దేవుడు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
దేవుడు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

18, ఏప్రిల్ 2012, బుధవారం

నీతి శాస్త్రం : నడువడి ఎలా ఉండాలి

ఈ మధ్య కాలంలో ఏమీ వ్రాయాలని అనిపించక వ్రాయటం లేదు. ఇవ్వాళ మాత్రం ఇది వ్రాయక తప్పదని నిశ్చయించుకుని మొదలు పెడుతున్నాను. ఇక్కడ ప్రస్తావించే విషయాన్ని మానవ దృక్పధంతో ఆలోచిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. దీనిని కులమతాలకు అతీతంగా ఆలోచించాలి. భావం ప్రధానం కాని భాష్యం కాదు అని అనుకుంటే, సమగ్రంగా అర్దం అవుతుంది.

కొంతకాలంగా వీలు చేసుకుని శ్రీ మహా భాగవతము చదువుతున్నాను. అందలి కొన్ని విషయాలు ఇప్పుడు నన్ను ఇలా ప్రేరేపించాయి. పోతనగారి గురించి నేను ఏమి వ్రాసినా అది దయ్యాలు వేదాలు వల్లించినట్లుంటుంది. ఎందుకంటే, సాహిత్యం అనే పదమే కానీ దానిలోని గొప్పతనన్ని చాలా కాలం వరకూ ( .. గ్రహించడం మాట అటువుంచి, ఆ గొప్పతనాన్ని .. ) హేయాభావంతో చూస్తూ బ్రతికిన నాకు దాని గురించి ప్రస్తావించడం మినహా ఆఖ్యానించకూడదని అవగతం అయ్యింది. అలాంటి సాహిత్యానికి తలమానికమైన భాగవత, తెలుగు అనువాద రచయిత అయిన పోతనగారి గురించే!! అందునా నేను కామెంట్ చెయ్యటమా!!! హరి హరి.. ఎంతటి సాహసమో కదా అని చదివే వారు ముక్కున వేలువేసుకుని నోటితోనే కాదు చేతితోకూడా నవ్వుతారు. ఇప్పటికే ఎన్నో రాళ్ళు పడ్డాయి, వాటికి తోడుగా మరిన్ని అవసరమా నాకు. అందుకని పోతనగారిని ప్రస్తావిస్తూ, వారి కవితా చాతుర్యానికి వేవేల కొనియాడుతూ, వారు రచించిన కొన్ని పద్యాలను ఇక్కడ ప్రస్తావిస్తాను.

శ్రీ కృష్ణ భగవానుని నిర్యాణాంతరం ద్వారక నుండి ఖిన్నుడై వచ్చిన అర్జునుని చూచి ధర్మరాజు దుఃఖ హేతువుని తెలియక ప్రశ్నించిన ఘట్టమున రచించిన శ్లోకములు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

క. ఓడితివో శత్రువులకు నాడితివో సాధుదూషాలామ్ముల్
గూడితివో పరసతులను వీడితివో మానధనము వీరుల నడుమన్.

క. తప్పితివో యిచ్చెద నని, చెప్పితివో కపట సాక్షి చేసిన మేలుం
దప్పితివో శరణార్ధుల, రొప్పితివో ద్విజులఁ బసుల రోగుల సతులన్.

క. అడిచితివో భూసురులను, గుడిచితివో బాల వృద్ధు గురువులు వెలిగా
విడిచితివో యాశ్రితులను, ముడిచితివో పరుల విత్తములు లోభమునన్

అనిఅడుగుతారు ధర్మరాజు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. వీటి అర్దాలు నాకు అంతగా అవగతం అవ్వక పోయినా, నాకు అర్దం అయ్యినంత వరకూ ఏమి అర్దం అయ్యిందో వ్రాస్తాను.

మొదటి శ్లోకంలో ..

౧) శత్రువుల చేతిలో ఓడి పోయ్యావా
౨) సాధువుల యందు దూషణ చేసావా
౩) పరసతులను కూడి రమించావా, అంటే పర స్త్రీలతో రతి సంగమం కావించావా
౪) వీరుల మధ్యలో ఉండి మానము ధనము వంటి వాటిని వదిలి ప్రవర్తించావా

రెండొవ శ్లోకంలో ..

౫) ఏదైనా చేస్తాను అని ఇచ్చిన మాట తప్పావా
౬) కపటమైనటువంటి శాక్ష్యం చెప్పావా
౭) చేసిన మేలుకి తిరిగి మేలు చెయ్యడం అనే ప్రక్రియను తప్పావా (లేక మఱో భావంగా, మేలు చేసిన వారి మేలుని మెచ్చుకోక పోగా దెప్పి పొడిచేటట్టుగా ప్రవర్తించడం చేసావా )
౮) శరణార్దులను రక్షించకుండా ఏడిపించావా అంత యేకాక, పైన ప్రస్తావించిన వాటిల్లో, ద్విజులు రాజులు రోగులు లేదా స్త్రీలు ఉన్నారా

మూడొవ శ్లోకంలో ..

౯) భూసురులు అంటే రాజులను అణచావా
౧౦) బాలలను వృధులను గురువులను .. [[ ఏమి చేసారు అని అన్నారో అర్దం కాలేదు. నాకు తెలుగుని అర్దం చేసుకునే ఇంగితం లేనందున ]]
౧౧) ఆశ్రయించి ఉన్న వారిని విడిచి వెళ్లి పోయ్యావా
౧౨) లోభత్వం కలిగి ఉండి పరుల విత్తమును దాచుకున్నావా

అని నాకు అర్దం అయ్యింది. అంతే కాకుండా నాకు మఱింకో విషయం కూడా అర్దం అయ్యింది. ఒక వేళ అర్జునుడు పైన ఉదహరించిన వాటిల్లో ఏదైనా చేసి ఉన్నట్లైతే, కొన్నింటి యందు తత్వ చింతన చేస్తేనే అర్దమయ్యే విషయాలు కూడా ఇందులో ఉన్నాయి. మరికొన్నింటిలో తత్వ చింతన చేసినా నిస్పక్ష పాతంగా ఆలోచించగలిగే మనసు కలిగి ఉండాలి. అప్పుడే చేసిన పని తప్పు అని తెలిసి చింతిస్తారు. ఉదాహరణకి, సాధువుల యందు దూషణ అనే కార్యం తీసుకున్నాం అనుకుంటే, అర్జునుడు దూషణ చేసి ఉన్నా, అది సాధువులయందు అని గ్రహించడానికి మనసు ఒప్పుకోదు. వారేదో వెధవ పని చేసారు కాబట్టి నేను దూషణ చేసాను అని సమర్దించు కునే వాడు. అలా సమర్దించుకున్నా, తన తప్పు తెలుసుకుని పశ్చాతాపంతో దుఃఖించే స్థితికి చేరుకోవడం అంటే ఎంతో నిబద్దతతో కూడుకున్న వ్యక్తిత్వం కలిగిన వారై ఉండాలి. అలాంటి స్థితిలో అర్జునుడు ఉన్నాడు అని అనుకోవాలి.

ఇక్కడ ఉన్న విషయాలను క్షుణ్ణంగా కాకపోయినా మన స్థాయికి తగ్గట్టుగా ఆలోచించుకున్నా, చాలా విషయాలు మనకు అవగతం అవుతాయి. కానీ ఇక్కడ ప్రస్థావించినవి ఎన్ని వందల ఏళ్ళ క్రిందట అనే మాట ప్రక్కన పెడితే, ఎన్ని రోజులు క్రిందటిదైనా పాత చింతకాయ పచ్చడి రుచిగానే ఉన్నట్లు, ఈ మాటలు కూడా చాలా ప్రశస్తంగా మరింత క్రొత్తగా ఈ నాటి రోజులకు అనుగుణంగా రచించారా అన్నట్లు ఉన్నాయి. ఎవ్వరి గురించో నాకెందుకు, నా గురించి నేను ఆలోచించుకుంటే..

అను నిత్యం నేను శత్రువుల చేతిలో ఓడిపోతూనే ఉన్నాను. సాధువుల యందు దూషణ చేస్తూనే ఉన్నాను. పర సతులను కూడి బ్రతకటం లేదు కానీ కపట శాక్ష్యాలు అప్పుడప్పుడు చెబుతూ ఉంటాను. చేసిన మేలుకి కృతఙ్ఞతా పూర్వకంగా తిరిగి మేలు చేయకపోయినా, వారి సహృదయానికి గుర్తుగా ఉన్న (నా యందు వారు చేసిన) మేలుని మఱచి జీవిస్తూ ఉంటాను. ఆఖరులో లోభత్వం కలిగి పరుల విత్తమును అని అనను కానీ నాకు ఉధ్యోగం ఇచ్చే వ్యవస్థను సంకట స్థితిలో ఉంచి నా జీతాన్ని బేరం చేస్తూనే ఉన్నందున వారి ధనాన్ని ఆకాక్షించి దోచుకుని దాచుకుంటున్నాను అనిపిస్తోంది.

ఇదంతా నా గురించి నేను ఆత్మ విమర్స చేసుకునే సమయంలో ఒలికిన భావనలోని కొన్ని వాక్యాలు మాత్రమే. కానీ నా గురించి తీసి ప్రక్కన పెడితే, ప్రస్తుతం నేను ఉన్న సమాజంలో ఎంతమంది ఇలాంటి వాటిని గమనించి మెచ్చుకుంటారు? మెచ్చుకోవడం ఒక మాట అయితే, వాటిని అవగాహన చేసుకుని అర్దం చేసుకుని ఆ విధంగా జీవించే వారు ఎంతమంది? ఇలాంటి ప్రశ్నల పరంపర ప్రక్కన పెడితే ఇంత చక్కగా ప్రతీ మనిషి తన తోటి వారియందు సతు బుద్ది కలిగి ఉండాలి అని మన గ్రంధాలు చెబుతున్నాయని ఒప్పుకునే వారు చాలా అఱుదు అని నా అభిప్రాయం

13, డిసెంబర్ 2011, మంగళవారం

మానవ దేవుళ్ళు – ఓ ఆలోచన

డాక్టర్ కొమ్మూరి వేణుగోపాల రావు గారు రచించిన, “ఆలోచన ఒక యఙ్ఞం” అనే శీర్షికతో, “అందులోంచి అద్బుత జీవితం” అనే ఉప శీర్షికతో ఉన్న పుస్తకం, ఈ మధ్య నేను చదువుతున్న ఓ పుస్తకం. ఈ పుస్తకం గురించిన ఓ రివ్యూ మఱో సారి వ్రాస్తాను. కాకపోతే, కొన్ని వాక్యాలు / పేరాలు ఇక్కడ యధావిధిగా ఉంచేస్తున్నాను. ఈ పుస్తకం అందరూ చదివి ఉండవచ్చు అలాగే చదివి ఉండక పోనూ వచ్చు. ఈ పుస్తకాన్ని నేను ఇంకా పూర్తి చెయ్యక పోయినా, కొన్ని ఆలోచనలను యధావిధిగా ఇక్కడ ఉంచుకోకపోతే మర్చి పోతానేమో అన్న భయంతో ఇక్కడ యధాతధంగ ఉంచుతున్నాను.


పేజీ: 144

నా మనసు క్షోభింపచేస్తున్నదల్లా మానవ దేవుళ్ళే!

వీరిలో కూడా ఆదిలో కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కుని, తరువాత జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగి పోయి, ప్రస్తుతం ప్రజల క్షేమమే దృష్టిలో పెట్టుకుని కృషి చేస్తున్న వారిని అభినందిస్తూ అంజలి ఘటిస్తున్నాను గాని వారిక్ జోలికి పోవటం లేదు!

దేవుడనేవాడు యుగానికి ఒకటి రెండుసార్లో, కొన్ని వేల సంవత్సరాలకు ఒకసారో అవతరిస్తాడు. మిగతావారు రమణ మహర్షి, రామ కృష్ణ పరమ హంస వంటి దివ్యపురుషులు. వారు భగవత్ స్వరూపులుగా ఆరాధనలు పొందారు గానీ, మేమే దేముళ్ళమని ఎప్పుడూ ప్రకటించుకోలేదు.

చిన్మయానంద, శివానంద ఇంకా కొందరు మహా పురుషులు ప్రజలను ఆధ్యాత్మిక దృష్టివైపు మళ్ళించి, వారిలో పరివర్తన తీసుకురావటానికి ప్రయత్నించారు కానీ, అందరితో కలసి జీవించారు. కానీ మేమే దేముళ్ళమని ఎప్పుడూ బడాయిలు చెప్పుకోలేదు. పైగా అందరితో కలసి భగవంతుణ్ని కీర్తించారు. భగవద్గీత, రామాయణం, భారతం, భాగవతం, వీటి గొప్పదనాన్ని తమదైన శైలిలో అద్భుతంగా వ్యాఖ్యానించి, ప్రజలకు అందుబాటులోకి రావటానికి ఎనలేని సేవ చేశారు.

మానవ దేవుళ్ళు ….

ప్రతీ అయిదేళ్ళకూ, పదేళ్ళకూ ఒకసారి వెలుస్తూ ఉంటారు. కొందరు, ఆ ఊరి వరకే పరిమితమై ఉంటారు. కొందరు జిల్లా స్థాయికి, రాష్ట్రస్థాయికి, జాతీయ స్థాయికి, ఎదుగుతూ ఉంటారు, వారి వారి శక్తి సామర్ధ్యాలను బట్టి.

వీళ్ల నెక్కువగా ఆర్ధికంగా చితికి పోయి, కుటుంబ వైఫల్యాలతో విసిగిపోయి నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రజలు ఆశ్రయిస్తూంటారు.

ఎందుకూ?

భగవంతుడు ప్రత్యక్షంగా కనబడుతున్నాడని అనుకుంటున్నారు.

ఎవరెవరికో ఏమేమో జరిగాయని కధలు చెప్పుకుంటున్నారు.

“నన్ను కొలవండి. మీ కష్టాలు తీరిపోతాయి” అని హామీలు ఇస్తున్నారు.

మొదట్లో అంతగా నమ్మకం కుదరక తటస్థంగా, ఊగిసలాడుతుంటే, సీనియర్ వీర భక్తులు వాళ్ల మీద ఒత్తిడి తీసుకు వచ్చి బలవంతంగా చేర్పించేస్తున్నారు.

ఒకసారి అడుగుపెడితే… ఇక అక్కడ ఇరుక్కు పోయినట్టే!!

మొదట ప్రేమతత్వం…

భరోసాలు …

కొన్ని జిమ్మిక్స్ ….

వాళ మీద నమ్మకం, గురి కుదిరేలా చేస్తారు.

తమ సమస్యలు తీరుతాయన్న ఆశయంతో వాళ్ళ ప్రలోభాలకి ఒకటొకటిగా లొంగి పోతుంటారు.

“మీకు భక్తి చాలలేదు. మీలో మార్పు రాలేదు.”

“అది చెయ్యండి. ఇది చెయ్యండి”

ఎవేవో కార్యకలాపాలు చేయిస్తుంటారు.

అసలే ఆర్దిక దుఃస్థితిలో ఉంటే ప్రతీ సారి డబ్బు ఖర్చు… అప్పో సొప్పో చేసి … తప్పించుకోవటానికి వీల్లేని చిక్కు పరిస్థితిలో ఇరుక్కు పోతూ ఉంటారు.

ఒక సారి లోక కళ్యాణం కోసం …

ఒకసారి వ్యక్తిగత సమస్యలు చిటికెలో తీరటం కోసం ….

ఇంకోక సారి ఆర్ధికాభి వృద్ది కోసం ….

ఎవేవో తతంగాలు.

ఇలా కాకుండా, కొన్ని తప్పని సరి కార్యక్రమాలు విరుచు పడుతుంటాయి.

నూతన సంవత్సర సందేశం ….

దేవుడు గారి పుట్టిన రోజుల వేడుకలు ….

దేముడి గారి భార్య గారి జన్మదిన సంరంభాలు, దేముడు గారి కళ్యాణ మహోత్సవం (సీతారాముల కళ్యాణంలా).

ఇలా ప్రతి రెండు మూడు నెలలకూ ఏదో ఒక తతంగం, ఉత్సవాలు, డబ్బు వసూళ్ళు..

ఇంచుమించు స్థాయి భేదాలు మినహాయించి మానవ దేవుళ్లు వెలసిన చోటల్లా ఇవే విన్యాసాలు!

ఇంతటితో ఆగదు, వారి ఖ్యాతి విస్తరిస్తోన్న కొద్ది ఇప్పుడున్న ఆశ్రమం పరిధిలు సరిపోవు. వారి దృష్టి జాతీయ – అంతర్జాతీయ స్థాయి మీదకి మళ్లుతుంది. పని పాటు లేనట్లు ఎక్కడెక్కణుంచో ఫారినర్స్ రావటం మొదలయ్యే సరికి ఈ ఆకర్షణ ఇంకా ఎక్కువవుతుంది. ఇలా పైకి వస్తున్న దేవుళ్ళ  దగ్గర చూడండి, విధిగా కొంత మంది విదేశీయులు కనిపిస్తారు. మన భాషలో, వాళ్ల స్టయిల్లో పాటలు పాడుతూ కనువిందూ, వీనుల విందూ చేస్తూ ఉంటారు.

భారీ ఎత్తున ఆశ్రమాలు నిర్మాణం మొదలవుతుంది, కోట్ల రూపాయల బడ్జెట్ తో.

డబ్బు…. చందాలు… వేల, లక్షల స్థాయిలో,

అసలే సమస్యలతో నలిగి పోతూ, హృదయ విదారకస్థితిలో ఉన్న భక్తులను ఇంకా పీల్చి పిప్పి చేస్తుంటారు.

“దుఃఖం నుండి విముక్తి, సమస్యల పరిష్కారం” ఈ నినాదాలు మాత్రం కొనసాగుతూనే ఉంటాయి.

చిత్రమేమిటంటే ఇందులోకి చేరాక కూడా ఏ సమస్యకూ పరిష్కారం లభించని వారు కూడా ఆత్మ వంచన చేసుకుంటూ ఈ ప్రచారం చేస్తూ ఉంటారు.

వాళ్లకూ మధ్య మధ్య అనేక సందేహాలొస్తూ ఉంటాయి. ప్రశ్నలు ఉదయిస్తూంటాయి.

“మీకు భక్తి లేదు. మీలో అహంకారం పోలేదు. మీలో ఇంకా మార్పులు రాలేదు.” అంటూ వారిని అణగదొక్కేస్తూ ఉంటారు.

కొంత మంది బాధ ఆపుకోలేక కొంచం సూటిగా అడగబోతే అవహేళన చేస్తూ, అవమానం కలిగే రీతిలో హీనంగా మాట్లాడుతారు. మిగతా వాళ్ళు తాము చాలా గొప్ప వాళ్లయినట్లు ఫీలైపోతూ, హేళనగా నవ్వి, అలా అడిగిన వాళ్ళను పురుగుల్లా చూడటం మొదలు పెడతారు.

అంటే, భక్తుడిలో ప్రశ్నలు ఉండకూడదు.

అతడికి వ్యక్తిత్వం ఉండకూడదు.

అతను ఓ బానిసలా ఉండాలి.

మానవదేవుళ్ల ఉనికి ఇలా బానిసల్ని తయారు చేయటం మీదే ఆధార పడి వుంటుంది ..


ఇలా సాగిన తరువాత వీరు ఓ మాంచి మాట వ్రాస్తారు

“మానవ దేవుళ్ళు” అబద్దం కావచ్చు కానీ మంచి గురువులున్న మాట “మాత్రం” నిజం!

 

ఈ వాక్యంలో ఎన్ని నిఘూడమైన అర్దాలున్నాయో!!

20, ఆగస్టు 2011, శనివారం

భద్రాచలం – మఱో ఙ్ఞాపకం

DSCN2500వెళ్ళిన వెంటనే లగేజి సత్రంలో ఉంచి, కాల కృత్యాలు తీర్చుకుని ప్రక్కనే ఉన్న గోదావరిని చూచి వచ్చిన తరువాత ఆలశ్యం అవుతోందని, తొందరలో అయ్యవారి దర్శనార్దం వెళ్ళాము. తీరా దేవాలయం దగ్గరకి వెళితే, అయ్యవారు కొండెక్కి కూర్చున్నారు. ఆ మాత్రం కష్టపడక పోతే అయ్యవారి దర్శనం కలగదులే అని అనుకుని, మెల్లగా ఒక్కోఅడుగు ముందుకు వేసుకుంటూ కనబడుతున్న మెట్లెక్కడం మొదలు పెట్టాను.

భక్తులలో చాలా రకాలు ఉంటారు కదా, వారిలో అయ్యవారిని తొందరగా దర్శనం చేసుకునే హడావిడి ఉన్నవారికి నాలా నత్తలా నడుస్తున్న వారు కనబడక పోవడం వల్ల కొంచం చికాకు వేసినా, నా స్థితికి నేను సమాధానం ఇచ్చుకుని పరుగులెత్తేవారికి దారివ్వడం అలవాటు చేసుకున్నాను. ఆ రోజు నా అదృష్టమో లేక అది సహజమో కానీ సర్వదర్శనానికి ఎవ్వరూ లేరు, అందరూ ప్రత్యేక దర్శనానికే మక్కువ చూపుతున్నారు. అందుకని మేము కూడా ప్రత్యేక దర్శనానికే టికెట్టు తీసుకుని దర్శనార్దం వరుసలో నిలబడ్డాం. మెల్లగా ఒక్కొరొక్కరూ ముందుకు సాగుతుంటే, గర్బాలయంలో కూర్చొని ఉన్న అయ్యవారిని దర్శించుకునే అవకాశం రానే వచ్చింది.

చక్కగా సీతమ్మను ఎడమ తొడపై కూర్చొని ఉంచుకున్న  శ్రీరాముడుని చూడటానికి నా కన్నులు చాలలేదంటే నమ్మండి. ఆ దృశ్యాన్ని ఇప్పటికీ నా కళ్ళ ముందు నిలిపివేసిన ఆ క్షణాన్ని ఏమని చెప్పాలి. వీరిద్దరినే చూద్దాం అనుకున్నంతలో వీరి ప్రక్కనే నిలబడ్డ లక్ష్మణ స్వామి నా దృష్టిని ఆకర్షించారు. ఆవిధంగా సీతమ్మ సమేతుడైన శ్రీరాముడుని మఱియు లక్ష్మణ స్వామిని దర్శించుకున్న తృప్తి వర్ణనాతీతం. అలా సాగి ఆలయం బయటకు వచ్చిన మాకు ఆ ప్రక్కనే పులిహోర ప్రసాదంగా లభించింది. అది తింటూ చుట్టూ చూస్తుంటే, శ్రీరామదాసు కాలం నాటి ఆభరణాలను ఉంచిన మ్యూజియం కూడా దేవాలయ ప్రాంగణంలో ఉంచడం కొంచం ఆశ్చర్య పఱచినా, ఇది బాగానే ఉందనిపించింది.

వింతైన విషయం ఏమిటంటే, అయ్యవారిని చూడటానికి ఎంత మంది బారులు తీరారో అంతకు రొండింతలు ఇక్కడ కనబడ్డారు. దానికి ప్రవేశ రుసుముగా రెండు రూపాయలు దేవస్థానం వారు ఎందుకు విధించారో నాకైతే అర్దం కాలేదు కానీ ఆ విధంగా నైనా కొంత ద్రవ్యం అయ్యవారి ఖాతాకు జమా అయ్యి ఎంతో కొంత మొత్తం భక్తుల సౌకర్యార్దం ఉపయోగపడుతుందనుకుంటాను. ఇక్కడ మఱో విషయాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అయ్యవారి ఆలయం ప్రక్కనే కళ్యాణం చేస్తున్నారు. అక్కడ కళ్యాణం చేయించుకునే దంపతులు అందరూ ఆసీనులై ఉన్నారు. వారితో సమానంగా మనమూ కూర్చునే వీలున్నా మేము మాత్రం ఓ ప్రక్కగా కూర్చుని కళ్యాణాన్ని తిలకిద్దాం అని అనుకుని అనువైన చోటుకోసం వెతుకుతుంటే, మా అదృష్టమో ఏమో కానీ వేదం చదువుకుంటున్న విఙ్ఞులు మా కంట పడ్డారు.

అధర్వ వేదం చదువుకుంటున్న ఓ మహానుభావుని వద్దకు చేరుకుని మమ్ములను మేము పరిచయం చేసుకుని వారి క్షేమ సమాచారాలు తెలుసుకి కొంత సేపు సజ్జనులతో గడిపాము. ఇంతలో అక్కడ వరుసలో ఎవ్వరూ కనబడకపోయేసరికి, నా భార్య మఱో సారి అయ్యవారిని అమ్మవారిని దర్శించుకుని వస్తానన్ని వెళ్ళి చక్కగా రెండోసారి దర్శన భాగ్యం కలిగించుకుంది. ఇలా సాగింది ఆ రోజు ఉదయం. అక్కడి నుంచి మెల్లగా రూముకి చేరుకుని, బట్టలు మార్చుకుని సత్రంలో భోజనం కోసం వెళ్ళాం.

18, ఆగస్టు 2011, గురువారం

భద్రాచలం – నా ప్రాప్తం : మొదటి భాగం

ఈశ్వరానుగ్రహం వల్ల నేను ఈ మధ్యనే భద్రాచలం వెళ్ళి వచ్చాను. ఇలా భద్రాచలం వెళ్ళడం మొదటి సారి కాదేమో, కాని నాకు బాగా ఊహ తెలిసి మొదటి సారి అని చెప్పుకోవచ్చు. దానికి తోడు భార్యకూడా వచ్చింది. దర్మ పత్నీ సమేతంగా వెళ్ళి రావడం కొంచం ఊరటగా ఉంది. అన్నింటికన్నా మించిన తృప్తినిచ్చిన విషయాలు ఒక్కటి అని చెప్పుకోవడానికి ఏదో తెలియటం లేదు.

యాక్సిడెంట్ అయిన తరువాత ఒక్కడినే నడుచుకుంటూ వెళ్ళడం అందునా ప్రయాణం చెయ్యడం ఇదే మొదటి సారి. కుంటుకుంటూ వెళుతున్నాను, ఏమైనా అవుతుందేమో అన్న భయం మనసులో ఉన్నా, అంతా శ్రీరామునిపై భారం వేసేసి, ధైర్యం చేసి బయలు దేరాను. నాలుగు రోజులు ముందు వరకూ నా ఆలోచనలో ప్రయాణం అంతా కారులో వెళ్ళడం గురించి ప్రళాణిక వేసుకుంటున్నంతో, హితులైన కృపాల్ కశ్యప్ గారి రూపంలో ఈశ్వరుడు మా ఇంటికి విచ్చేసి, భద్రాచలం వెళ్ళడానికి రైల్ ఉందు చూసుకోండి అని సలహా ఇచ్చారు. అంతే, అప్పుడే జాలంలో మనకు అందుబాటులో ఉన్న రైల్వే వారి బుక్కింగ్ సైట్లో వెతికితే, ఆఖరుగా రెండే రెండు సీట్లు మిగిలి ఉన్నాయి.

DSCN2432వెంటనే బుక్ చేసేసుకున్నాను. ఇది యాదృశ్చికమా లేక సదృశ్యమా అంటే, అది ఈశ్వరుని కృపే అని నేను నమ్ముతాను. అదిగో అలా మొదలైంది నా భద్రాచల ప్రయాణం. ప్రయాణం చక్కగా మొదలైంది అనుకునేంతలో ఓ విఘాతం బాలయ్య రూపంలో చేరుకుంది. మేము ప్రయాణిస్తున్న రైల్లోనే బాలయ్యకూడా భద్రాచలం వస్తున్నారంట. ఇంకేం భాట్రాజులు ఉండనే ఉంటారుకదా, నువ్వది ఈకావో, నువ్విద్ది పీకావో, అంటూ తిరిగే వాళ్ళన్నమాట, వారు ఎంత హడావిడి చేసేస్తున్నారంటే, తలకాయి నెప్పొంచిందనుకోండి. సరే వారి విషయం నాకు అనవసరం అనుకుంటూ నేను ఎంత జాగ్రత్తగా ఉండాలో అని ఆలోచించుకుంటూ నాకు కేటాయించిన చోటకు చేరుకున్నాను. చక్కగా సికింద్రాబాద్ నుంచి మొదలైన ప్రయాణం భద్రచలం రోడ్డు అనే స్టేషన్ అయిన కొత్తగూడం చేరుకునేటప్పటికి ఉదయం ఐదు గంటలైంది.

ఉదయం ఐదు గంటల వేళ మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ స్టేషన్ నుంచి బయటకు వచ్చేటప్పటికి, బయట మూగిన జనాలు, మన హీరో గారి అభిమానులు అంతా జారుకున్నారు. అక్కడ మాకు ఒక్క ప్రయాణ సాధనం ఆటో తప్పితే మరింకేం కనబడలేదు. ఆటో వాళ్ళేమో మూడువందల యాభై రూపాయలనుంచి వారి నోటికి ఎంత తోస్తే అంత అడుగుతున్నారు. ఇలా ఐతే ఎలా అనుకుంటూ,  మెల్లగా బయటకు చేరుకునేటప్పటికి, ఓ ప్రైవేట్ ట్రావల్స్ బండి వాడు కనబడ్డాడు. ఒక్కొక్కరికి నలభై రూపాయలు అడిగాడు, హమ్మయ్య, అనుకుని సౌకర్యంగా భద్రాచలం చేరుకున్నాను. అప్పటికి తెలతెల్లవారుతోంది.

DSCN2436

ఇదిగో అక్కడ కూడా మన బాలయ్యగారి రాబోయే సినిమా, “శ్రీరామ రాజ్యం” పాటల సందడికి సంబందించిన బ్యానర్లు మాకు స్వాగతం ఇచ్చాయి. కానీ నాకు నచ్చని విషయమేమిటంటే, పూజ్యనీయమైన బద్రాచల శ్రీరాముని గుడికి వెళ్ళే ముఖ ద్వారమైన దారికి వీరు ఇలా బ్యానర్లు తగిలించడం ఎందుకో మింగుడు పడలేదు. కానీ ప్రస్తుతం మనం ఉన్నది ప్రజాపాలన కలిగిన రాజ్యంలో అని రాజ్యాంగం చెబుతోంది కదా, అందువల్ల ప్రజలు ఏమి చేసినా మనం మాట్లాడ కూడదు. అలాగే ఈ విషయంలో కూడా, అనుకుని, శ్రీరాముని తలచుకుని ముందుకు సాగాను. తెలవారు ఝామున ఇలాంటి దృశ్యం నాకు అనుకోని అనుభూతిని మిగిల్చింది. ఇంతటి అనుభూతిలో, బాలయ్యలాంటి వ్యక్తి కూడా భాగమైనందులకు కించిత్ బాధగా ఉన్నా, గురుతుల్యులు చెప్పిన ఓ విషయం ఇక్కడ ఙ్ఞప్తికి వస్తుంది. చండాలుడియందు అలాగే విఙ్ఞుల యందు సమదృష్టికలిగి ఉండాలి అన్న మాట గుర్తు తెచ్చుకుని, అందరియందు సమదృష్టి కలిగి ఉండాల్సిన ఆలోచనను పెంచుకునేందుకే ఈశ్వరుడు ఇలా చెపారని అనుకున్నాను.

DSCN2437

ఈశ్వరుని కృప మనకు ఎప్పుడు ఎలా వస్తుందో మనకు తెలియదు. కాకపోతే మనం అందుకు సిద్దంగా ఉండటమే ముఖ్యం. భద్రాచలం వెళ్ళడానికి ఆయితే టికెట్లు రిజర్వ్ చేయించుకున్నాను కానీ ఎక్కడ ఉండాలా అని అనుకుంటుంటే, ప్రయాణానికి ఒక్క రోజు మఱో హితుల రూపంలో ఈశ్వరుడు నాతో చెప్పించారు. వారికి తెలిసిన స్నేహితులు అక్కడే నివాశితులై ఉన్నారని, వారు నాకు ముందుగా ఓ రూము రిజర్వ్ చేయించి పెడతానని. అదిగో అదే ఈ “శ్రీరామ నిలయం”. తిరుపతిలో లాగా ఇక్కడ కూడా ఓ రిజర్వేషన్ కౌంటర్ యందు మనం ముందుగా రిజర్వ్ చేయించుకుంటే, ఇక్కడ ఉండటానికి మనకు అనుమతి లభిస్తుంది. ఈ శ్రీరామ నిలయం ప్రక్కనే “సీతా నిలయం” కూడా దేవాలయం వారు కట్టారు. గదుల లోపల నిర్వాహణా పరమైన లోపాలు చాలా ఉన్నా, భక్తితో వచ్చిన నాకు మరింకేం ఇబ్బంది కాలేదు. చక్కగా కాల కృత్యాలు తీర్చుకుని, గోదావరిలో స్నానం చేసివద్దాం అని ప్రక్కనే ఉన్న గోదావరికి చేరుకున్నాను.

DSCN2438వరద రావడం వల్ల అలాగే అక్కడ ఉన్న భక్తుల అత్యుత్సాహం గమనించిన తరువాత గోదావరిలో మునగలేక పోయ్యాను కానీ గోదావరీ జలాలను నెత్తిమీద జల్లుకున్నాను. వరద వల్ల నీరంతా బురద బురదగా ఉన్నా ఫరవాలేదు కానీ, అత్యుత్సాహంతో ఉన్న భక్తులు కుంటి వాడిని కాకపోయినా, అపరేషన్ చేసిన కాలు పూర్తి స్థాయిలో నడవనివ్వక పోవడం వల్ల నిలదొక్కుకోలేని నన్నువారు గమనించకుండా ఎన్ని గంతులు వేస్తున్నారో గమనించిన తరువాత వారితో కలసి నీళ్ళల్లోకి దూకడానికి సాహసించలేక పోయ్యాను.

అలా గోదావరీ జలాలతో ప్రోక్షణ చేసుకుని, సత్రానికి చేరుకుని, తలారా స్నానం చేసి ఈస్వరుని తలచుకుని, ఆలయం వైపు అడుగులు వేశాను. సాధారణంగా చాలా సార్లు నాకు దైవ దర్శనం అయ్యేంత వరకూ చుట్టూ ఉన్న (లేదా) జరుగుతున్న పరిణామాలు నాలో కోపాన్ని లేదా అసహనానికి గురిచేస్తాయి. కానీ ఏమి విచిత్రమో ఏమో, ఆరోజు ఉదయం నుంచి చాలా ఘటనలు నన్ను అసహనానికి గురిచేసినా నా మనస్సులో ప్రసాంతత దూరం కాలేదు. ఓ ప్రక్కన జరుగుతున్న పరిణామాలు నన్ను గుర్తుపెట్టుకునేటట్టు చేసినా, అవి నన్ను ఏమీ చెయ్యలేక పోయాయంటే, దానివెనకాల శ్రీరాముని కృప ఎంత సత్యమో నాకు మాత్రమే తెలుసు.

ఇలా ఒక్కో విషయానికి ఇంతగా వ్రాసుకుంటూ పోతే, ఒక్క పోస్టు చాలదేమో.. మరిన్ని వివరాలతో, మరో పోస్టు

9, జూన్ 2011, గురువారం

హమ్మయ్య !! ఓ పనైపోయింది

ఇవాళ్ళ ఈ చిత్రకారుని జీవితం ముగిశింది అని వ్రాయాలని చాలా మంది అనుకుంటారు, కానీ నాకు మాత్రం హమ్మయ్య అనిపించింది. ఎందుకంటే, వివాదాలకు మూల బిందువైన కారణం చేత భారతదేశాన్ని ఒదిలి వేరే దేశాలలో ఉంటూ భారతదేశాన్ని నిందించే ప్రముఖల చిట్టాలో ముందు ఎవ్వరున్నారు అని ఆలోచిస్తే, లండన్ నగరంలో కాలం చేసిన ఎమ్ ఎఫ్ హుస్సేన్ ముందుంటారు.

పుట్టిందేమో భారతదేశంలో, వివాదస్పదమైన చిత్రాలు భారతదేశానికి సంబందించినవి, భారతదేశ పౌరసత్వాన్ని కాదనుకుని వేరేదేశంలో ఉంటూ భారతదేశానికి వ్యతిరేకంగా స్టేట్ మెంట్స్ చేస్తూ భారతీయ సంస్కృతికి ఓ పెద్ద మచ్చలా నిలచిన వ్యక్తి. ఖత్తర్ యొక్క పౌరసత్వాన్ని తీసుకున్న తరువాత ఆఖరిరోజుల్లో భారతదేశానికి దూరంగా గత నాలుగైదేళ్ళ నుంచి అఙ్ఞాత వాశం చేస్తూ అదే పెద్ద గొప్పలా ఫీలై ఆఖరికి యాంత్రిక జీవనానికి అలవాటు పడ్డ లండన్ హాస్పిటల్లో హృద్రొగంతో మరణించడం నాకైతే పెద్ద భాధగాలేదు. భారత మాతను నగ్నంగా చూపిస్తూ చిత్రాన్ని గీసి దానికి చెత్త కారణాలు వెతుక్కున్న రోజున ఎంత భాధ పడ్డానో ఆ భాదకి ఈరోజున ఉపశమనం కలిగింది.

ఈయన భారతీయ దేవతలను చాలా తుశ్చంగా చిత్రింకరించినప్పుడు, మనసు బాధ పడ్డా, అవి కులమత గొడవలకు దారతీస్తాయని మౌనంగా ఉన్నా, కులమతాలకు అతీతంగా భరత మాతను నగ్నంగా చిత్రీకరించినప్పుడు ఇతనిపై హేయాభావం కలిగింది. నిజమే, ప్రాచూర్యం రావాలనుకోవడంలో తప్పులేదు, అంత మాత్రాన కనబడ్డ ప్రతీ అమ్మాయిని నగ్నంగా చిత్రీకరించాలనుకోవడం ఎంతటి హీన ఆలోచనో తలచుకుంటే వ్యగ్రతతో నా మనసు చాలా భాధపడుతుంది.

ఏది ఏమైనా, ఇది ఒక శుభదినం అని నేను చెప్పను కానీ ఇకపై భరతదేశ గౌరవాన్ని కించ పరిచే ప్రముఖలలో ఒక వ్యక్తి తక్కువైయ్యాడు అనేది నిజం.

17, ఏప్రిల్ 2011, ఆదివారం

దైవం – విలువ ఎంత?

దైవంపై పలు ఆలోచనల తరువాత, లెక్కా పత్రాలు అడిగే వారికోసం ఈవిధంగా సమాధానం ఇస్తే ఎలా ఉంటుందా అనే ఆలోచనలలోంచి ఉద్బవించినదే ఈ పుట. దైవం గురించి ఆలోచనలకు రూపం ఇచ్చే ప్రయత్నంలో కొన్ని నిజాలను ప్రతిపాదించిన మహాను భావుల ఆలోచనలను మనం ఎలా ఊహించుకుని అర్దం చేసుకోవాలో చెప్పే ప్రయత్నంలోంచి అనుకోకుండా మరో ఆలోచన ఉద్బవించింది. ముందుగా క్రిందటి పుటలోంచి ఉద్బవించిన ఆలోచన.

నిజానికి ఎలక్ట్రాన్ అనేది ఉందని ఎవ్వరు చూసారు? భూమి గుండ్రంగానే కాక ఎలిప్టికల్ ఆకారంలో ఉందని ఎవ్వరు చూసారు?  గురుర్వాకర్షణ శక్తి గురించి చేసిన ప్రతిపాదనను మనం ఎలా నమ్మాలి? ఇంకా వగైరా వగైరా.. ఇవన్నీ చార్వాకుల ఆలోచనలు. ఇంతకీ ఈ చార్వాకులెవ్వరు? వారి సిద్దాంతం ఏమిటి? అని ఆలోచిస్తే .. ముందుగా చార్వాక సిద్దాంతం బయట పడుతుంది. ఆ తరువాత వీరి నేచర్ అర్దం అవుతుంది.

ఏదైనా విషయాన్ని తమ కళ్ళద్వారా చూచి నమ్మేవారిని చార్వాకులు అని అంటాము. ఉదాహరణకి భారతీయ సంసృతి ప్రకారం ఏదైనా తప్పు జరిగినప్పుడు, ఆ తప్పుని చేస్తున్న వారు ఆ తప్పుని చేస్తున్నప్పుడు చూసిన సాక్షులు కావాలి. అలా సాక్షం ఉన్నప్పుడే నిజ్జంగా ఆ తప్పు జరిగినట్లు మన రాజ్యాంగం తీర్పునిస్తుంది. ఈ విధంగా చార్వాకులు అనే వారు ఎవ్వరంటే, చక్రవర్తి అనేవాడు ఈ పోస్ట్ వ్రాసాడు అని అంటే, చక్రవర్తి వ్రాస్తున్నప్పుడు నేను చూడలేదు కాబట్టి నేను నమ్మను అనేవారి. ఒకవేళ చక్రవర్తి నిజ్జంగా ఈ పోస్టు వ్రాస్తున్నప్పుడు వీరు చూచి ఉంటే, అప్పుడు వీరు నమ్ముతారు అన్నమాట.

ఇలాంటి చార్వాకులే కొన్ని సార్లు మనకి మేలు చేస్తుంటారు, కానీ చాలా సార్లు (అంటే దాదాపుగా అన్ని సార్లు) మనకు నష్టాన్నే కలిగిస్తారు. ఉదాహరణకి నన్నయ్య గారిని మన ప్రభుత్వం ఆది కవి అని గౌరవిస్తే, అసలు నన్నయ్య అనే వాడు లేడు అందువల్ల ఇలాంటి ఆలోచన వ్యర్దం అని వాదించే వారు. అదిగో అలాంటి ఆలోచనే ఖచ్చితంగా “దేవుడు లేడనే” వాదన. “దేవుడనే వాడు నిజ్జంగా ఉంటే కనబడమనిండి చూద్దాం!!” అని వితండంగా వాదించేవారు. క్రిందటి పుటలో Physics / Geology / Education / వంటి వాటి గురించి సున్నితంగా సృజించాను. ఇప్పుడు Mathematics పరంగా లెక్కలేసే ప్రయత్నం చేస్తాను.

మనం ఎప్పుడైనా లెక్కలలో ఏదైనా తెలియనప్పుడు దానిని X (ఎక్స్) అనుకుంటాం. అలాగే ఈ దైవాన్ని ప్రస్తుతానికి X అనుకుందాం. అలాగే ప్రతీ మనిషికీ ఓ విలువ ఉంటుంది. ఈ విలువ వారు చేసే పనిని బట్టి ఉంటుంది. ఉదాహరణకి ఏదైనా ఉద్యోగానికి వెళ్ళాం అనుకోండి మనచేత ఉద్యోగం చేయించుకునే వ్యవస్థ మన విలువను లెక్కగట్టి నెలకు ఇంత ఇస్తాం అని నిర్ణయిస్తారు. ఆ విలువను Y అనుకుందాం. ఇప్పుడు నాకు అక్కడ చేసే పనిలో దైవం తోడైయాడనుకుందాం అప్పుడు నా విలువ ఏమిటంటే

నా విలువ =  X (దైవం విలువ) + Y (నాకు ప్రపంచం కట్టిన విలువ)

ఆ విధంగా నావిలువ Z అనుకుందాం. Mathematics సూత్రాల ప్రకారం  Z = X + Y

ఇప్పుడు దైవం లేదనుకుందాం. దైవమే లేదనుకుంటే, దైవానికి విలువకూడా లేనట్టే కదా, అందువలన Z = Zero + Y, కాబట్టి

Z = Y

కానీ ఒక్క సారి ఇలా ఆలోచించండి. దైవం ఉండటం వల్ల దైవానికి ఓ విలువ ఉంటుంది కదా, అందువల్లన Z = SomeValue + Y, కాబట్టి

Z ≠ Y

నేను పాజిటివ్‍గా ఆలోచించే వాడిని కాబట్టి ఇంతకు ముందు చెప్పిన ప్రతిపాదనలోని SomeValue అనేది తప్పనిసరిగా అది సున్నాకన్నా ఎక్కువే ఉంటుంది అని అనుకుంటాను. ఆ విధంగా SomeValue అనేది అధమ పక్షంలో 1 అయినా

Z = 1 + Y

నేను నెగెటివ్‍గా ఆలోచించే వారి గురించి ఇక్కడ ప్రస్తావించను. ఇప్పుడు అన్ని లెక్కలు అయినాయి కాబట్టి, ఒక సూటి ప్రశ్న. నిజ్జంగా దేవుడు లేడనుకుంటే, నాకు పోయిన నష్టం ఏమీ లేదు. అదే కనుక దేవుడు లేడనుకున్న తరువాత దైవం ఉంది అని తెలిసందుకోండి అప్పుడు ఆ దైవం విలువ నాకు కలవక పోవడం వలన నాకు ఉండవలసిన విలువ తగ్గిపోయినట్లే కదా?

13, ఏప్రిల్ 2011, బుధవారం

దైవం – ఆలోచనల రూపం

దైవం గురించి వ్రాయడానికి నాకు అంత ఙ్ఞానము లేదు అలాగే అంతటి సాహసము చెయ్యలేను. కాకపోతే ఇంతకు ముందు నేను వ్రాసిన కొన్ని పుటల వెనుక దాగి ఉన్న వివరానికి ఒక రూపం ఇచ్చే ప్రయత్నంలో ముందుగా కొన్ని పుటలను ప్రశ్నలుగా వ్రాసుకుని వాటికి సమాధానాలు వెతికే ప్రయత్నం చేసాను. వాటికి ప్రప్రధమంగా నన్నయ్యగారిని హైలేట్ చేస్తూ వ్రాసాను. నన్నయ్యగారిని ఆదికవిగా నేను ఒప్పుకోను అని వ్రాసిన పుటకి ఎందరో స్పందించి వారి వారి అభిప్రాయాలు తెలియజేయడమే కాక పలు విభిన్న కోణాలను సృజించారు. అంతే కాకుండా తెలుగులో నన్నయ్యగారికన్నా ముందు అధర్వణాచార్యుడు అనే మహా వ్యక్తి గురించి కూడా ప్రస్తావనకొచ్చింది. కొన్ని చర్చలు ఇక్కడ అప్రస్తుతం అయినా, ప్రతీ వ్యక్తి ఆలోచనలు ఈ విధంగా రూపం దిద్దుకున్నాయి అని చెప్పడానికి కొన్ని కొలమానాలు ఉంటాయి.

మూల విషయానికి వెళ్ళేముందు, ఓ సున్నితమైన విషయాన్ని నాకు తెలిసినంత వరకూ వివరంగా వ్రాసే ప్రయత్నం చేస్తాను. ఏ వ్యక్తి అయినా ఏదైనా విషయాన్ని ఎలా నేర్చుకుంటారు?

ఇది చాలా పెద్ద విసృతమైన చర్చ. అదేదో ఆంగ్ల సామెత చెప్పినట్టు, తెలివైన వాడు ఎదుటి వాడి అనుభవం నుంచి నేర్చుకుంటాడు.. అలాగే తెలివి తక్కువవాడు స్వానుభవం చేత నేర్చుకుంటాడు అని. దీని గురించి ఇంతకు మించి వ్రాయదలచుకోలేదు అన్నంత మాత్రాన ఈ సామెతతో ఏకీభవించినట్టు కాదు అలాగే విభేదించినట్టుకూడా కాదు. దీని గురించి వ్రాస్తూ పోతే అసలు కధ మఱుగున పడిపోతుంది. అందుకన్నమాట.

ప్రతీ వ్యక్తీ చిన్నప్పటి నుంచే నేర్చుకుంటూ పెరుగుతారు. ఎప్పుడైతే నేర్చుకోవడం మానేస్తారో అప్పుడు ముసలి తనం వచ్చిందని నా అభిప్రాయం. ఇలా నేర్చుకునే ప్రయత్నంలో కొన్ని మనం చదివి నేర్చుకోవాలి, చాలా కొద్ది విషయాలు మాత్రం అనుభవించి నేర్చుకోవాలి, మరి కొన్ని విని నేర్చుకోవాలి, ఇంకా కొన్ని చూచి నేర్చుకోవాలి, అలాగే మరిన్నిటిని నమ్మి నేర్చుకోవాలి. చాలా విషయాలను మన సంస్కారం మనకు నేర్పిన విఙ్ఞతను ఆధారంగా తీసుకుని, నేటి సమాజంలో ఉన్న ధర్మాన్ని బేరీజు వేసుకుని మనం ఒక నిర్ణయానికి వచ్చి నేర్చుకోవాలి.

వీటిలో ఉదాహరణకి, భూమి గుండ్రంగా కాకుండా ఎలిప్టికల్ ఆకారంలో ఉంది అని చూచిన వాళ్ళు ఎంతమందో చెప్పండి చూద్దాం. భారత దేశ జనాభాలో నేటికి నూట ఇరవై కోట్ల జనాభా ఉన్నట్లు అంచనా. ఎంత మంది నిజ్జంగా ఆకాశంలోకి వెళ్ళి భూమిని చూచి వచ్చారో చెప్పండి? కానీ భూమి ఇలాగే ఉందన్న విషయాన్ని భారతదేశ జనాభా అంతమందీ ఒప్పుకుంటారు. ఎలా అబ్బా?? వీరందరు ఆకాశంలోకి వెళ్ళి చూచారా!! లేదే.. కానీ చూచి వచ్చిన వారు మరియు పరిశోధనలు చేసిన వారు ప్రతి పాదించిన విషయాన్ని నమ్మి ఒప్పుకున్నారు.

ఇంకొకటి, ఎలక్ట్రాన్ అనేది ఉంది అని అందరూ నమ్ముతారు. లేకపోతే మనకు విద్యుత్ అనేది ఉండదు. కానీ ఎంతమంది ఈ సదరు ఎలక్ట్రాన్ అనేదానిని చూచారో చెప్పమనండి. ఒక్కరు కూడా మనకు కనబడరు. ఆఖరికి దానిని కనిపెట్టిన వారుకూడా దానిని చూడలేదంటే అది అతిశయం కాదు. కానీ ఎలక్ట్రాన్ ఉందని దానికి రెండు విధాలైన ప్రవర్తన ఉంటుంది అని, అవి మనకు చాలా ఉపయోగకరమైనవని అని అందరూ నమ్ముతారు. ఈ విషయాన్ని మనం విని నేర్చుకున్నాం అలాగే చదివి నేర్చుకున్నాం. అంతే గాని ఎలక్ట్రాన్ ద్వారా వచ్చే షాక్ మనకు అనుభవంలోకి రావాలనుకోకూడదు.

మరొకటి, నిప్పు పట్టుకుంటే కాలుతుందని ప్రతీ వ్యక్తి నేర్చుకున్నదే. మొదటగా వీరు చదివి నేర్చుకున్నా, ఎప్పుడో ఒకప్పుడు అనుభవంలో నేర్చుకున్నదే. ఆ అనుభవానికి చిన్న నిప్పురవ్వైనా సరే లేక వంటింటిలోని పొయ్యిపైన ఉన్న మంటైనాసరే లేదా మరేదైనా ప్రతీ వ్యక్తికి అనుభవంలోకి వచ్చిందే. కాదనగలరా??

గురుత్వాకర్షణ శక్తి గురించి కలిగిన ఆలోచన వెనకాల ఓ మహానుభావుడైన సర్ ఐజక్ న్యూటన్ ఆలోచనా విధానం మనకు ఓ ఉదాహరణ. ఈ మహాను భావుడు విపరీతంగా ఆలోచించలేదు కానీ వైవిధ్యభరితమైన కొత్త కోణాన్ని సృజించారు. అంతే కాని ప్రకృతి కి విరుద్దమైన ఆలోచన చేసి ఎయిడ్స్ లాంటి రుగ్మతకు రూపం పొందించలేదు. ఎకే 47 సృష్టికర్త కూడా ఇలాంటి మారణాయుధాన్ని ఎందుకు కనుగొన్నానా అని విలపించాడు. న్యుక్లియర్ బాంబ్ కనుక్కొవడమెందుకు ఆ తరువాత అనుభవించడం ఎందుకు.

ఇక్కడ ప్రస్తుతమైన విషయం ఏమిటంటే, మన సంసృతి మనకు నేర్పించినదేమిటి? విధ్వంసాన్నా లేక వినాశనానికి దారి తీసే విషయాన్నా? ఒక వేళ మనం ఉన్న సమాజం మనకు అదే నేర్పుతుంటే, మన విఙ్ఞత మనకేం నేర్పుతోంది అని మనం ఆలోచించుకోవలసిన అవసరం మనకు లేదా? లేదు అనుకుంటే మనం కొత్తగా ఆలోచించం. అలాగే ఎవ్వరిని మనం ప్రశ్నించం. కానీ దైవం విషయంలో మాత్రం చాలా మంది ప్రశ్నిస్తున్నారే!! అదే ఇక్కడ హాస్యాపదం. పోనీ వారు పుట్టి పెరిగిన సమాజం లేదా వారి సంసృతి వారికి దైవం విషయం గురించి చెప్పలేదా అంటే అదేం కాదు, చిన్నప్పటి నుంచి చెబుతున్నా వినిపించుకోకుండా చెవిటి వాళ్ళై పెరిగారు.

ఇలాంటి వారిని చూస్తే నాకు చార్వాక సిద్దాంతం గుర్తుకు వస్తుంది. చార్వాకుల గురించి తరువాత వ్రాస్తాను. అంతవరకూ నేను గమనించిన దేవుళ్ళ గురించి ఓ పుట. ఆఖరుగా దైవం గురించి తెలుసుకోవాలంటే ముందుగా..

చదివి తెలుసుకోవాలి..

విని తెలుసుకోవాలి..

అనుభవంలోకి తెచ్చుకుని తెలుసుకోవాలి..

ఆఖరిగా ఓ సంసృతిని అలవరచుకుని తరువాతి తరాలికి ఆ సంసృతిని అందించాలి.

15, మార్చి 2011, మంగళవారం

దైవం – ఆలోచనల పరంపర

దైవం పై నేను చేసిన మొదటి పుట వెనకాల ఉన్న మూల ఆలోచనని ఇంతకు ముందు వ్రాసుకున్నాను. ఇప్పుడు రెండొవ పుట వెనకాల ఉన్న ముఖ్య ఉద్దేశ్యం వివరించే ప్రయత్నం చేస్తాను. ఒక్క సారి అవలోకనం చేసుకుంటే, మనల్ని ఇలా శపించేటోడు దేవుడా!! అన్న శీర్షిక వచ్చిన రెండొవ పుట వెనకా ఉన్న ఆవేదన అనాధలైన పసి పిల్లలు మఱియు వారి స్థితి. ఇదే పుటలో ప్రకృతిలో జరుగుతున్న ప్రళయాల గురించి ప్రస్థావన జరిగింది. వీటితో బాటుగా సృష్టిలోంచి ఉద్బవించిన వాటిని తమ శక్తులతో ప్రతి సృష్టి చేస్తున్నాం అని చెప్పుకుంటున్న బాబాలను ప్రశ్నించడం జరిగింది.

ఇక ప్రస్తుత విషయానికి వచ్చేముందు, ఈ మధ్య జరిగిన కొన్ని ఘటనలను ఙ్ఞప్తికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తాను. ఈ మధ్య వార్తలలో కనబడే అతి సాధారణ విషయాలలో మొదటిది దుర్ఘటనలు (యాక్సిడెంట్స్) మరొకటి హత్యలు. ఇలాంటి ఘటనలో ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. కొందరి మరణానికి వారు అతివేగంగా ప్రయాణం చెయ్యడం కారణమైతే, మరి కొందరు దొంగతనానికి వచ్చిన దొంగల అసహనానికి గురై ప్రాణాలు కోల్పోతున్నారు. అతి వేగంగా ప్రయాణం చెయ్యడమెందుకు ఆపై దుర్ఘటన జరిగింది దేవుడు మమ్ములను కాపాడలేదు అని నిందించడ మెందుకని. అర్భాటాలకు పోయి మా ఇంట్లో ఇంత ధనం ఉంది అన్నట్టుగా నిండా దొంగ బంగారాన్ని దిగేసుకుని నలుగురిలో తిరగడమెందుకని ఆ తరువాత నలుగురి కళ్ళల్లో పడ్డట్టే దొంగల కళ్ళలో కూడా పడి దోపిడీకో లేక మరింకేమైన పోగొట్టుకోవడం ఎందుకో.

సరే ఈ విషయాలు ప్రక్కన పెట్టి మరో విషయం ప్రస్తావిస్తాను, ఈ మధ్య వచ్చిన వార్తలలో ఓ తల్లి తన కన్న బిడ్డలనే చంపేశిందని చదివాను. ఆ తల్లి ఎందుకు అలా చేసిందో అని విచారించే ముందు, మరో విషయం. హైందవులు పరమ పవిత్రంగా పూజించే గంగా దేవి తనకు పుట్టిన అష్ట వసువులను పుట్టంగానే చంపేసిందంట. మరి ఈ తల్లి ఎంతటి ఖటినాత్మురాలో కదా!?

ఇక్కడ ప్రస్తావించిన రెండు సంగతులూ చాలా మటుకు ఒకే రకంగా ఉన్నా, వాటి వెనకాల ఉన్న కారణాలు ఒక్కసారి గమనిస్తే.. మొదటి తల్లి ఈ భవ సాగరంలో తన బిడ్డలను సాకలేక తన బిడ్డలకు మృత్యువుని ప్రసాదిస్తే, మరో తల్లి విషయం గురించి పురాణం తెలిసిన వారిని ఎవ్వరినైనా అడిగితె వివరం అర్దం అవుతుంది. తెలుసుకోవాలన్న కోరిక ఉన్న వారు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. తెలిసిన తరువాత అర్దం చేసుకుంటారు. తెలుసుకో్వాలని అనుకోనివారు గంగమ్మ మీద నిందలేస్తూ ఇలాగే ఇక్కడే ఉండి పోతారు.

ఇవన్నీ ఎందుకు నిన్నగాక మొన్న జరిగిన భూకంపం మరియు సునామి ధాటికి జపాన్లో వేలకొద్ది జనాలు మరణిస్తున్నారు. వేల కోట్ల సష్టం లెక్కల లోకి రానుంది. జపాన్ ఆర్దిక వ్యవస్థ 1987 తరువాత ఇంతగా క్షీణించింది లేదు. ఇవన్నీ ప్రకృతి వైపరిత్యాల వల్ల మనకు అనుభవంలోకి వస్తున్న మరియు వచ్చిన ఘటనలు. ఇంతకు ముందు కూడా ఇలాగే రెండొవ ప్రపంచ యుద్ధంలో చైనా జెపాన్లపై అమెరికా అణుబాంబు ప్రయోగించిన తరువాత చాలా కాలం పాటు ఈ రెండు దేశాలు నిలదొక్కుకోలేక పోయ్యాయి. కానీ ప్రపంచం అంతా ఇప్పుడు మెచ్చుకునే రెండొవ ఆర్దిక వ్యవస్థగా ఎదినది ఎవ్వరు? ఏదో దెబ్బ తగిలింది కదా అని ఏడుస్తూ కూర్చోకుండా పోరాడి ఎలాంటి పరికరాన్నైనా చవకలో తయ్యారైయ్యే విధానాలకు మారు రూపమైన చైనా మాన్యుపాక్చరింగ్ వ్యవస్థను మెచ్చుకోకుండా ఉండలేం కదా.

ఇలా ఏదైనా వైపరిత్యం జరిగినప్పుడు లేదా అనుకోని ఆపద వచ్చినప్పుడు దైవాన్ని నిందించడమే ప్రధాన కర్తవ్యంగా పెట్టుకున్న వాళ్ళకి వివరం చెప్పే విధంగా ముందుగా వారిని ఆకుట్టుకునే ప్రయత్నమే నా మరో పుట, మనల్ని ఇలా శపించేటోడు దేవుడా!! అలాంటి వాళ్ళకు కొన్ని ప్రశ్నలు..

  • రెండొవ ప్రపంచ యుద్దంలో అణుబాంబు వేసినది దైవమా..
  • ఏయిడ్స్ కనుకొన్నది దైవమా..
  • బుద్దిగా సంసారం చేసుకుంటూ ఒక స్త్రీయందే రమించి పిల్లలను కనమని పెద్దలు చెబుతున్నా పెడ చెవిన పట్టి ప్రకృతికి విరుద్దంగా జంతువులతో సంయోగం చేసే వివరీత బుద్ది కలిగినది దైవానికా..
  • మన లాభం కన్నా పక్కవాడి నష్టమే ప్రయోజనంగా ఎదుగుతున్న న్యూక్లియర్ ప్లాంట్లను కూలగొట్టింది దైవమా..

అందుకే పెద్దలు చాలా సార్లు చెప్పారు, వినాశకాలే విపరీత బుద్ధి అని. “విపరీతంగా ఆలోచించడం దేనికి ఆపై విసుగు చెందడం దేనికి” అన్న విషయం ఎంతమందికి అర్దం అవుతుందో కదా!!

2, మార్చి 2011, బుధవారం

దైవం – నా ఆలోచనలు

ఇంతకు పూర్వం, 2009 వ సంవత్సరం ఆగస్ట్ నెలలో దైవంపై నా అభిప్రాయాన్ని తెలియజేయడానికి ఓ మూడు ప్రయత్నాలు చేసాను. అప్పుడు పుట్టిన ఆలోచన రూపం దాల్చుకోవడానికి చాలా కాలం పట్టేడట్టు ఉంది. ఏదైనా పని చేసేటప్పుడు దాని గురించిన విషయాలను కూలంకుషంగా కాకపోయినా, నాకు తృప్తి కలిగేంత వరకూ సోధించి ఆ తరువాత దానిగురించి స్వీయావలోకనం చేసుకుంటాను. ఆ తరువాతే నాకు అర్దం అయ్యిన దానిగురించి వ్రాసుకుంటాను. ఈ ప్రక్రియలో దైవం గురించి అర్దం చేసుకోవడానికే చాలా కాలం పట్టేడట్టుంది.  కాని అంతవరకూ ఊరికే ఉండకుండా కొంచం కొంచంగా ఇక్కడ పెట్టే ప్రయత్నం చేస్తాను.

దైవంపై నేను వ్రాసిన పాత పుటలలో మొదటిది, దేవుడా !! తొక్కా !! ఎవ్వడాడు ? ఎక్కడుంటాడు? అనే శీర్షికన వచ్చింది. అక్కడ మొదలైంది హేతువాదంపై నాలో చర్చ మరియు పరిశోధన. అలాంటి ఆలోచనకు కొంత రూపం ఏర్పడటం వలన ఇక్కడ ప్రారంభం చేస్తున్నాను. ఈ పుట ప్రచురించిన తరువాత ఓ పూజ్యనీయులైన పెద్దాయన సున్నితంగా నన్ను ఈ క్రింది విధంగా హెచ్చరించారు..

.. కుమారా, దైవదూషణ ఏవిధంగానైనా పద్దతి కాదు, జాగ్రత్త ..

అప్పుడు వారితో ఒక్క విషయం మాత్రమే చెప్పాను. “మరికొంత కాలం ఎదురు చూడండి” అని. అప్పటినుంచి ఆలోచించగా.. చించగా, ఇదిగో ఇప్పుడు కుదిరింది అని మాత్రం చెప్పను, కానీ, నా ఆలోచనలో పూర్తి స్పష్టత రాకపోయినా, ఎంతో కొంత వివరం బయట పడింది. దానిలోని కొన్ని పాయింట్స్ ఇక్కడ. మొదటి పుటలో స్పందనగా ఓ నాస్తికుడు తన పాత పోస్టుని ఇక్కడ వ్రాసాడు. ఈ మధ్యలో ఒక సారి “నేను” అనే పదంపై ఓ గుంపులో చర్చ మొదలు పెట్టగా, నాకు అందిన మొదటి స్పందన రమణ మహర్షి వారి రచనల గురించి.

అంతకు ముందు వరకూ నాకు రమణ మహర్షిగారి గురించి తెలియక పోవడం వల్ల కించిత్ తడబడ్డా, రమణ మహర్షిగారి భావనలోని మూలం ఏదిశగా సాగుతుందో అర్దం అయ్యింది. ఈ పుట వ్రాస్తున్నప్పటికి నాకు రమణ మహర్షిగారి గురించి పూర్తిగా కాకపోయినా సూచనా మాత్రంగా అణువంత మాత్రమే తెలుసు, వీలు చేసుకుని వీరి గురించి మరోసారి కూలంకుషంగా అర్దం చేసుకునే ప్రయత్నం చేస్తాను.

దైవంపై నేను వ్రాసిన మొదటిపుట చాలా మందిలో నాపై లేదా నా వ్యక్తిత్వంపై ఓ రకమైన అభిప్రాయాన్ని ఏర్పరచి నన్ను అపార్దం చేసుకునేటట్టు చేసింది. అలా వారు అనుకునే విధంగా పుట వ్రాయడంలో నేను ఆశించినది నూటికి నూరు శాతం సిద్దించింది. ఎక్కువ మంది నన్ను లేదా నా వ్యక్తిత్వాన్ని నిర్ణయించే కొలమానంగా నేను వ్రాసే వ్రాతలనే తలచి నందువల్ల వీరు నన్ను అపార్దం చేసుకున్నారు.

నేను జీవితాన్ని చాలా తక్కువ చూసాను, కానీ నా ఈ చిన్ని జీవన ప్రయాణంలో నేను గమనించిన ఓ విషయమేమిటంటే ..

ఎక్కువ మంది ఎదుటి వారి ప్రవర్తనను పూర్తిగా గమనించకుండా స్వల్ప కాలంలోనే నిర్ణయించేస్తారు. ఇదే విషయాన్ని ఆంగ్లంలో, Most of the people judge others in అ very short time and spontaneously without studying for a long time

ఈ విషయాన్ని ఇక్కడ ఎందుకు ప్రస్తావించానంటే, మన మధ్య జరుగుతున్న ఘటనల నుండి మనం తేరుకుని జరిగిన విషయాన్ని జీర్నించుకుని ఏవి జరిగాయో అది ఎందుకు జరిగిందో అవగతం చేసుకునేంత వ్యవధి ఇవ్వకుండా దైవంపై అప్పుడు నేను పేలినట్టు అవాకులు చెవాకులు చేస్తుంటాము. ముఖ్యంగా దైవంపై. ఎందుకంటే, మనం చేసిన నిందలకు పరదైవం వచ్చి వివరం ఇచ్చుకోరుగదా. నామరూప ప్రధానమైన ఈ జగత్తులో అందునా ప్రస్తుత సామజిక జీవనంలో ఉన్న న్యాయ వ్యవస్థ ఉదాహరణగా తీసుకుంటాను. ప్రస్థుత న్యాయ వ్యవస్థ ప్రకారం ఎవ్వరైనా మరొకరిపై దొంగతనం కేసు వేస్తే, అభియోగం మోపబడ్డ ముద్దాయి, ఆ దొంగతం తాను చెయ్యలేదన్న నిరూపణ చేయ్యవలసిన భాద్యత వహించ వలసి వస్తుంది.

ఈ విధమైన ఆలోచన కలిగిన వాళ్ళే చాలా మంది, ఏదీ దేవుడ్ని చూపించు చూద్దాం అని దైవ భక్తులను నిలదీస్తుంటారు. మరో పుటలో మనకు కనబడని ఏదో ఒక అతీత శక్తి గురించి మరోసారి. అంత వరకూ .. ఓం, నమః శివాయః

21, డిసెంబర్ 2010, మంగళవారం

ముక్తి అనగానేమి?

ఈ మధ్య నేను తెలుగు నిఘంటువులో పాలుపంచుకుంటూ తెలుగు పదాలను యూనికోడ్ ద్వారా వ్రాస్తున్నప్పుడు కలిగింది ఈ ప్రశ్న. ఓ సత్‍సంగంలో ఈ విషయమై చర్చ మొదలు పెట్టగా పలు పలు సమాధానాలు మరియు వివరణలు వచ్చాయి. వాటన్నింటిని క్రోఢీకరించి ఓ చోట ఉంచితే బాగుంటుంది అన్న ఆలోచన రూపమే ఈ పోస్టు.

ముక్తి గురించిన వివరాలు చదివే మీకు తెలిసే ఉంటాయి. కానీ నాకు తెలిసిన వివరాన్ని ఇక్కడ పంచుకుంటున్నాను. అసందర్బం అనిపిస్తే మన్నించండి.


ముక్తి అనేది రెండు స్థితులలో ఉంటుంది అని, “లేవండి మేల్కొనండి” అనే బ్లాగు రచయతైన సురేష్ బాబుగారు ఈ క్రింది విధంగా స్పందించారు.

1.జీవన్ముక్తి, అంటే జీవించి ఉండగానె పరమాత్మలో లేక ఆత్మానందం లొ నిమగ్నమై ఉండడం.
2.విదేహముక్తి, అంటే మరణించిన తర్వాత ముక్తి పొందడం.


చర్చలో పాల్గొంటూ, “వాగ్విలాసము” అని బ్లాగుతున్న ముక్కు శ్రీ రాఘవ కిరణ్ గారు తన అభిప్రాయాన్ని వారిమాటలలో..

చతుర్విధ ముక్తములు అనేవి సారూప్యం, సామీప్యం, సాలోక్యం, సాయుజ్యం. ఇవి ముక్తిభేదాలు కావనుకుంటా! తన్మార్గంలో వివిధస్థాయీభేదాలు అనుకుంటాను.

సారూప్యం తవ పూజనే శివమహాదేవేతి సంకీర్తనే

సామీప్యం శివభక్తిధుర్యజనతాసాంగత్యసంభాషణే

సాలోక్యం చ చరాచరాత్మకతనుధ్యానే భవానీపతే

సాయుజ్యం మమ సిద్ధమత్ర భవతి స్వామిన్ కృతార్థో೭స్మ్యహమ్

అని శివానందలహరిలో ఆదిశంకరులు స్తోత్రం చేస్తారు.

· నిరంతరసంకీర్తనం గుణగానం వలన సారూప్యం (ఆ గుణాలు అలవడటం) సిద్ధిస్తుంది.

· శివభక్తులతో నిత్యసాంగత్యం వలన సామీప్యం (దగ్గఱితనం) సిద్ధిస్తుంది.

· సమస్త చరాచరజగత్తునందూ శివునినే చూడటం వలన సాలోక్యం (కైలాసవాసం) సిద్ధిస్తుంది.

· తదనంతరం సాయుజ్యం (స్వామిలో ఐక్యమవ్వటం) సిద్ధిస్తుంది


చర్చలో ఆఖరున పాల్గొన్న లీలామోహనం బ్లాగరి చిలమకూరు విజయ మోహన్ గారు ఈ క్రింది విధంగా వారి అభిప్రాయాన్ని తెలియ జేసారు.

మోక్షము,కైవల్యం,సాలోక్యం,సారూప్యం,సామీప్యం గురించి శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామి వారి సమాధానాన్ని ఇక్కడ పొందుపరుస్తున్నాను.

మోక్షమంటే విడుదల అని అర్థము. కర్మబంధమునుండి పూర్తిగా విడుదల పొందడాన్ని మోక్షమని రూఢిగ అంటారు. అలా కర్మబంధం తొలిగాక, రెండు స్థితులుంటాయి.

జీవుడు అర్చిరాది మార్గం ద్వారా విరజానదిని దాటడందాక అంతా సమానమే. విరజానది దాటాక కేవలం ఆత్మానుభవమే కోరి తృప్తిచెంది, అలా ఉపాసన చేసినవారు ఆ పరమపదంలోనే ఓమూలనుండే చోటుకు చేరి కేవలునిగానే మిగిలిపోతాడు. దానిని కైవల్యం అంటారు. అదీ మోక్షమే.

కర్మలన్నీ నశించాయి అర్చిరాదిగుండా విరజానది దాటి వచ్చాడు కనుక ఇక తిరిగి జనన మరణ చక్రంలో ప్రవేశించడు. భగవదనుభవాన్ని కోరలేదు కనుక దాన్ని పొందడు, తిరిగి వెళ్ళడు. స్వాత్మసాక్షాత్కారం పొంది, ఆత్మానుభూతిలో తేలియాడుతుంటాడు.అది నిత్య స్థితి.

అదికాక, భగవత్సేవనే మోక్షమని ఉపాసించిన వాడు, విరజానది దాటగానే అమానవ అనే స్పర్శతో పంచోపనిషణ్మయ దివ్యదేహం ఏర్పడుతుంది. అది చాలా రకాలుగ అలంకృతమై, ప్రేమ పూర్ణమై భగవదనుభవార్హమై గరుడుని తోడ్పాటుతో పరమాత్మ సన్నిధికి చేరి స్వామిసేవలో ఉంటాడు.వీటిల్లో ఆలోకంలోకి, విరజానది దాటగానే, ప్రవేశిస్తాడే ఈ జీవుడు, ఆ స్థితిని సాలోక్యం. భగవంతునితో సమానంగా ఒకే లోకంలో ఉండడం.

ఆవెంటనే అమానవకరస్పర్శ దివ్యదేహప్రాప్తి, అలంకరణ జరుగుతాయే ఇది సారూప్యం అవుతుంది.

క్రమంగా భగవన్మండపము ప్రవేశించి భగవంతుని దరికి చేరు సమయం- సామీప్యం అంటారు.

అతడి అనుగ్రహాన్ని పొంది శ్రీమన్నారాయణ దివ్యదంపతుల గోష్ఠిలో ఉండి, అతడి గుణాలను పొంది నిత్యకైంకర్యాన్ని చేపట్టడం సాయుజ్యం అంటారు .

ఇందులో ముక్తులు అందరూనూ, గరుడాది పెద్దలందరినీ నిత్యులని వ్యవహరిస్తుంటారు.ఈ వెళ్ళిన వీడు ముక్త గోష్ఠిలో చేరతాడు.

18, జులై 2010, ఆదివారం

తల్లి చేసే అతి ముఖ్యమైన పనులు – మొదటి పుట

తల్లి .. ఇది నిజం.. తల్లి గురించి ఇంతకంటే ఎక్కువ నేను వ్రాయాలనుకోవటం లేదు.. వ్రాసినా అది ఎటువంటి అనర్దాలకు మరియు అపార్ధాలకు దారి తీస్తుందో అన్న భయం నన్ను ఇక్కడ ఆపేస్తోంది..

mom

అమ్మ .. చాలా పనులు చేస్తుంది .. పవన్ కళ్యాణ్ పులి సినిమా ఆడియూ రిలీజ్ ఫంక్షన్ లో ఒక చోట రెహమాన్ గురించి మరియు రెహమాన్ తల్లి గురించి ప్రస్తావిస్తూ అన్న మాటలు ..

“.. మొదటి గురువు తల్లి.. విలువలు మరియు వినయం తల్లి నేర్పిస్తుంది ..”

ఈ మాటలు చాలా మంది ఇంతకు ముందు చెప్పినా మఱోసారి తలచుకోవాలనిపిస్తోంది .. ఇక్కడ మీరు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని చూడకండి .. ఆ మాటల వెనకాల ఎంత అర్దం దాగి ఉందో అర్దం చేసుకోవడాని ప్రయత్నించండి.

తల్లి అనే రెండక్షరాలు వివరించడానికి ఒక జీవితం చాలదు. ఏది ఏమైనా తల్లి కావలని తపిస్తున్న ప్రతీ స్త్రీకి ఉండ వలసిన ముఖ్యలక్షణాలు .. విలువలు మరియు వినయం.

వీటిల్లో మొదటిది .. విలువలు.. లేకనే రావణాసురుని తల్లి సమయం కాని వేళల్లో రతి కార్యం చేసి రావణాసురుడికి జన్మనిచ్చింది. కాని,  ఆవిడకు గాని రావణాసురునికి గాని వినయం లేదని నేనను..

14, మార్చి 2010, ఆదివారం

కన్నీళ్ళు కారిస్తే సరిపోతుందా!!

ఈ మధ్య కాలంలో నా జీవితంలో జరిగిన కొన్ని అనూహ్య పరిణామాలలో ఒకటి, BoSF అనే గుంపులో చేరడం. BoSF అంటే Birds of Same Feather. ఏది జరిగినా మన మంచికే అనే సూక్తిని నమ్మే నేను, ఈ గుంపులో చేరిన తరువాత చాలా భాధాకరమైన వార్తలే వింటూ వస్తున్నాను. వాటిలో ఒకటి ఈ క్రిందనున్న వీడియో కూడా. ఇంతటి చేదు విషయాలను విన్నప్పుడల్లా నాకళ్ళు అసంకల్పితంగా వర్షాన్ని కురిపిస్తోంటే, ఈ గుంపులో చేరడం ఏవిధంగా మంచో నాకు అర్దం కావడం లేదు. ప్రస్తుతానికి ఏడవడం తప్ప ఇంకేమీ చెయ్యలేకపోతున్నాను. కానీ ఏడిస్తే మాత్రం సరిపోతుందా!! ఏమో !! తెలియదు... తెలిసినదల్లా ఒక్కటే.. భాధపడటం.

 

నేనేమి సునీతా కృష్ణన్ కాను. కానీ సునీతా కృష్ణన్ శతృవులలో నేను ఒకడినే. ఇంత వరకూ నేను అచేతనంగానే ఉన్నాను. సునీత నన్ను ఏదో పెద్ద సహాయం చెయ్యమనలేదు కానీ నా ఈ మౌనాన్ని విడనాడమంది. ఇద్దరికి ఈ విషయాన్ని చెప్పమంది. అదే చేద్దామనే ప్రయత్నమే ఈ పోస్టు. నాకు ఉన్న స్టాటిస్టికల్స్ ప్రకారం నా ప్రతీ పోస్టు దాదాపు ఓ వంద మంది చదువుతారు, కానీ అందులోంచి చాలా (చాలా చాలా, బహు చాలా) కొద్ది మంది మాత్రమే స్పందిస్తారు. దీని వెనుక కారణం నా ప్రచురణలో సరైన అంశం లేకపోవడం అంతే కాకుండా నేను వ్రాసే విషయాలు పూర్తిగా స్వవిషయం అయ్యి ఉండడమే.

కానీ ఇవాల్టి ఈ విషయం ఒక్క నాది మాత్రమే కాదు మౌనంగా ఉండే మన అందరిదీ. పదిహేనేళ్ళ వయస్సులో ఎనిమిది మంది కామాంధులచేత మానభంగం చేయబడ్డ సునీతకు అన్యాయం చేసిన కామాంధులు గుర్తుకు లేరని చెప్పడమే కాకుండా, పబ్లిక్ గా పది మంది ఉన్న చోట ధైర్యంగా ఈ సమస్యకి మరియు సునీతకు శతృవులు మీరే అని చెప్పే సాహసం ప్రశంసనీయం. అమ్మాయు మాటల్లో చెప్పాలంటే,

 .. my [Sunitha's] biggest challenge is the civil society, not the human traffickers who beat her up, it is you and me, my biggest challenge is your mind blocks to accept these victims as our own. ..it is not nice to bring them to our home, it is not nice to let our children to befriending them.. can you break your silence, can you open your minds.. can you open your hearts.. accept them as human beings ..

అన్నింటికన్నా హృదయ విదారకమైన విషయమేమిటంటే, ఈ ప్రజెంటేషన్ మొదలు పెట్టినప్పుడు చూపించిన పసికూనల చిత్రాల విషయాలు. వ్రాయాలంటే వేళ్ళు నెప్పి పుట్టటంలేదు కానీ వ్రాసే సాహసం నా మనసుకు రావటంలేదు. మీరే వినండి. ఇంతకన్నా ఎక్కువవ్రాస్తే అది నా భాధ అవుతుంది కానీ సునీతకృష్ణన్ భావమవ్వదు.

30, ఆగస్టు 2009, ఆదివారం

ఆశ్తికత్వమా!! నా బొందా!! ఎవ్వడా దేవుడు?

 

ఈ మధ్య ఓ సహ తెలుగు బ్లాగరు వ్రాసిన దానిని చదివిన తరువాత నాకు నవ్వాగలేదను కోండి. సోది ప్రక్కన పెట్టి అస్సలు విషయానికి వస్తాను. అస్సలు నాస్తికత్వం అనేది ఏదైనా ఉందా అని నా అనుమానం. ఆస్తికులు అనేటోళ్ళు ఎవ్వరు? అలాగే నాస్తికులు అని వేరు చేసే వాళ్ళకి ఉండాల్సిన అర్హత ఏమిటి? ఓ!! మర్చిపోయ్యాను. ఇక్కడ దేవుడు అనే ఓ విషయం ఉంది కదా .. అలాంటి విషయం ఉంది అని నమ్మేటోళ్ళు ఆస్తికులా .. నమ్మని వాళ్ళు నాస్తికులా .. మరి నేను నాస్తికుడినా? లేక ఆస్తికుడినా? ఈ విషయం గురించి తరువాత చర్చిద్దాం. ఇక అసలు విషయానికి వస్తే, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి.. తెలియక ముందు నుంచి కూడా, నాకు ఫలానాది ఇది అని చెప్పినోళ్ళు చాలా మంది. ప్రతీ ఒక్కరూ నాకు గురుతుల్యులే.

కష్టే శ్రమే ఫలి అన్న మొదటి పాఠాన్ని నేర్పిన తల్లి మొదటి గురువు. ఎలా అనుకుంటున్నారా.. అకలి వేసి ఏడిస్తే, ఆ ఏడుపుని అర్దం చేసుకుని చనుబాలను నాకు అందించి కతకడం అనే అలవాటు నేర్పిన మొదటి గురువు అమ్మ. ఈ రోజుల్లో అమ్మలు పిల్లలకు ఆ విధ్యని నేర్పించకుండా పుట్టిన వెంటనే పోత పాలు అలవాటు చేసి కష్ట పడకుండా ఎలా ఎదగచ్చో నేర్పుతున్న తల్లులు నా దృష్టిలో పిల్లలకు స్వతహాగా నేర్చుకునే అలవాటుకు అడ్డిపడి వారి ఎదుగుదలకు అడ్డుపడే అవరోధాలని అభిప్రాయం. ఆ పిల్లల పాలిట శాపాలుగా అనిపిస్తారు. ఇక్కడ పాలు రాని తల్లుల విషయం నేను ప్రస్తావించడం లేదని చదివే వారు గమనించాలి.

నేను మాటలు రాక ఏవేవో శబ్దాలు చేస్తుంటే, నా శబ్దాలలోంచి వారి వారి బంధుత్వ వరుసలు నాకు తెలియ జేస్తూ నాచేత నాన్న .. మామ.. అత్త.. తాత.. బామ్మ.. ఇంకా ఏవేవో పలికించి వారిని వారు పరిచయం చేసుకుంటూ, నీకంటూ ఈ లోకంలో నేనున్నాను అంటూ అభయమిచ్చిన నా బంధు జనం అంతా నాకు మాటలు నేర్పిన గురువులే. బడిలో పలకా బలపం పట్టుకోవడం నేర్పిన భాద్యత గల ఓ ఉధ్యోగి నాకు విధ్యా బుద్దులు నేర్పిన గురువు. ఆట పాటలతో తింగరేషాలు వేస్తుంటే, తాళగతులతో నాట్యాన్ని నేర్పిన  వాసిరెడ్డి కనకదుర్గగారు నాకు గురువు. ఈత కొట్టడంలో మెళుకువలు నేర్పి బంగారు పతకాలు చేజిక్కించుకునే నైపుణ్యాన్నిచ్చిన వెంకటేశ్వరరావ్ కోచ్  నాకు గురువు.

విధ్యాభ్యాసాన్ని ముగించి ఉద్యోగ వేటలో సహాయం చేసి బ్రతుకు బ(బం)డిలో పలు పలు పాఠాలను నేర్పిన విస్వేశ్వరుడు నాకు గురువు. ఏవిధంగా సంగమిస్తే రతి సుఖం లబిస్తుందో తెలియ జెప్పే భార్య నాకు గురువు. ఎవ్వరికి సహాయం చెయ్యాలో ఏ సమయంలో చెయ్యాలో తెలియజేసి నాకు పుణ్యాన్ని ఆర్జించి పెట్టే అన్నయ నాకు పుణ్యఫలం చేజిక్కించుకునే నైపుణ్యాన్ని నేర్పిన గురువు. షేర్ మార్కెట్లో డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే లాభాలు వస్తాయో తెలియ జెప్పే కంపెనీలు నాకు వ్యపార పరంగా గురువులు.

ఇలా ఎందరో మరెందరో గురువులు నా దృష్టిలో దేవుళ్ళు. వీళ్ళంతా కనిపించే దేవుళ్ళు. నేను వీళ్ళనే దేవుళ్ళంటాను. మరి ఆస్తికులు ఉదహరించే సదురు దేవుడు వీళ్ళల్లో లేడే. మరి నేను ఆస్తికుడినా లేక నాస్తికుడినా?? సరే ఆస్తికుడు అనుకుందాం అనుకుంటే మరి ఆ దేవుడిని గుర్తించాలిగా ?? ఇంతకీ ఆ సదురు దేవుడేక్కడున్నాడు? రమ్మనండి నాముందుకు. రాడే!! ఎందుకొస్తాడు ఉంటేగా!!?? సరే నేను ఆస్తికుడిని కాదు నాస్తికుడిని అనుకుందాం అనుకోండి, నాకంటూ దేవుళ్ళు ఉన్నారే!! మరి నేనెలా నాస్తికుడినౌతాను??

నాకు తెలియక అడుగుతాను.. ఆస్తికుడు అంటే తెలుగులో అస్తికలు కలవాడనేగా!! (కాకపోతే సరిజేయ గలరు) మరి ఈ లెక్కలో నాస్తికుడు అంటే అస్తికలు లేని వాడనా!! అంటే ఎవ్వరిలో ఎముకలు లేవంటే వారంతా నాస్తికులా?? యదవ లాజిక్కులు తీసి తొక్కలో డైలాగ్లు వెయ్యొద్దంటారా!! సరే వెయ్యను గాక వెయ్యను. మీరే చెప్పండి. దేవుడంటే ఎవ్వరు? ఎలా ఉంటాడు? ఓ!! రాముడిలా మీస్సాలేకుండా క్లీన్ షేవ్ చేసుకుని ఉంటాడా. లేక కృష్ణుడిలా చిలిపి దొంగతనాలు చేస్తూ ఉంటాడా!! అదీ ఇదీ కాదు.. ఏమీ చేతకాని వాడిలా అందరూ తిడుతూ కొడుతూ ఉంటే.. ’పోనీలే పాపం చేస్తున్నారు, వీళ్ళందరూ సంజాయిషీ ఇచ్చేరోజు వస్తుంది’ అని అవమానాలు ఛీత్కారాలు భరించిన ఏసు ప్రభువు లాగుంటాడా!!

16, ఆగస్టు 2009, ఆదివారం

మనల్ని ఇలా శపించేటోడు దేవుడా!!

 

ఇవ్వాళ మా ఆఫీశ్ వాళ్ళం అంతా కలిసి చర్లపల్లి లోని స్పూర్తి ఫౌండేషన్ వాళ్ళు నడుపుతున్న అనాధ శరణాలయానికి వెళ్ళాం. అక్కడ దాదాపు ఓ వందకు పైగా అనాధ పిల్లలు ఉన్నారు. వాళ్ళలో ఓ చిన్నపిల్ల అందరినీ ఆకట్టుకుంది. మేము అక్కడ ఉన్నంత సేపట్లో ఆ పిల్లని ఎత్తుకోని వాళ్ళు లేరు. నాకు తెలిసి ఆ పిల్ల కాలు క్రింద పెట్టలేదనుకుంటా. ఆ పిల్ల వయస్సు దాదాపు ఓ ఆరు లేదా ఏడు ఏళ్ళు ఉంటాయి. ఆ అమ్మాయి తండ్రికి ఎయిడ్స్ వచ్చి పోయ్యాడు. పోతే పోయ్యాడు, (యదవ..) పోతూ పోతూ ఆ జబ్బుని తన భార్యకి అంట గట్టి పోయ్యాడు. వాడు పోయిన తరువాత ఆ తల్లి ఈ పిల్లని తీసుకుని ఈ శరణాలయానికి వచ్చి ఈ పిల్లని చేర్చిన ఓ రెండు నెలలకు తనూ చనువు చాలించింది. అందువల్ల ఈ పిల్లకి తన అనే వాళ్ళు ముద్దు ముచ్చట చేసే వాళ్ళు లేని తరుణంలో మేమంతా కనబడేటప్పటికి ఆనందం ధుఃఖం రెండూ ఒకేసారి వచ్చేసాయి. సరే అది వేరే కధ.


ఇక అసలు విషయానికి వస్తే.. సదురు సో కాల్డ్ దేవుడు అనేవాడుంటే.. నేను ఒకే ప్రశ్న వేయ దలచాను. అభం శుభం తెలియని ఎందరో చిన్నారులు ఎయిడ్స్ ఆంటి ప్రాణాంతక వ్యాధుల భారిన పడి బలైతున్నారు. వీళ్ళేం పాపం చేశారని వీళ్ళకీ శిక్ష? ఒక వేళ వీళ్ళకి ఇలాంటి వ్యాధులు లేక పోయినా, ఇలా అనాధలని ఎందుకు చెయ్యాలి? ఇలా జీవితాంతం ప్రేమానుభవాలకు దూరంగా పెరగాల్సిందేనా!! ఇలా అనునిత్యం ఎంతో మంది చిన్నారులను ప్రేమానురాగాలకు దూరంగా బ్రతకమని తలరాత వ్రాసే దేవుడు నిజంగా దేవుడేనా?? ఎంతటి దుర్మార్గుడో సదురు దేవుడు!!

 

వీళ్ళని తీసి ప్రక్కన పెడదాం. దేశంలో చాలా ఘోరాలు జరుగుతున్నాయి. వేలాది మంది ప్రాణాలు పోతున్నాయి. అలాంటప్పుడు కూడా మౌనం వహిస్తున్న దేవుడు ఒక దేవుడేనా?? దేవుడనేవాడుంటే అమెరికాలోని ట్విన్ టవర్స్ కూలుతున్నప్పుడు ఎక్కడున్నాడు? వేలకు వేల మంది జనాభా చనిపోతున్నప్పుడు ఎక్కడున్నాడు? ఇరవయ్యో శతాభ్దంలో స్మాల్ ఫాక్స్ (అమ్మోరు) అనే వ్యధి భారిన పడి అచ్చంగా ముప్పై కోట్ల మంది చనిపోయ్యారే!! అప్పుడెక్కడున్నాడు ఈ దేవుడు? 2004లో వచ్చిన సునామి 2,29,866 మంది ప్రాణాలు తీసేస్తే ఎక్కడున్నాడు ఆ దేవుడు? ఓ!!! కమలహాసన్ తీసిన దశావతారం అనే సినిమాని చూడాల్సిందే అంటారా!! 1918 లో వచ్చిన స్పానిష్ ఫ్లూ ద్వారా ప్రపంచం మొత్తం మీద దాదాపు యాభై లక్షల మంది చనిపోయ్యారే!! మరి వీరేందుకు పోయ్యారబ్బా!! అనునిత్యం ఎన్నో మర్డర్లు మానభంగాలు చేసే వాళ్ళు ఎక్కువౌతున్న ఈ రోజుల్లో సదురు దేవుడేమి చేస్తున్నాడు?

 

ఇవన్నీ ఒక ఎత్తైతే కరువు కాటకాలతో దేశానికి దేశాలే అన్నమో రామ చంద్రా అంటూ అలమటిస్తున్నాయే, మరి వారి మాటేమిటి? వారందుకు భాధ పడాలి? ఏం మాయలు మంత్రాలు వచ్చిన బాబాలు చాలామంది మన దేశం లోనే ఉన్నారుగా!! వారంతా పోయి సదురు దేశాలలో ఉండి బంగారాన్ని శృష్టించి వారి దేశంలో పేదరికం అనేది లేకుండా చెయ్యొచ్చు కదా!! ఏం? సదురు మాయలు మంత్రాలు ఆ దేశ కాల మాన పరిస్థులలో పనిచెయ్యవా !! లేక మరింకేదైనానా!!?? కంబోడియాలాంటి దేశాల గురించి ఎందుకు గానీ మన దేశాన్ని ముందు బాగు చెయ్యొచ్చు కదా.. పుష్కలంగా వానలు కురిపించొచ్చు కదా!!?? పాడి పంటలతో చల్లగా ఉండేటట్లు దీవించొచ్చు కదా..

ఇదంతా ఓ బోగస్.. మరి మీరేమంటారు?

 
Clicky Web Analytics