14 లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
14 లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

14, జూన్ 2011, మంగళవారం

మహిళా సంఘాలు – నిద్దరోతున్నారా!!

మహిళా సంఘాలు ఈ మధ్య నిద్దరోతున్నట్లున్నాయి. మహిళలను కించ పఱచే విధంగా ఎటువంటి ప్రకటనలు వచ్చినా వాటిని కారణంగా పెట్టుకుని మీడియాలో పేరు తెచ్చుకునే ప్రయత్నం చేసే మహిళా సంఘాలకు ఎయిర్ టెల్ వారి ప్రకటనలో మహిళలపై జరుగుతున్న అమర్యాదను మరియు మగాళ్ళ హీన ప్రవృత్తి కనబడట్టు లేదు. ఎందుకంటే, దానిలో వారికి ఎటువంటి అసభ్యం కనబడటం లేదు కదా అని సమర్దించుకుంటారు. అంతే కానీ నైతికమైన విలువలకు గండి కొట్టి హింసా ప్రవృత్తిని ప్రేరేపించే విధంగా సాగుతున్న ఈ ప్రకటన ఎవ్వరి కంటా పడట్టు లేదు.

ఈ ప్రకటన జాగ్రత్తగా గమనిస్తే, ఓ ముసలాయన తన మనవడితో చేసిన సంబాషణ ఇలా ఈ క్రింది విధంగా సాగింది.

మనవడు : తాతా, ఇక్కడెందుకు ఆగవు?

తాత : మా పెళ్ళికి ముందు ఇక్కడే.. కాంతీ లాల్ అనే బద్మాష్ మీ బామ్మ బుగ్గపై <డాష్ .. డాష్ ..> వాడి పళ్ళు ఊడకొట్టలేక పోయ్యాను..

మనవడు : ఒక్క నిమిషం ఆగు. హాల్లో !! కిషన్ గంజ్ లోని కాంతీలాల్ గోడ్ బోలే ఎవ్వరికైనా తెలుసా!!

[[ కొంత సేపటికి సీన్ కాంతీలాల్ గోడ్ బోలే ఇంటి ముందు ..]]

ఆ ఇంటి వాకిలికి ఇవతల తాత మనవడు అటువైపు సదరు కాంతీలాల్ తన భార్యతో ఉంటాడు. ఈ కధలోని తాతగారు, “హిసాబ్ బరాబర్ ..” అంటూ అటువైపు ఉన్న మహిళ బుగ్గపై ముద్దుపెట్టి పారిపోతాడు.

నాకు అర్దం అయ్యిందేమిటంటే, ఎవ్వడైనా నా భార్యని ముద్దు పెట్టుకుంటే, నేను వెళ్ళి వాడి బార్యని ముద్దు పెట్టుకుంటే సరి పోతుందన్న మాట. కాకపోతే నేను చేసేటప్పుడు ప్రక్కన ఓ పిల్లవాడిని పెట్టుకుంటే సరిపోతుందన్నమాట.

ఇక్కడ చూపించిన ప్రకటనలో రెండుసార్లు ముద్దుకు గురైన మహిళలకు మర్యాద అక్కరలేదన్నమాట. రెండు సార్లు ముద్దు పెట్టుకున్న మగాడు హీరో అన్నమాట. ఇలా కంటికి కన్ను పంటికి పన్ను అనే నైపధ్యంలో సాగిన ఈ ప్రకటన మహిళల మర్యాదకు ఎటువంటి భంగపాటు కలగలేదన్నమాట.

ఇవేనా మనం మన తరువాతి తరం వారికి నేర్పే నైతిక విలువలు? తొక్కలో విలువలు, ఇక్కడ అందులో పోయిందేముంది మీ చాదస్తం తప్పితే అంటారా.. అయితే నిజ్జంగానే నాకు చాదస్తం. ఏమి చేస్తాం? నేను ఓల్డ్ ఫాషన్ కదా..

14, ఏప్రిల్ 2011, గురువారం

పుణ్యభూమిపై జరుగుతున్న దాడి – మహానుభావుల భావన

కొంతకాలం క్రిందట పుణ్యభూమి అనే గుంపునందు ఓ చర్చ జరిగింది. ఆ చర్చలో ఇద్దరు వ్యక్తులు నా భావాలకు వ్యతిరేకంగా స్పందించారు. వారిలో మొదటి వారు ఓ పేరు మోసిన తెలుగు బ్లాగర్ గారైతే, పరదేశి గారు మరొకరు. వీరి భావనలలోని ఆంతర్యం మరో మహానుభావునితో పోలి ఉందని ఈ మధ్య నాకు అర్దం అయ్యింది. వీరందరి ఆలోచనలలో చాలాచక్కటి పోలికే కాక భారతీయత యందు వీరందరికీ చాలా దగ్గరి సంబంధం కనబడుతోంది. ఇంతకీ ఆ మూడో వ్యక్తి ఎవ్వరంటే, గౌరవనీయులైన గరిక పాటి నరశింహా రావు గారు.
ప్రతీరోజు భక్తి టీవిలో గరికపాటి వారు రామాయణం గురించి ప్రసంగం చేస్తున్నారు. మధ్య మధ్యలో వీరు పిట్టకధలుగా రామాయణం నుంచి తొలగి మన సంసృతికి పడుతున్న దుర్ఘతి గురించి వీరు పడుతున్న ఆవేదన పడుతూ చేసే వ్యాఖ్యానాలు పైన ఉదహరించిన వారి భావనలతో నూటికి నూరు శాతం సరిపోతుంది.  ఒక్కొసారి ఈ చర్చలో జరిగిన విషయాన్ని చదువుతుంటే, గరికపాటి వారి వ్యాఖ్యానం వింటుంటే చాలా ముచ్చటేస్తుంది.
నిజంగానే ఇది ఓ సరి అయిన సమయం, ముష్కరులపై మనం కూడా దాడి చెయ్యాలి. ఈ విషయం తెలియడానికి నాకు చాలా సమయం పట్టింది, కానీ వీరిని నేను అపార్దం చేసుకోలేదని బ్లాగు పూర్వకంగా వినతి. ఇక దాడి విషయానికి వస్తే, వివాదాలకి దూరంగా ఉంటూ వచ్చిన నాకు వివాదస్పదమైన చర్చ జరుగుతున్నప్పుడు వెళ్ళి అనవసర దాడిని తిరిగి త్రిప్పి కొట్టే ప్రయత్నం చెయ్యడానికి కొంచం ధైర్యం కావాలి. మన సంసృతిపై సరి అయిన అవగాహన వస్తే ధైర్యం దానంతట అదే వచ్చేస్తుంది. అలాగే చొరవ వస్తుందని నమ్ముతూ సంసృతిని అర్దం చేసుకునే ప్రయత్నం చేస్తాను.
అన్యమనస్కంగా ఆ ఇద్దరి పేర్లను ఇంతకు ముందు ప్రస్తావించినందులకు వారి అభిమతం దెబ్బదిన్నట్లైతే, మన్నించ ప్రార్ధన.

14, అక్టోబర్ 2010, గురువారం

నా పోర్ట్ ఫోలియోలో నష్టాల షేర్లు

ఈ మధ్య మన షేర్ మార్కెట్ భలే పరుగెడుతోంది. ఇవ్వాళ్ళ ఆల్ టైం హై చేరుకుంది. సన్సెక్స్ గరిష్టంగా 20710 వద్దకు చేరుకోగా నిఫ్టీ 6239 కు చేరుకుని రికార్డులు బద్దలు కొట్టాయి. ఇంత జరుగుతున్నా నా పోర్టు ఫోలియోలో రెండు స్టాక్స్ మాత్రం నాకు నష్టాన్ని చూపిస్తున్నాయి. వాటిల్లో మొదటిది NHPC రెండవది రిసర్గీస్ మైన్స్. వీటి ద్వారా నేను నష్ట పోయింది పెద్దగా లేదు కానీ ఎందుకో ఈ రెండు షేర్లలో పెద్దగా చలనం కనబడటం లేదు.

NHPC షేర్ ద్వారా నేను 1400/- నష్టపోతే, రిసర్గీస్ ద్వారా 2100/- రూపాయలు నష్టపోయ్యాను. మొత్తం మీద 3500/- నష్టం ఈ నాటి లెక్కల ద్వారా. ఈ రెండు షేర్స్ కొనడానికి నా దగ్గర ఉన్న జెస్టిఫికేషన్ ఏమిటంటే ఫండమెంటల్స్ బాగుండటం మాత్రమే కాకుండా మార్కెట్లో వీటి ధర నాకు అందుబాటులో ఉండటమే. నేను పెద్ద పెద్ద షేర్స్ పైన ఎక్కువ మొత్తాన్ని పెట్టుబడి పెట్టలేను కాని చిన్న చిన్న కంపెనీలపై దీర్ఘకాలిక ప్రణాళికతో ఇన్వెస్ట్ చేస్తాను అన్నమాట.

వివరాల్లోకి వెళ్ళే ముందు షేర్స్ పై నేను ఎందుకు ఇన్వెస్ట్ చేస్తానో చెబితే ఈ రెండు షేర్స్ ఎందుకు ఇన్వెస్ట్ చేసానో మీకు అర్దం అవుతుంది. షేర్స్ లో నేను పెట్టుబడి పెట్టే ప్రతీ రూపాయి నాకు పదేళ్ళ తరువాత పనికి వచ్చే ఆదాయం అన్న ఉద్దేశ్యంతో స్వల్ప కాల వ్యవధి కాకుండా దీర్ఘకాల ప్రణాళిక అన్నమాట. అందువల్ల ప్రస్తుతం ఉన్న బుల్ మార్కెట్లో నేను లాభాలను దండుకోవటం లేదు. ఇక అసలు విషయానికి వస్తే..

NHPC, భారతదేశం లోని మొట్ట మొదటి హైడ్రో పవర్ సృష్టించే కంపెని. ఇందులో ఎక్కువ శాతం వాటా ప్రభుత్వానిదే. లాంగ్ రన్ లో ఆలోచిస్తే ఎప్పుడో అప్పుడు ఇది ప్రవైట్ పరం అవ్వక పోదు అప్పుడు ఇది లాభాల బాట పట్టవచ్చు అన్న ఉద్దేశ్యంతో కొన్నాను. ఇవి కొని ఇప్పటికి దాదాపు సంవత్సరం అవుతోంది. అయినా వీటి విలువ పెరగటం లేదు. అయినా ప్రస్తుతం నాకు ఈ డబ్బులు అవసరం లేదు కాబట్టి వీటి గురించి పట్టించుకోనవసరం లేదు.

రిసర్గీస్ వారి ప్రస్తుత ముఖ విలువ రూపాయి కాగా మార్కెట్ విలువ 2.35/- రూపాయలుగా ఉంది. కొంతకాలం క్రిందట వీరి షేర్ ముఖ విలువ పది రూపాయలుగా ఉన్నప్పుడు వీరి మార్కెట్ విలువ డెభైఅయిదు రూపాయలుగా ఉండేది. అప్పుడు ఈ కంపెనీ వారు షేర్ని స్ప్లిట్ చేస్తున్నారు అన్న సమాచారం మరియు ప్రతీ ఒక్క షేర్ కి బోనస్ గా రెండు షేర్స్ ఇస్తున్నారు అన్న వార్త నన్ను ఈ షేర్ని కొనేటట్టు చేసింది. అన్నట్టు గానే స్ప్లిట్ మరియు బోనస్ వచ్చాయి. ఆ తరువాత ప్రస్తుతం ఈ షేర్ నష్టాలలో సాగుతోంది.

14, ఆగస్టు 2010, శనివారం

మీ జీవితం మరియు మీ ప్రాముఖ్యతలు

ఈ మద్య నాకు ఓ మాస్ మైల్ వచ్చింది. అందులోని అంశాలు నాకు చాలా మటుకు సూట్ అయ్యాయి అంతే కాకుండా ఆ విషయాలై నేను చాలా కాలం ఆత్మ శోధన చేసుకోవలసి వచ్చింది. అలాంటి ప్రశ్నల మరియు సమాధానాల మైల్ మీకు కూడా వచ్చే ఉంటుంది, ఒక వేళ మీకు కనుక రాకపోతే, ఇదిగో ఇక్కడ ప్రశ్నించిన నాలుగింటికి సమాధానాలేమిటో మీరు మీవద్దేఉంచుకోండి. కానీ ఈ ప్రశ్నలకు సమాధానాలు వ్రాసుకునేటప్పుడు మీకు మీరు నిజాయతీగా ఉండండి. వీటి సమాధానాలు ఏమిటో నేను మిమ్మల్ని అడగబోవటం లేదు, మీరు నాకు తెలియ జేయనక్కరేదు, నాకే కాదు మరెవ్వరికీ మీరు ఆన్సరబుల్ కాదు, కానీ మిమ్మల్ని మీరు ఒక్క సారి ప్రశ్నించుకోమంటున్నాను.

ఈ ప్రశ్నల వల్ల నాకు జీవితంలో ఏమి ప్రాముఖ్యమైనవో అర్దం అయ్యింది. అలా మీకు కూడా అవుతుందని ఆశిస్తూ.. ముందుగా

-------------------------

మొదటి ప్రశ్నః
ఈ క్రింది ఉఅదహరించిన జంతువులను మీకు నచ్చిన వరుసక్రమంలో పేర్చండి

ఆవు
టైగర్
గొఱె
గుఱము
పంది

రెండొవ ప్రశ్నః

ఈ క్రింది ఉదహరించిన జంతువులను డిస్రైబ్ చెయ్యండి. అంటే మీ స్వంత వాక్యాలలో వీటిని వల్లించండి.

కుక్క
పిల్లి
ఎలుక
కాఫీ
సముద్రము

మూడవ ప్రశ్నః

ఈ క్రింద ఉదహరించిన రంగులను ఉద్దేశ్శించి మీకు తెలిసిసిన ఎవ్వరైనా వ్యక్తులను మరియు మీకు అత్యంత ఇంపార్టెంట్ అయిన వారి పేర్లను ఆయా రంగుల ప్రక్కన వ్రాసుకోండి

ఎల్లో - Yellow
ఆరెంజ్ - Orange
రెడ్ - Red
తెలుపు - White
గ్రీన్ - Green

ఆఖరిగా నాల్గొవ ప్రశ్న..

మీకు ఇష్టమైన సంఖ్యని మరియు వారంలో ఇష్టమైన రోజుని వ్రాసుకోండి

-----------------------

ఇప్పుడు మీరు వ్రాసుకున్న మరియు నేను అడిగిన ప్రశ్నల వెనకాల ఆంతర్యం ఏమిటో మరో పుటలో ప్రచురిస్తాను. అంత వరకూ మీరు వ్రాసుకున్న సమాధానాలు మరొక్క సారి సరి చూసుకోండి అంతే కాకుండా నన్ను మొట్టండి..

14, మార్చి 2010, ఆదివారం

కన్నీళ్ళు కారిస్తే సరిపోతుందా!!

ఈ మధ్య కాలంలో నా జీవితంలో జరిగిన కొన్ని అనూహ్య పరిణామాలలో ఒకటి, BoSF అనే గుంపులో చేరడం. BoSF అంటే Birds of Same Feather. ఏది జరిగినా మన మంచికే అనే సూక్తిని నమ్మే నేను, ఈ గుంపులో చేరిన తరువాత చాలా భాధాకరమైన వార్తలే వింటూ వస్తున్నాను. వాటిలో ఒకటి ఈ క్రిందనున్న వీడియో కూడా. ఇంతటి చేదు విషయాలను విన్నప్పుడల్లా నాకళ్ళు అసంకల్పితంగా వర్షాన్ని కురిపిస్తోంటే, ఈ గుంపులో చేరడం ఏవిధంగా మంచో నాకు అర్దం కావడం లేదు. ప్రస్తుతానికి ఏడవడం తప్ప ఇంకేమీ చెయ్యలేకపోతున్నాను. కానీ ఏడిస్తే మాత్రం సరిపోతుందా!! ఏమో !! తెలియదు... తెలిసినదల్లా ఒక్కటే.. భాధపడటం.

 

నేనేమి సునీతా కృష్ణన్ కాను. కానీ సునీతా కృష్ణన్ శతృవులలో నేను ఒకడినే. ఇంత వరకూ నేను అచేతనంగానే ఉన్నాను. సునీత నన్ను ఏదో పెద్ద సహాయం చెయ్యమనలేదు కానీ నా ఈ మౌనాన్ని విడనాడమంది. ఇద్దరికి ఈ విషయాన్ని చెప్పమంది. అదే చేద్దామనే ప్రయత్నమే ఈ పోస్టు. నాకు ఉన్న స్టాటిస్టికల్స్ ప్రకారం నా ప్రతీ పోస్టు దాదాపు ఓ వంద మంది చదువుతారు, కానీ అందులోంచి చాలా (చాలా చాలా, బహు చాలా) కొద్ది మంది మాత్రమే స్పందిస్తారు. దీని వెనుక కారణం నా ప్రచురణలో సరైన అంశం లేకపోవడం అంతే కాకుండా నేను వ్రాసే విషయాలు పూర్తిగా స్వవిషయం అయ్యి ఉండడమే.

కానీ ఇవాల్టి ఈ విషయం ఒక్క నాది మాత్రమే కాదు మౌనంగా ఉండే మన అందరిదీ. పదిహేనేళ్ళ వయస్సులో ఎనిమిది మంది కామాంధులచేత మానభంగం చేయబడ్డ సునీతకు అన్యాయం చేసిన కామాంధులు గుర్తుకు లేరని చెప్పడమే కాకుండా, పబ్లిక్ గా పది మంది ఉన్న చోట ధైర్యంగా ఈ సమస్యకి మరియు సునీతకు శతృవులు మీరే అని చెప్పే సాహసం ప్రశంసనీయం. అమ్మాయు మాటల్లో చెప్పాలంటే,

 .. my [Sunitha's] biggest challenge is the civil society, not the human traffickers who beat her up, it is you and me, my biggest challenge is your mind blocks to accept these victims as our own. ..it is not nice to bring them to our home, it is not nice to let our children to befriending them.. can you break your silence, can you open your minds.. can you open your hearts.. accept them as human beings ..

అన్నింటికన్నా హృదయ విదారకమైన విషయమేమిటంటే, ఈ ప్రజెంటేషన్ మొదలు పెట్టినప్పుడు చూపించిన పసికూనల చిత్రాల విషయాలు. వ్రాయాలంటే వేళ్ళు నెప్పి పుట్టటంలేదు కానీ వ్రాసే సాహసం నా మనసుకు రావటంలేదు. మీరే వినండి. ఇంతకన్నా ఎక్కువవ్రాస్తే అది నా భాధ అవుతుంది కానీ సునీతకృష్ణన్ భావమవ్వదు.

 
Clicky Web Analytics