికి భారత దేశం నుంచి బయట దేశాలలో పెట్టుబడి పెట్టే నిమిత్తం తరలి వెళ్ళిన ధనాన్ని లెక్కల్లోకి తీసుకుంటే, క్రిందటి సంవత్సరానికన్నా దాదాపు సగానికి పడిపోయి (అంటే 59%), చూచాయిగా మూడున్నర బిలియన్ డాలర్లకు దగ్గరి దగ్గరగా ($3.7b) ఉంది అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు తెలియజేసారంటె, మన భారత దేశం నుంచి బయటకు వెళ్ళాల్సిన పెట్టుబడి ఆగి పోయినట్లే కదా. ఈ విషయాన్ని ఈ వ్యాసంలో చదువుకోంటుంటె, అదే వ్యాసంలో మఱో చోట మొత్తం మీద క్రిందటి సంవత్సరం కన్నా భారతీయులు ఈ సంవత్సరంలో చాలా తక్కువగా పెట్టుబడులు పెడుతున్నారని తెలియజేసే విధానం నాకు అబ్బుర పఱచింది.

ఇలాంటి విషయాలను చదువుతుంటె, పాపం అమెరికా వాళ్ళు మాత్రమే పిసినారోళ్ళు కదనిపిస్తోంది. ఇలా అమెరికా వారి గురించి వ్రాసినందుకు కించిత్ బాధగా ఉన్నా, ఎక్కడ ఎనిమిది వందల బిలియన్ డాలర్లు ఎక్కడ ఇరవై బిలియన్ డాలర్లు, లేదు కాదు అనుకుంటే, అధికపక్షం ఓ ఎనబై బిలియన్ డాలర్లను బేరీజు వేసుకుంటే, అమెరికా వాళ్ళ గురించి అలా వ్రాయడం పెద్ద విషయం కాదని దానిగురించి నేను అంతగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదనిపిస్తోంది.

9, జూన్ 2011, గురువారం

హమ్మయ్య !! ఓ పనైపోయింది

ఇవాళ్ళ ఈ చిత్రకారుని జీవితం ముగిశింది అని వ్రాయాలని చాలా మంది అనుకుంటారు, కానీ నాకు మాత్రం హమ్మయ్య అనిపించింది. ఎందుకంటే, వివాదాలకు మూల బిందువైన కారణం చేత భారతదేశాన్ని ఒదిలి వేరే దేశాలలో ఉంటూ భారతదేశాన్ని నిందించే ప్రముఖల చిట్టాలో ముందు ఎవ్వరున్నారు అని ఆలోచిస్తే, లండన్ నగరంలో కాలం చేసిన ఎమ్ ఎఫ్ హుస్సేన్ ముందుంటారు.

పుట్టిందేమో భారతదేశంలో, వివాదస్పదమైన చిత్రాలు భారతదేశానికి సంబందించినవి, భారతదేశ పౌరసత్వాన్ని కాదనుకుని వేరేదేశంలో ఉంటూ భారతదేశానికి వ్యతిరేకంగా స్టేట్ మెంట్స్ చేస్తూ భారతీయ సంస్కృతికి ఓ పెద్ద మచ్చలా నిలచిన వ్యక్తి. ఖత్తర్ యొక్క పౌరసత్వాన్ని తీసుకున్న తరువాత ఆఖరిరోజుల్లో భారతదేశానికి దూరంగా గత నాలుగైదేళ్ళ నుంచి అఙ్ఞాత వాశం చేస్తూ అదే పెద్ద గొప్పలా ఫీలై ఆఖరికి యాంత్రిక జీవనానికి అలవాటు పడ్డ లండన్ హాస్పిటల్లో హృద్రొగంతో మరణించడం నాకైతే పెద్ద భాధగాలేదు. భారత మాతను నగ్నంగా చూపిస్తూ చిత్రాన్ని గీసి దానికి చెత్త కారణాలు వెతుక్కున్న రోజున ఎంత భాధ పడ్డానో ఆ భాదకి ఈరోజున ఉపశమనం కలిగింది.

ఈయన భారతీయ దేవతలను చాలా తుశ్చంగా చిత్రింకరించినప్పుడు, మనసు బాధ పడ్డా, అవి కులమత గొడవలకు దారతీస్తాయని మౌనంగా ఉన్నా, కులమతాలకు అతీతంగా భరత మాతను నగ్నంగా చిత్రీకరించినప్పుడు ఇతనిపై హేయాభావం కలిగింది. నిజమే, ప్రాచూర్యం రావాలనుకోవడంలో తప్పులేదు, అంత మాత్రాన కనబడ్డ ప్రతీ అమ్మాయిని నగ్నంగా చిత్రీకరించాలనుకోవడం ఎంతటి హీన ఆలోచనో తలచుకుంటే వ్యగ్రతతో నా మనసు చాలా భాధపడుతుంది.

ఏది ఏమైనా, ఇది ఒక శుభదినం అని నేను చెప్పను కానీ ఇకపై భరతదేశ గౌరవాన్ని కించ పరిచే ప్రముఖలలో ఒక వ్యక్తి తక్కువైయ్యాడు అనేది నిజం.

26, జనవరి 2011, బుధవారం

రిపబ్లిక్ డే ప్రతిజ్ఞ

భారత దేశం నా మాతృభూమి. భారతీయులు అందరు నా సహోదరులు. నేను నా దేశమును ప్రేమించుచున్నాను. శుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణము. సుసంపన్నమైన, బహువిధమైన నాదేశ వారసత్వసంపద నాకు గర్వకారణము. దీనికి అర్హుడనగుటకై సర్వదా నేను కృషి చేయుదును. నేను నా తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను, పెద్దలందరిని గౌరవింతును. ప్రతివారితోను మర్యాదగా నడచుకొందును. నా దేశముపట్లను, నా ప్రజలపట్లను సేవానిరతి కలిగియుందునని ప్రతిజ్ఞ చేయుచున్నాను. వారి శ్రేయోభివృద్ధులే నా ఆనందమునకు మూలము.

 

ఇలా చిన్నప్పుడు ప్రతిజ్ఞ చేసినట్టు జ్ఞాపకము. ఈ రోజుల్లో అస్సలు ఎవ్వరికైనా ఇది గుర్తుందా?? ఇలా ఏ పాఠశాలలోనైనా పదిమంది చేత చెప్పిస్తున్నారా??(డౌటే) ఇందులో మార్పు చెయ్యాల్సిన విషయాలు ఏమిటబ్బా!! మరోసారి ఆలోచిస్తాను. అంతవరకూ .. జైహింద్.

24, జనవరి 2011, సోమవారం

రిపబ్లిక్ డే వచ్చేసిందోచ్.. బ్లాగర్లకు విన్నపం

రిపబ్లిక్ డే పరంగా పాఠశాల రోజులలో (అంటే చదువుకునే రోజులలో అని చదువుకో మనవి) మేము చక్కగా జరుపుకునే వాళ్ళము. నాకు గుర్తు తెలిసినప్పటి నుంచి నేను విజయవాడ SKPVV హిందూ హైస్కూల్ విధ్యార్ధిని. అలాగే మేము బావాజీ పేట మొదటి లైన్లో ఉండే వాళ్ళము. నాన్నగారు విజయవాడ రైల్వేస్టేషన్‍లో పని చేసే వారు. వారి ఉద్యోగరీత్యా ఉదయం తొమ్మిది గంటలకల్లా వెళ్ళే వారు. నాకు మ్యూజికల్ కళాశాలలో నాట్యభ్యాశం ముగించుకుని ఎనిమిదిన్నరకల్లా ఇంటికి చేరుకునే వాడిని. అలాంటి రోజుల్లో నాకు బాగా గుర్తున్న కొన్ని సంఘటనలలో ఒకటి నాన్నగారితో వెళ్ళి కూరగాయల మార్కెట్‍కు వెళ్ళి కూరగాయలు తీసుకుని వచ్చేవాడిని. కూరగాయలి కొనిచ్చి నాన్నగారు ఉద్యోగానికి వెళ్ళేవారు. ఆలా మార్కెట్ నుంచి వచ్చిన తరువాత అమ్మ పెట్టిన పెరుగన్నం తిని ఝాం ఝాం అంటూ స్కూల్‍కి పరిగెత్తే వాడిని. అదిగో అలాంటి రోజుల్లో మరొకటి ఈ రిపబ్లిక్ డే రోజు.

స్వతహాగా మా పాఠశాల నిభందనల ప్రకారం ఆకు పచ్చ లాగు అలాగే తెల్ల చొక్కా వేసుకుని వెళ్ళేవాళ్ళం. అలాగే నాట్యాభ్యాసానికి తెల్ల పైజామా పై తెల్ల కుర్తా వేసుకుని వెళ్ళే వాడిని. కానీ ఒక్క రిపబ్లిక్ డే నాడు మాత్రం చక్కగా ఉదయం నుంచి సాయంత్రం దాకా వైట్ అండ్ వైట్ అన్న మాట. అలా తెల్ల డ్రస్ వేసుకుని చాలా మంది వచ్చే వాళ్ళు కానీ నేను మాత్రం తళతళ మని మెరుస్తూ ఉండే వాడిని. ఎందుకంటారా.. తెల్ల లాల్చి కుర్తా డ్రస్‍పై మా అమ్మ చాలా శ్రద్ద తీసుకునేది. ఎందుకంటే ఇది భరతనాట్యం నేర్చుకునేటప్పుడు వేసుకునే డ్రస్ కదా అందుకన్నమాట. మా అమ్మకు నాట్యం అంటే ఎందుకో తెలియని అభిమానం. అందువల్ల స్కూల్ విధ్యార్దులందరిలో నేను కొంచం స్పెషల్‍గా కనబడే వాడిని. అలా మెరుస్తూ ఉండటం వల్ల మా హెడ్ మాస్టారు గారు ఆ నాటి ప్రతిజ్ఞని నా చేత చదివించే వారు. అలా అలవాటైన ప్రతిజ్ఞా కార్యక్రమం ఇంటర్ మీడియట్ కాలేజీ రోజుల్లో కొనసాగినా, డిగ్రీ రోజుల్లో సాగలేదు. అందుకు కారణం నేను చదువుకున్నది ముస్లిం కాలేజీ. అక్కడ ఇలాంటివి పాటించేవారు కాదు.

కానీ ఉద్యోగ భాధ్యతలు వచ్చిన తరువాత నేను చొరవ తీసుకుని ఈ రోజున అక్కడ పని చేసే వారిలో ఔత్సాహికులను ఓ చోట చేర్చి జండా వందన కార్యక్రమం చేసే వాడిని. పోను పోను ఔత్సాహికులు తగ్గిపోవడం వల్ల రిపబ్లిక్ డే అలాగే ఇండిపెండెన్స్ డే ఒక సెలవు రోజుగా మాత్రమే మిగిలిపోయింది కానీ అంతకన్నా ఎక్కువ ఏమీ జరగటం లేదు. కనీసం ఆ నాడైనా బ్లాగర్లు అందరూ ఓ పోస్టు వేస్తే బాగుంటుందని నా ప్రపోజల్. చదివే వారు ఏమంటారు?

10, ఫిబ్రవరి 2010, బుధవారం

నన్నయ్యపై వ్రాసిన పుట - ఆత్మావలోకనం

 

క్రిందటి సంవత్సరం జులై నెలలో ఏడవ తారీఖున నేను పూజ్యనీయులైన నన్నయపై ఒక పుట వ్రాసాను. ఆ తరువాత కొంతకాలానికి ఆ పుటని నేను పునఃపరిశీలించాను. అప్పుడు నాలో నాపై కలిగిన ఆలోచనలు, భావనలు, స్పందనలు, వగైరా వగైరా నన్ను ఆత్మావలోకనం చేసుకునేటట్టు చేసాయి. అలాంటి ఆత్మావలోకనం లోంచి ఉద్బవించినదే ఈ పుట. మరి మీ ఆలోచనలేమిటో సెలవివ్వండి

మొదటగా నా ఆలోచనలు.

అచ్చంగా అర ఠావు నిండా అచ్చు తప్పులు లేకుండా వ్రాయడం చేతగాని నేను.. ఆది కవి అని ఎంతో మంది చేత జేజేలు అందుకున్న మహానుభావుని గురించి (హాస్యాస్పదంగా నైనా సరే..) వ్రాయడమా. ఎంతటి మూర్ఖత్వము? గూగుల్ వాళ్ళని అడిగి కొన్ని కొన్ని వెబ్ సైట్లలో జరిగిన చర్చలను తీసుకుని వచ్చి ఏదో పాయింట్ ఉంది అని వ్రాయడం ఎంత మాత్రం హర్షదాయకం. ఒక వేళ్ళ నేను ఉదహరించిన పాయింట్స్ నిజమై ఉండొచ్చు, అన్నంత మాత్రాన నా భాషలో అంతటి చులకనా భావం అవసరమా!! అక్కడ స్పందించిన వారిలో మరో పూజ్యనీయులైన డా॥ పాండు రంగ శర్మగారు ఉదహరించిన పాయింట్ లాజికల్ గానే ఉంది. కానీ, నిజం చెప్పాలంటే, నాకు సదురు "పాండు రంగ శర్మగారి లాంటి వారితో ఈ విషయంపై చర్చించటం.." అనే విషయాన్ని కాదు కదా అస్సలు అలాంటి విషయాన్ని వీరిని అడగటానికి సరైన పదాలే నావద్ద లేవంటే, నాకు తెలుగు భాషపై ఉన్న పట్టు మీకే అర్దం అవుతుంది. అలాంటి నేను, అల్పులలో అత్యంత అల్పుడను, నన్నయ్య వంటి (ఘనాపాటి అనచ్చో లేదో తెలియదు) మహాను భావులను తూలనాడటమా.. ఎంతటి ఘోర తప్పిదము? నా స్వార్దం కోసం ఇలాంటి మహానుభావులు బలి కాకూడదు.

అంతటితో ఆగకుండా నాకు విద్యా బుద్దులు నేర్పిన గురువులను చులకనగా ప్రస్తావించడం ఏమాత్రమూ మెచ్చుకోదగినది కాదు. ఇది ఒక విధంగా గురు ధూషణే అని నా అభిప్రాయం. మరి దీనికి ప్రాయశ్చిత్తం ఏమిటని ఆలోచిస్తే, భహిరంగంగా చేసిన తప్పుని ఒప్పుకోక తప్పదని నా మనసుకు అనిపించింది. తత్ ఫలితమే ఈ పుట. అందుకని సభా పూర్వకంగా, బ్లాగు ముఖంగా ..

నన్నయ్య గారికి మరియు నాకు విధ్యా బుద్దులు

నేర్పిన గురువులకు హృదయపూర్వక క్షమాపణలు.

మన్నించండి.. క్షమించండి..

14, నవంబర్ 2009, శనివారం

బుక్ ఎగ్జిబిషన్ కమిటీ ప్రస్తావన : సలహాలు

ఉండాలి .. ఉండాలి .. అందరూ బాగుండాలి.

నిరుడు జరిగిన బుక్ ఎగ్జిబిషన్ నందు e-తెలుగు వారి ఆధ్వర్యంలో మరియు తోటి తెలుగు బ్లాగర్ల సహకారంతో నడిచిన స్టాల్ ని మీరందరూ విచ్చేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందులకు అందరికీ e-తెలుగు వారి తరుఫున ధన్యవాదములు. మరి  రాబోయే బుక్ ఎగ్జిబిషన్ నందు ఒక స్టాల్ నిర్వహిస్తే ఎంతమంది సహకరిస్తారో అన్న తలంపుతో ఉద్బవించినదే ఈ జాబు.

ఇక అసలు విషయానికి వస్తే, ఔత్సాహికులు ఎంతమంది పాల్గొనడానికి సిద్దంగా ఉన్నారో తెలియజేయ ప్రార్దన. ఈ కమిటీలో సభ్యులు కావలసిన వారు e-తెలుగులో సభ్యత్వం తీసుకోవాలన్న నియమం ఏమీ లేదు. కావున అందరూ అర్హులే. ఇది రాజుగారి ఇంట్లో పెళ్ళి కావున తెలుగు పాలు పోయ్యాల్సిందిగా
విన్నవించుకుంటున్నాము. అందరూ పాలు పోస్తున్నారుగా నా గ్లాసు నీళ్ళతో చేరుకున్న పాలేమీ పలుచనైపోవు అని అనుకోకుండా అందరూ తృణమో.. ఫలమో.. చేతి సాయమో.. నోటి సాయమో.. లేక మరేదైనా వేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చెయ్యాల్సిందిగా కోరుకుంటున్నాను.

 

మీ మీ అభిప్రాయాలు.. సలహాలు.. సూచనలూ.. నిందలు.. అపవాదులు.. వగైరా వగైరా.. ఏవైనా నేను స్వీకరించడానికి సిద్దంగా ఉన్నాను అని సవినయంగా తెలియజేసుకుంటున్నాను. దయచేసి చదివిన ప్రతి ఒక్కరూ స్పందించ ప్రార్దన.

మొదటి సలహా అందినది, కావున సలహా పాటించడమైనదని గమనించగలరు

12, నవంబర్ 2009, గురువారం

నేను కూడా లంచం ఇచ్చానోచ్

 

ఈ పుట చదివే వాళ్ళలో పోలీసోళ్ళు ఉన్నా (లేక) పోలీసు సానుభూతి పరులు ఉన్నా (లేక) పోలీసులకు చుట్టాలు ఉన్నా (లేక) పోలీసు అవ్వుదాం అనుకునే వాళ్ళున్నా (లేక) పోలీసు అంటే ఇష్టం ఉన్న వాళ్ళంతా దయచేసి మఱో బ్లాగుకి పోయి ఆ విషయాన్ని ఆనందించండి. ఇది మీ లాంటి వాళ్ళు చదివి జీర్ణించుకోలేరు. ఒక వేళ జీర్ణించుకున్నారంటే మీకు ఎంత వంట పట్టిందో చెప్పనక్కరలేదు.

ఓ మర్చిపోయ్యాను .. లంచం ఇవ్వడం తప్పు అలాగే పుచ్చుకోవడం తప్పు కాబట్టి .. పోలీసోళ్ళ భాషలో "ఖర్చుల నిమిత్తం " అని మీరు మార్చుకుని చదువుకోండి

ఇక అసలు విషయానికి వస్తా. నా పాస్ పోర్ట్ పరిమితి కాలం అయ్యిపోనది అందుకని తత్కాల్ లో కావాలని పాస్ పోర్ట్ కార్యాలయంలో దరకాస్తు చేసుకున్నాను. దరకాస్తు చేసుకోవడం ఇంత సులువైన పని అని నాకు అప్పటి వరకూ తెలియదు. మొదటిసారి అప్లై చేసుకున్నప్పుడు నా అంతట నేనే పాస్ పోర్ట్ దరకాస్తు ఫారం తెచ్చుకుని మూడువందల రూపాయల డీడీ తీసి చక్కగా తంతీ తపాళా వారి రిజిస్టర్ పోస్టు చేస్తే, ఖచ్చితంగా ముఫై రోజుల్లో పోలీసోడు వచ్చి వెరిఫికేషన్ చేసుకుని, దారి ఖర్చులకు డబ్బులడిగాడు. అప్పుడు మా పరిస్తితి అంతంత మాత్రం. అందువల్ల తెగించి వస్తే వస్తుంది లేకపోతే రాదు అన్న తెగింపుతో ఇవ్వను అని చెప్పెసాను. సరే అని వెళ్ళిన ఆ అధికారి మా నాన్నగారితో మాట్లాడాలన్నాడు. నాన్నగారు ఇంట్లో లేరు అని అప్పటికి దాటేశాను. సరే అని అప్పటి జారుకున్న సదురు పోలీసాయన, మరో పది రోజుల తరువాత మళ్ళీ వచ్చి దారి ఖర్చులకు రొక్కం అడిగాడు. అప్పుడు కూడా నాన్నగారు లేరని దాట వేస్తే అస్సలు విషయం చెప్పాడు. ఏమిటంటే, సదురు పోలీసు ఇంక్వైరీలో చెడుగా వ్రాస్తే ఇక జీవితంలో పాస్ పోర్ట్ రాదని. అప్పటికో నేను ఇవ్వకుండా ఉండటానికి చెప్పాల్సినన్ని కధలు చెప్పాను. దానితో మన పోలీసాయనకు మండింది. ఇంకే దరకాస్తు ఫారం పైన మేము ఇంటిలో లేమని వ్రాసి తిరిగి పంపేశాడు. మా దురదృష్టం ఏమిటంటె, ఆ రోజుల్లో పాస్ పోర్ట్స్ అన్నీ ఈ ఒక్క పోలీసాయనే చెయ్యాలంట. అప్పుడు కధ కాస్తా తిరిగి తిరిగి మా లోకల్ పోలీస్ స్టేషన్ వాళ్ళ దెగ్గరకు చేరుకుంది.

 

గుడిలో లింగాన్ని మ్రింగాలని ఒకడు ఆలోచిస్తుంటే ఏకంగా గుడినే మ్రింగేస్తే ఎలా ఉంటుంది అని మరొకడు ఆలోచించాడంట. ఈ పోలీసోళ్లు అంతే. ఇదిగో ఇక మన లోకల్ కానిస్టేబుల్ గారు మా ఇంటికొచ్చి నా గురించి ఎంక్వైరీ మొదలు పెట్టాడు. దాంతో మా నాన్నగారికి ఒకటే ఖంగారు, నేనేమి తప్పు చేసానా అని. ఇక అక్కడితో ఆ తతంగం ఆగితే ఫరవాలేదు, మా ప్రక్కింటి వాళ్ళని కూడా అడగటం మొదెలెట్టాడు సదురు కానిస్టేబుల్. దాంతో మా పొరుగోళ్ళు కూడా కంగారు పడ్డారు, నేనేదో గొడవలో ఇరుక్కోవడం వల్లే ఈ సమాచారం అడుగుతున్నాడని. సరే అని మేము సర్దుకుని ఊరుకుని అన్నీ పద్దతి ప్రకారం జరగాలి కదా అనుకుంటూ ఉంటే, ఇవన్నీ జరిగిన తరువాత చావు కబురు చల్లంగా చెప్పాడు. మేము అర్జంటుగా పోయి ఇంతక ముందు వచ్చిన పాస్ పోర్ట్  అధికారికి తృణమో ఫలమో ఇస్తే బాగుంటుంది లేక పోతే ఫైలు ముందుకు కదలదు సరికదా ఇలాంటి వెటకారమైన పనులు మాత్రం మాకు తప్పవని. ఇంకే తప్పని సరై మా నాన్నగారికి తెలియకుండా నేనే వెళ్ళి ఓ వంద రూపాయలు లంచం ఇవ్వాల్సి వచ్చింది. ఛా.. ఏంటి ఆ మాట అంటారా.. అదే నండి పోలీశోళ్ళ భాషలో నా కాగితం ముందుకు వెళ్ళాలంటే కొంత ఖర్చు అవుతుంది కదా, అదేనండి పోస్టాఫీసుకి వెళ్ళాలి అక్కడ స్టాంపులు తీసుకోవాలి. మళ్ళీ లోకల్ పోలీసోళ్ళకి ఇన్ ఫర్ మేషన్ చేరవెయ్యాలి.. వగైరా వగైరా అన్న మాట.

 

ఇదంతా పదేళ్ళ క్రిందటి మాటైతే, ఇప్పుడు పరిస్తితి మరోలా ఉంది. పైన చెప్పినట్లుగా నేను పాస్ పోర్ట్ ని తిరిగి పొందేందుకు చేసుకున్న ఆలోచనలో మొదటి అంకం దరకాస్తు ఫారం నింపి పరిశీలన నిమిత్తం అంద జేయ్యాలి. సరే.. అన్నీ డాక్యుమెంట్లు ఉన్నాయి కదా అనుకుని ఇచ్చిన సమయానికి మ్రుందే చేరుకుని కావాల్సిన పత్రాలన్నింటినీ చూపించి ఈనెల మూడవతారీఖున దరకాస్తు చేసుకున్నాను. పాస్ పోర్ట్ అప్లై చేసుకునే వాళ్ళకు నాది ఒకటే అభ్యర్దన. మధ్యవర్తులను నమ్మకండి. చక్కగా మీ అంతట మీరే వెళ్ళి దరకాస్తు చేసుకోండి. ఇప్పుడు ఈ పనులన్నీ చాలా శులభతరం చేసారు. ఇక నా విషయానికి వస్తే, నా దరకాస్తు ఫారం కాస్తా పోలీస్ వెరిఫికేషన్ కోసం గత శనివారం వచ్చింది. ఇంకే మరో పోలీసు గుంటనక్క మా ఇంటికి చేరుకుంది. అడిగిన కాగితాలు చూపించాం కావలసిన నకలు పత్రాలు అంద జేసాం. ఇవన్నీ చాలవన్నట్టు, మేము అద్దెకు ఉంటునట్లుగా మా ఇంటి ఓనర్ దగ్గర నుంచి కాగితం కావాలన్నాడు. అడిగినదే తడవుగా మా లీజ్ ఎగ్రిమెంట్ చూపించా. మరేదో లేదన్నాడు. అదీ చీపించా. ఇంకే మన నక్క తెలివితేటలు ఉపయోగించి మా ఎగ్రిమెంటు నోటరీ చేయించలేదు కావున చెల్లదు అంటూ అది చేసి మరునాడు ఉదయం పదిన్నరకు ఐమాక్స్ ధియేటర్ ఎదురుగా ఉన్న పాస్ పోర్ట్ సెల్ దగ్గరకు వచ్చి ఇవ్వమన్నాడు. అప్పుడు అర్దం అయ్యింది మనోడు పైసలు ఇస్తేనే గానీ వదలడు అని. కానీ అస్సలు దారి ఖర్చుల విషయం ఏమీ మాట్లాడ లేదు కదా అని ఊరుకున్నాను. మరునాడు చెప్పిన సమయానికి చక్కగా అన్ని కాగితాలు పట్టుకుని వెళితే, అప్పుడు మూల్గాడు అసలు విషయం.

 

అదిగో అప్పుడు నాకు కాలింది. ఎందుకు ఇవ్వాలి సార్ అన్నా. అదే డైలాగ్ .. పాస్ పోర్టుని లోకల్ పోస్టాఫీస్ ద్వారా లోకల్ పోలీస్ స్టేషన్ కి పంపించాలిగదా అక్కడ ఖర్చు ఉంటుంది కదా .. అంటూ యదవ సోది చెప్ప బోయ్యాడు. అప్పుడు నేను అన్నాను, వీటన్ని ఖర్చుల నిమిత్తమై కదా తత్కాల్ లో ఎక్కువ పెట్టి చేయించుకునేది. ఇక మన నక్కగారికి పూనకం వచ్చి అచ్చంగా తోడేలైయ్యాడు. నా మీద ఘీంకరించడం మొదలైంది. ఇక్కడ వ్రాయలేను అసభ్య పదజాలం వీరు ఉపయోగించారు. ఇక లాభం లేదనుకుని ఖర్చుల నిమిత్తం ఎంత అవసరపడొచ్చు అంటే, ఓ రెండివ్వండి అన్నాడు. సరే రొండొందలే కదా అని రెండు వంద నోట్లు తీసి చేతిలో పెట్ట బోతే ఏదో చీడ పురుగుని చూసినట్టు చూసి, ఇది తత్కాల్ కాబట్టి మరో సున్నావేసి ఇవ్వు అన్నాడు. మరి కొంత సేపు వాగ్వివాదం. ఇదంతా ఎక్కడనుకున్నారు, అచ్చంగా పోలీసు వారి అధికారిక కార్యాలయంలో. అక్కడ మనం ఏదైనా అన్నాం అనుకోండి ఇంకే ముంది, రాజ్యం వాళ్ళది కదా బొక్కలో వేసి కుమ్ముడే!! కాదంటారా.. ఆఖరుకి ఒకటిన్నరకన్నా తగ్గితే ఊరుకునేది లేదు అని కరాఖండీగా చెప్పెశాడు.

వీళ్ళ గురించి ముందే తెలుసు కాబట్టి ఎవ్వరైనా తెలిసిన పోలీసు చేత చెప్పిస్తే వింటాడు కదా అని ప్రయత్నిస్తే, సదురు పోలీసు కుక్క కూడా ఇదే చెప్పింది. మనకు వాళ్ళతో గొడవ వద్దు కానీ అడిగింది ఇచ్చేయ్ మనకు ఎప్పుడైనా అవసరం పడితే చేస్తాడు, అని సమాధానమిచ్చింది. ఎంతైనా ఓ గూటి పక్షులే కదా వీరంతా అనుకుని అనువుగాని చోట అధికుల మనరాదని సమర్దించుకుని అడిగినంత ఇచ్చి మెల్లగా జారుకున్నాను.

 

ఇందు మూలముగా యావన్మందికీ తెలిజ జేయునది ఏమనగా, సదురు పోలీసు జాగిలం మీ యింటికి వచ్చినప్పుడే విషయాన్ని తేల్చేసుకుంటె మీకు వారి చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు అలాగే మీకూ తలకాయ నొప్పి ఉండదు. ఈ స్వతంత్ర భారత దేశ యంత్రాగానికి నిధులు కరువైనాయి కనుక మన ఇంట్లో కుక్కలకి బిస్కెట్లు పడేసినట్లుగా ఇలా ఖర్చుల నిమిత్తం బ్లాక్ మైల్ చేసి డబ్బులు దండుకునే పోలీసులోళ్ళనుంచి దూరంగా ఉండడమే మంచిదని నా అభిమానం. ఆఖరుగా మాతాత గారు చెప్పిన ఓ విషయం స్మరించుకుంటాను

దుష్టులను దూరంగా ఉంచకూడదంట, వాళ్ళకి మనం దూరంగా ఉండాలంట.

పై విధంగా, మా ఇంటికొచ్చిన రాయల్ బ్లాక్ మైలర్ బెగ్గర్ కి ఖర్చుల నిమిత్తం ఒకటిన్నర సమర్పించుకున్నానని సవినయంగా విన్నవించుకుంటున్నాను

 
Clicky Web Analytics