America లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
America లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

20, ఆగస్టు 2012, సోమవారం

మూడో సారి అమెరికా ప్రయాణం

ప్రస్తుతం వ్రాస్తున్న భావనలు మూడో సారి అమెరికాని విజిట్ చేసిన తరువాత వ్రాస్తున్నవి. మొదటి సారిగా 2008లో అమెరికాని చూడటమైనది. మఱో రెండేళ్ల తరువాత 2010లో, మఱో రెండేళ్ల తరువాత ఇప్పుడు. ఈ నాలుగేళ్లలో అమెరికా ఏమీ మారలేదు. మొదటి సారి విచ్చేసినప్పుడు ఉన్న పరిస్తితులు, అప్పటి మనుష్యుల ప్రవర్తనలు, ఆ అలవాట్లు, నేను గమనించాను అని అనుకున్నవి అన్నీ అలానే ఉన్నాయి. వాటిల్లో ఏ మాత్రం మార్పు రాలేదు. కానీ నాలోనే ఏదో మార్పు వచ్చినట్లుంది.

అది ఎందుకు వచ్చిందో అర్దం కాలేదు కానీ, ఇంతకు ముందు ఎప్పుడో వ్రాసుకున్నట్లు అంగీకరించడం ఎందుకో కష్టంగా ఉంది. కానీ నిజాన్ని నిజం అని ఒప్పుకోక తప్పదు. కానీ నిజాన్ని ఒప్పుకునేంత ఉన్నతమైన వ్యక్తిత్వం నాలో ఎందుకు కలగలేదో అర్దం కావటం లేదు. ఒక్కొక్క సారి చాలా కుశ్చితంగా ఆలోచిస్తున్నాను అని వ్రాసుకోవడానికి సిగ్గుగా లేదు కానీ, ఇలా వ్రాసుకోవడానికి చాలా ధైర్యం తెచ్చుకోవాల్సి వచ్చింది. నేను ఇలా నారో మైండెడ్ గా తయరవ్వడానికి నా ఆలోచనలే కారణమని నాకు తెలియడానికి చాలా కాలం పట్టింది.

ఇలా వ్రాసినంత మాత్రాన నేను ఇంతక ముందు వ్రాసినవన్నీ యాదార్దాలు కాకపోలేదు. ఆచారాన్ని సహిస్తాను కానీ అనాచారారాన్ని అంగీకరించలేను. ఇది అనాచారము అని నిర్ణయించే హక్కు నాకు లేక పోయినా, ఆచారముగా చెప్పబడినదానికి విరుద్దంగా ప్రవర్తించి మా ప్రవర్తన ఇంతే, ఎవ్వరో నిర్ణయించిన ఆ ఆచారాన్ని మేము పాటించము, మా ఆచారాన్ని మేము వ్రాసుకుని మాకు నచ్చినట్లు ఉంటాము అనే వారి ఆచారము నాకు అనాచారముగా అనిపిస్తోంది అనేది మాత్రం నిజం. ఏది సదాచారము? ఏది దురాచారము? అని నేను నిర్ణయించే స్థితిలో నేను లేకపోయినా, అలాంటి చర్చకు కూడా నేను సిద్దంగా లేను. అంతే కాదు సరికదా, అలాంటి చర్చను కూడా స్వాగతించే  హక్కు నాకు లేదు. ఈ చర్చ ఇప్పుడు అప్రస్తుతం అయనా, ముఖ్యమైన విషయం ఏమిటంటే, నా ఆలోచనా విధానంలో వచ్చిన మార్పు.

నేను కొంచం (కొంచం ఏం ఖర్మ, చాలానే..) దూకుడు మన:తత్వం కలిగిన వాడిని. అలాంటి నాకు ఈ సారి అమెరికా ప్రయాణంలో చాలా అవరోధాలు ఎదురైనా చిరునవ్వుతో దాటవేసే గుణం ఎందుకు కలిగిందో నాకు అర్దం కాలేదు. నా ప్రస్తుత ప్రయాణాన్ని ఉదాహరణగా తీసుకుంటే, హైదరాబాద్ నుంచి బయలు దేరిన విమాన యానం ముంబైలో మఱో అంకానికి చేరుకుంది. అక్కడి నుంచి పారీస్ వరకూ బాగానే సాగినా అక్కడి నుంచే మొదలైంది అసలైన కధ. నేను శాఖాహారిని. ముంబై నుంచి వచ్చే లేదా ముంబైకి వెళ్లే ప్లైట్లలో చాలామంది శాఖాహారులు ఉండటం అనేది చాలా సామాన్యం. కావున సదరు విమానాలలో విమానయానం చేసే ప్రయాణీకుల సౌకర్యార్దం కొన్ని శాఖాహార భోజనాలు ఎక్కువగా అందుబాటులో ఉంచుతూ ఉంటారు. కానీ పారీస్ నుంచి అటు పశ్చిమంగా వెళ్లే వారిలో శాఖాహారులు ఉండటం అనేదు అఱదు. కావున ప్రత్యేకంగా చెప్పకపోతే గాని శాఖాహారాన్ని అందు బాటులో ఉంచుకోరు. ప్రయాణం మొదలు పెట్టేటప్పుడు నేను టికెట్ కౌంటర్లో శాఖాహారిని అని చెప్పనందున వారు నా విషయాన్ని ప్రస్తావించలేదు. అందువల్ల నేను సాధారణ మాంసాహారిని అన్నమాట.

శాఖాహారం తినటం అనేది నాకు పరంపరగా వచ్చిన ఆచారం. మా ఇంటికి అతిధి వస్తే లేదా మేము ఆహ్వానిస్తే, మేము శాఖాహారమే పెడతాము. అదే విధంగా మాంశాహారం పశ్చిమ దేశాలలో ఆచారంగా వస్తున్నందున అక్కడి వారు కూడా అక్కడికి విచ్చేసే యాత్రికులకు అదే ఆచారం ప్రకారం పద్దతలు పాటిస్తారు కదా, అదే పంధాలో అక్కడికి వచ్చే వారికి కూడా మాంశాహారాన్ని పెడతారు కదా!! అలాగే నా విషయంలో మాంశాహారాన్ని నా ప్రధాన ఆహార ఆచారంగా తీసేసుకున్నారు. కానీ నేను శాఖాహారిని అని తెలిసిన తరువాత శాఖహారం వడ్డించడం జరగక పోయినా, శాఖాహారం లేదని చెప్పినప్పుడు చాలా కోపం వచ్చినా, నాలోని సహనం ఆ కోపాన్ని అధిగమించేసింది. నవ్వుతో ఆనాటికి పళ్ల రసంతో సరిపెట్టుకుని, బ్రెడ్డు ముక్కలు తిని చాలించాను. అదిగో అలా మొదలైంది మఱో వింత అనుభవం. ఏదో తెలియని క్రొత్త ఆలోచనలు. సరి క్రొత్త భావనలు.

 

అదే ప్రపంచం మఱో కోణంలో కనబడటం మొదలైంది.

23, జులై 2012, సోమవారం

అమెరికా ఏమీ మారలేదు ??

ప్రస్తుతం అమెరికా లోని మసాచూసెట్స్ అనే రాష్ట్రంలోని పిట్స్ ఫీల్డ్ అనే ఊరినించి వ్రాస్తున్నాను. అమెరికా కు విచ్చేయడం ఇది నాకు మూడో విడత. మొదటి సారి వచ్చినప్పుడు టెక్సస్ లోని ఆస్టిన్ అనే ఊరికి వెళ్లాను. రెండొవ విడతలో ఫిలడెల్ఫియాలోని రెడ్డింగ్, ఇదిగో ఇప్పుడు ఇక్కడ. మొదటి సారికి రెండొవ సారికి పోలికలు ఓ పోస్టులో వ్రాసుకుంటూ ఏవేవో ఆలోచించిన నాకు మూడోసారి ప్రయాణం కించిత్ కష్టం గా సాగినా, ఎందుకో మనసు అంతా ప్రశాంతతో కూడుకుని అన్నింటినీ క్షమించేసింది. అమెరికా లో నాకు చాలా విషయాలు నచ్చకపోయినా, నచ్చినా.. అవన్నీ ఇప్పుడు భావాతీతంగా అనిపిస్తున్నాయి. అమెరికా లోని ప్రజల అలవాట్లు నాకు ఎప్పటికీ అర్దం కాకపోయినా, వాటిల్ని అర్దం చేసుకోవాలన్న ఆలోచన ఇప్పుడు లేదు. ఇక్కడ విభిన్నమైన జాతులు కలసి మెలసి ఉంటున్నా, అప్పుడప్పుడు నాలాంటి మానశిక వికలాంగులకు అమెరికా అప్పుడప్పుడు ఓ అర్దం కాని విచిత్రమే.

 

అమెరికా లోని ప్రజల జీవన విధానం పై మొదటగా నేను వ్రాసుకున్న విషయాలు ఇప్పటికీ మారక పోయినా, నా దృక్పధంలో మార్పు ఎందుకు వచ్చిందో నాకు తెలియటం లేదు. వ్యక్తుల మధ్య ఉన్న బంధాలు అనుబంధాల గురించి అన్యోపదేశంగా ఎవేవి వ్రాసినా, అమెరికా లోని ప్రజల గురించి ఏమి వ్రాసినా అది అర్ద రహితంగానే ఉంటుందనిపిస్తోంది. ఆరోజుల్లోని నా ఆలోచనలు వాటిపై పడ్డ మొట్టికాయలు ఇప్పుడు ఎందుకో గుర్తుకు రావటం లేదు. మొదటి సారిగా అమెరికా వచ్చినప్పుడు వేసుకున్న నీలిరంగు చొక్కా ఇప్పటికీ గుర్తుండి తీసుకురావడం ఇప్పుడు అదే వేసుకుని మూడోసారి కూడా క్లైంటు వద్దకు వెళ్ళడం ఎదుకో చిత్రంగా అనిపిస్తోంది. ఇంత సింహావలోకనం చేసినా, ఇప్పుడు చెప్పాలనుకున్నది ఎక్కడ మొదలు పెట్టలో అర్దం కావటం లేదు.

 

మఱో సారి ప్రారంభిస్తాను. అప్పుడు ఆలోచనలు ఓ రూపాన్ని తెచ్చుకుని అక్షరంగా ఇక్కడ కనబడుతుందేమో!!! అప్పటిదాకా ..

 

సశేషం ..

11, అక్టోబర్ 2011, మంగళవారం

మింగుడు పడలేని నిజం

వృత్తి రీత్యా చాలా ప్రదేశాలు తిరిగినా, ప్రస్తుతం భాగ్యనగరంలో స్థిరపడ్డాను. నా వృత్తిలో ఎక్కువకాలం నేను భాగ్యనగరంలోనే గడిపాను అలాగే పెళ్ళైన తరువాత ఆరేళ్ళనుంచి ఇక్కడే ఉన్నాను. కావున ఇంకెక్కడికీ వెళ్ళాలనుకోవటం లేదు. ఇక్కడే ఉంటాను అనుకుంటున్నాను. కానీ కొన్ని నిజాలు నన్ను ఆలోచనలోకి తోస్తున్నాయి. వాటిల్లో మొదటిది ఆత్మహత్యల వివరాలు అలాగే మహిళలపై జరుగుతున్న హింసలపై ప్రభుత్వం చూపిస్తున్న గణాంకాలు. ఈ గణాంకాలు వెలుగులోకి వచ్చినవి మాత్రమే అని మఱచి పోకుండా, వెలుగులోకి రాకుండా ఎన్ని ఉన్నాయో అన్న భావన మరింత కృంగదీస్తోంది.
భారత దేశంలో హింస గురించి లెక్కా పత్రాలు తయారు చేసే పనిని కేంద్ర ప్రభుత్వ హోమ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో, NCRB, నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో, వారు నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం వారి వెబ్ సైట్ నందు 2009  సంవత్సర ప్రతిపాదకపట్టీ ఉంది. వారి లెక్కల ప్రకారం భారత దేశంలో మహిళలపై జరుగుతున్న హింసలలో ఆంద్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని. నమ్మబుద్ది కావటం లేదు కదూ, కానీ ఇది నిజమని లెక్కలే చెబుతుంటే, ఇదా నా ఆంద్రప్రదేశ్ అని ఏడవాలనిపిస్తోంది.
వీరి లెక్కలలో మఱో నగ్న సత్యం ఏమిటంటే, 2009 సంవత్సరంలో ఆత్మహత్యల ద్వారా చనిపోయిన వారి సంఖ్య 1,27,151. అంటే, సంవత్సరానికి 365 రోజుల లెక్కన ప్రతీ రోజు దాదాపుగా మూడువొందల యాభై మంది చనిపోతున్నారు. ప్రతీ నాలుగున్నర నిమిషాల వ్యవధిలో ఒక్కరు చొప్పున గంటకి పదిహేను మంది చొప్పున చనిపోతున్నారంటే, ఎందుకో అర్దం కాని పరిస్థితి. ఇదా నా భారత దేశం అని ఎంత చింతిస్తున్నానో అర్దం కావటం లేదు.
మొన్నా మధ్య అమెరికా వెళ్ళినప్పుడు ఇలాంటి వార్తలనే వారి నేషనల్ మ్యూజియంలో ఉన్నప్పుడు చిత్రీకరించి దానిపై ఓ పుటా వ్రాదామనుకున్నంతలో, హతవిధీ ఇలాంటి నిజాలు అక్కడే కాదు హింసా ప్రవృత్తి ఉన్న ప్రతీ చోట ఇది పునరావృత్తం అవుతూనే ఉంటుంది అనిపించింది. అమెరికాలో ప్రతీ రెండు గంటలకీ పన్నెండు మంది పిల్లలను హత్య చేస్తున్నారన్న విషయం నమ్మలేని మఱో నగ్న సత్యం.
USTripLiquidHub1 2010 248
ఇది నేను కల్పించిన చిత్రం కాదు, ఫిలడెల్ఫియాలోని నేషనల్ మ్యూజియం వారు బహిరంగంగా ఉంచినది.

ఎందుకీ హింసా ప్రవృత్తి? .. ఇప్పుడు కాదు, మఱోసారి.
 
Clicky Web Analytics