15, మార్చి 2011, మంగళవారం

దైవం – ఆలోచనల పరంపర

దైవం పై నేను చేసిన మొదటి పుట వెనకాల ఉన్న మూల ఆలోచనని ఇంతకు ముందు వ్రాసుకున్నాను. ఇప్పుడు రెండొవ పుట వెనకాల ఉన్న ముఖ్య ఉద్దేశ్యం వివరించే ప్రయత్నం చేస్తాను. ఒక్క సారి అవలోకనం చేసుకుంటే, మనల్ని ఇలా శపించేటోడు దేవుడా!! అన్న శీర్షిక వచ్చిన రెండొవ పుట వెనకా ఉన్న ఆవేదన అనాధలైన పసి పిల్లలు మఱియు వారి స్థితి. ఇదే పుటలో ప్రకృతిలో జరుగుతున్న ప్రళయాల గురించి ప్రస్థావన జరిగింది. వీటితో బాటుగా సృష్టిలోంచి ఉద్బవించిన వాటిని తమ శక్తులతో ప్రతి సృష్టి చేస్తున్నాం అని చెప్పుకుంటున్న బాబాలను ప్రశ్నించడం జరిగింది.

ఇక ప్రస్తుత విషయానికి వచ్చేముందు, ఈ మధ్య జరిగిన కొన్ని ఘటనలను ఙ్ఞప్తికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తాను. ఈ మధ్య వార్తలలో కనబడే అతి సాధారణ విషయాలలో మొదటిది దుర్ఘటనలు (యాక్సిడెంట్స్) మరొకటి హత్యలు. ఇలాంటి ఘటనలో ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. కొందరి మరణానికి వారు అతివేగంగా ప్రయాణం చెయ్యడం కారణమైతే, మరి కొందరు దొంగతనానికి వచ్చిన దొంగల అసహనానికి గురై ప్రాణాలు కోల్పోతున్నారు. అతి వేగంగా ప్రయాణం చెయ్యడమెందుకు ఆపై దుర్ఘటన జరిగింది దేవుడు మమ్ములను కాపాడలేదు అని నిందించడ మెందుకని. అర్భాటాలకు పోయి మా ఇంట్లో ఇంత ధనం ఉంది అన్నట్టుగా నిండా దొంగ బంగారాన్ని దిగేసుకుని నలుగురిలో తిరగడమెందుకని ఆ తరువాత నలుగురి కళ్ళల్లో పడ్డట్టే దొంగల కళ్ళలో కూడా పడి దోపిడీకో లేక మరింకేమైన పోగొట్టుకోవడం ఎందుకో.

సరే ఈ విషయాలు ప్రక్కన పెట్టి మరో విషయం ప్రస్తావిస్తాను, ఈ మధ్య వచ్చిన వార్తలలో ఓ తల్లి తన కన్న బిడ్డలనే చంపేశిందని చదివాను. ఆ తల్లి ఎందుకు అలా చేసిందో అని విచారించే ముందు, మరో విషయం. హైందవులు పరమ పవిత్రంగా పూజించే గంగా దేవి తనకు పుట్టిన అష్ట వసువులను పుట్టంగానే చంపేసిందంట. మరి ఈ తల్లి ఎంతటి ఖటినాత్మురాలో కదా!?

ఇక్కడ ప్రస్తావించిన రెండు సంగతులూ చాలా మటుకు ఒకే రకంగా ఉన్నా, వాటి వెనకాల ఉన్న కారణాలు ఒక్కసారి గమనిస్తే.. మొదటి తల్లి ఈ భవ సాగరంలో తన బిడ్డలను సాకలేక తన బిడ్డలకు మృత్యువుని ప్రసాదిస్తే, మరో తల్లి విషయం గురించి పురాణం తెలిసిన వారిని ఎవ్వరినైనా అడిగితె వివరం అర్దం అవుతుంది. తెలుసుకోవాలన్న కోరిక ఉన్న వారు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. తెలిసిన తరువాత అర్దం చేసుకుంటారు. తెలుసుకో్వాలని అనుకోనివారు గంగమ్మ మీద నిందలేస్తూ ఇలాగే ఇక్కడే ఉండి పోతారు.

ఇవన్నీ ఎందుకు నిన్నగాక మొన్న జరిగిన భూకంపం మరియు సునామి ధాటికి జపాన్లో వేలకొద్ది జనాలు మరణిస్తున్నారు. వేల కోట్ల సష్టం లెక్కల లోకి రానుంది. జపాన్ ఆర్దిక వ్యవస్థ 1987 తరువాత ఇంతగా క్షీణించింది లేదు. ఇవన్నీ ప్రకృతి వైపరిత్యాల వల్ల మనకు అనుభవంలోకి వస్తున్న మరియు వచ్చిన ఘటనలు. ఇంతకు ముందు కూడా ఇలాగే రెండొవ ప్రపంచ యుద్ధంలో చైనా జెపాన్లపై అమెరికా అణుబాంబు ప్రయోగించిన తరువాత చాలా కాలం పాటు ఈ రెండు దేశాలు నిలదొక్కుకోలేక పోయ్యాయి. కానీ ప్రపంచం అంతా ఇప్పుడు మెచ్చుకునే రెండొవ ఆర్దిక వ్యవస్థగా ఎదినది ఎవ్వరు? ఏదో దెబ్బ తగిలింది కదా అని ఏడుస్తూ కూర్చోకుండా పోరాడి ఎలాంటి పరికరాన్నైనా చవకలో తయ్యారైయ్యే విధానాలకు మారు రూపమైన చైనా మాన్యుపాక్చరింగ్ వ్యవస్థను మెచ్చుకోకుండా ఉండలేం కదా.

ఇలా ఏదైనా వైపరిత్యం జరిగినప్పుడు లేదా అనుకోని ఆపద వచ్చినప్పుడు దైవాన్ని నిందించడమే ప్రధాన కర్తవ్యంగా పెట్టుకున్న వాళ్ళకి వివరం చెప్పే విధంగా ముందుగా వారిని ఆకుట్టుకునే ప్రయత్నమే నా మరో పుట, మనల్ని ఇలా శపించేటోడు దేవుడా!! అలాంటి వాళ్ళకు కొన్ని ప్రశ్నలు..

  • రెండొవ ప్రపంచ యుద్దంలో అణుబాంబు వేసినది దైవమా..
  • ఏయిడ్స్ కనుకొన్నది దైవమా..
  • బుద్దిగా సంసారం చేసుకుంటూ ఒక స్త్రీయందే రమించి పిల్లలను కనమని పెద్దలు చెబుతున్నా పెడ చెవిన పట్టి ప్రకృతికి విరుద్దంగా జంతువులతో సంయోగం చేసే వివరీత బుద్ది కలిగినది దైవానికా..
  • మన లాభం కన్నా పక్కవాడి నష్టమే ప్రయోజనంగా ఎదుగుతున్న న్యూక్లియర్ ప్లాంట్లను కూలగొట్టింది దైవమా..

అందుకే పెద్దలు చాలా సార్లు చెప్పారు, వినాశకాలే విపరీత బుద్ధి అని. “విపరీతంగా ఆలోచించడం దేనికి ఆపై విసుగు చెందడం దేనికి” అన్న విషయం ఎంతమందికి అర్దం అవుతుందో కదా!!

11, మార్చి 2011, శుక్రవారం

నేను అనుభవాలనుంచి నేర్చుకోవటం లేదు

ఇలా వ్రాయడానికి సంకోచించడం లేదు కానీ ఇబ్బందిగా ఉంది. నిజం ఎప్పుడూ నిష్టూరంగానే ఉంటుంది. కాని అది నిజ్జంగా నిజంగానే ఉంటుంది. దానిని అంగీకరించి ఒప్పుకోవడానికి చాలా ధైర్యం కావాలి. అంతటి ధైర్యం నాలో రావాలనే ఈ ప్రయత్నం.

స్వతహాగా నాకు ఉన్న కొన్ని బలహీనతలలో ఒకటి నన్ను చాలా ఇబ్బందులలోకి తోస్తోంది. అలా చెయ్యడం ద్వారా నేను ఇబ్బందుల పాలౌతున్నాను అన్న విషయం గ్రహించి కూడా అలా చెయ్యడం మానుకోలేక పోతున్నాను. అలా చెయ్యడం మానడానికి నేను చాలా శ్రమించ వలసి వస్తుంది. కానీ చాలా కాలంనుంచి ఉన్న అలవాట్లు తొందరగా మానుకోలేం అన్న ఆంగ్ల నానుడి నాయందు స్పష్టమైంది. ఆంగ్ల నానుడిని ఆంగ్లంలో, Old habits die hard.

ఈ పుట వ్రాయడం వెనకాల ఉన్న చాలా విషయాలలో ఒక్క విషయాన్ని ఇక్కడ ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను. తెలుగులో ’రాయడం’ అనే పదం చూచిన రోజునుంచి నాకు చాలా కోపంగా ఉండేది. ఎవ్వడో చదువురాని లేదా వ్రాయడం చేత కాని ఓ అభాగ్యుడు వ్రాయడం అనే అచ్చమైన తెలుగు పదాన్ని తెలియక అలా వ్రాస్తే, ఏవిదంగా వ్రాస్తే ఏమిటి అని ఎదురు ప్రశ్న వేస్తూ ఈ నాటి చాలా మంది రచయితలు అందునా విద్యావంతులు అంతే కాక సమాజంలో ఎంతో కొంత గౌరవం ఉన్న వాళ్ళు కూడా ఈ రాసే జబ్బుని వారంటించుకుని అందరికీ పూయ్యడం అలవాటు చేస్తుంటే కడుపు రగిలిపోయ్యేది. ఇక్కడ మరో విషయన్ని ప్రస్తావించాలి.

ఉదాహరణాకి, ఓ ఇంటి ముందు నుంచొని ఓ పెద్దాయిన ఆ ఇంటి ముందు ఆడుకుంటున్న పిల్లవాడిని ఇలా అడిగితే ఎలా ఉంటుంది..

౧) అబ్బాయి, మీ నాన్నగారు ఉన్నారా?

౨) బిడ్డా!, మీ నాయిన ఉన్నడా?

౨) కొడకా, బాబు ఏంజేస్తుండు?

౪) వగైరా .. వగైరా..

ఇవన్నీ ఏదో ప్రాంతీయ యాస కలిగి ఉంటాయి, అంతే కానీ ఏ భాణిలోను మనం తండ్రి అనే పదాన్ని అగౌరవ పరచం. కాకపోతే మనం చేయ్య వలసినదల్లా, ఆ ప్రాంతీయ తత్వాన్ని మనం అర్దం చేసుకోవడమే.

అదిగో అలాంటి సమయంలో తెలుగు బ్లాగింగ్ చెయ్యడం, eతెలుగులో చేరడం, నా అభిప్రాయాన్ని నలుగురితో పంచుకోవడం, పలువురు నన్ను వ్యక్తిగతంగా నిందించడం, వగైరా వగైరా, ఒకదాని తరువాత ఒకటి జరిగిపోయ్యాయి. ఎవ్వరి అభిప్రాయాలు వారు తెలియజేయడం జరిగింది. ఆ తరువాత ఈ విషయమై నేను ఓ అభిప్రాయానికి వచ్చేసాను. నేను తెలుగు భాషని నలుగురిలోకి తీసుకు వేళ్ళాలి అనుకుంటున్నప్పుడు ఎవ్వరు ఏవిధంగా నైనా తెలుగులో వ్రాయడం మొదలైతే ఎంతో కొంత తెలుగు భాష వాడుకలోకి వస్తుంది కదా అని సమర్దించుకుని నా భాదని దిగమింగుకుని నాకు వీలైనంత వరకూ వ్రాయడమే చేస్తున్నాను.

అదిగో అలాంటిదే మరొక్కటి. అయినా నాకు ఎందుకో ఈ జాడ్యం? భాష యందు పూర్తి పట్టులేక పోయినా కొన్ని కొన్ని విషయాలపై పూర్తిగా అవగాహన ఉంది అని చెప్పవచ్చు. నాకు అవగాహన ఉన్న విషయాలలోని అర్దాన్ని తెలియని అందునా మాకు తెలియని విషయాన్ని చెప్పండి అని అడిగిన వారికి మాత్రమే తెలియ జేస్తుంటాను. అలా తెలియజేస్తూ ఉండే ప్రక్రియలో తెలుసుకునే వారు, తాము చేస్తున్నది భాషకి విరుద్దం అని తెలిసి.. ఆ విషయాన్ని ఒప్పుకునే చొరవ లేక వితండంగా వాదించడమే కాకుండా తిరిగి నాపై లేదా నేను చేసే తప్పులను భూతద్దంలో చూపించి వారేదో పెద్ద ఘన కార్యం చేసినట్టు ఫీల్ అవుతారు.

ఇలాంటి వారి విషయాలలో కొన్ని అంశాలు. మొదటిది, నాకు నేరుగా తపుచేస్తున్న వాళ్ళను సరిదిద్దే ప్రయత్నం చెయ్యడం లేదు. వారు అడిగితేనే నాకు తెలిసిన విషయాన్ని చెబుతున్నాను. రెండవది. నేనేమి తప్పు చేస్తున్నాను అన్న విషయాన్ని ఎవ్వర్ని నేను అడగలేదే, మరి అలాంటది నా చర్యలపై ఎందుకు స్పందిస్తారు? ఇలాంటి వాటి గురించి మరోసారి. ప్రస్తుతానికి ముఖ్య విషయానికి వచ్చేస్తా..

ప్రస్తుత ముఖ్య విషయాన్ని, అనుభవం నుంచి నేర్చుకోవడం అనే విషయంపై నేను ఇంతకు ముందు ’వ్రాయడం’ అనే విషయంలో అనుభవించి ఉన్నాను. కానీ ఇది పునరావృత్తం అవుతోంది అంటే, నేను అనుభవాలనుంచి నేర్చుకో లేక పోవడమే కాకుండా, స్వయం కృతాపరాధానికి అనుభవించాల్సి వస్తోంది. ఇలా ఎంత కాలం జరుగుతుందో చూడాలి ఇకనైనా నేను నాలోని ఈ బలహీనతను అధిగమించి ఇలాంటివి పునరావృత్తం కాకుండా చూచుకోవాలి.

2, మార్చి 2011, బుధవారం

దైవం – నా ఆలోచనలు

ఇంతకు పూర్వం, 2009 వ సంవత్సరం ఆగస్ట్ నెలలో దైవంపై నా అభిప్రాయాన్ని తెలియజేయడానికి ఓ మూడు ప్రయత్నాలు చేసాను. అప్పుడు పుట్టిన ఆలోచన రూపం దాల్చుకోవడానికి చాలా కాలం పట్టేడట్టు ఉంది. ఏదైనా పని చేసేటప్పుడు దాని గురించిన విషయాలను కూలంకుషంగా కాకపోయినా, నాకు తృప్తి కలిగేంత వరకూ సోధించి ఆ తరువాత దానిగురించి స్వీయావలోకనం చేసుకుంటాను. ఆ తరువాతే నాకు అర్దం అయ్యిన దానిగురించి వ్రాసుకుంటాను. ఈ ప్రక్రియలో దైవం గురించి అర్దం చేసుకోవడానికే చాలా కాలం పట్టేడట్టుంది.  కాని అంతవరకూ ఊరికే ఉండకుండా కొంచం కొంచంగా ఇక్కడ పెట్టే ప్రయత్నం చేస్తాను.

దైవంపై నేను వ్రాసిన పాత పుటలలో మొదటిది, దేవుడా !! తొక్కా !! ఎవ్వడాడు ? ఎక్కడుంటాడు? అనే శీర్షికన వచ్చింది. అక్కడ మొదలైంది హేతువాదంపై నాలో చర్చ మరియు పరిశోధన. అలాంటి ఆలోచనకు కొంత రూపం ఏర్పడటం వలన ఇక్కడ ప్రారంభం చేస్తున్నాను. ఈ పుట ప్రచురించిన తరువాత ఓ పూజ్యనీయులైన పెద్దాయన సున్నితంగా నన్ను ఈ క్రింది విధంగా హెచ్చరించారు..

.. కుమారా, దైవదూషణ ఏవిధంగానైనా పద్దతి కాదు, జాగ్రత్త ..

అప్పుడు వారితో ఒక్క విషయం మాత్రమే చెప్పాను. “మరికొంత కాలం ఎదురు చూడండి” అని. అప్పటినుంచి ఆలోచించగా.. చించగా, ఇదిగో ఇప్పుడు కుదిరింది అని మాత్రం చెప్పను, కానీ, నా ఆలోచనలో పూర్తి స్పష్టత రాకపోయినా, ఎంతో కొంత వివరం బయట పడింది. దానిలోని కొన్ని పాయింట్స్ ఇక్కడ. మొదటి పుటలో స్పందనగా ఓ నాస్తికుడు తన పాత పోస్టుని ఇక్కడ వ్రాసాడు. ఈ మధ్యలో ఒక సారి “నేను” అనే పదంపై ఓ గుంపులో చర్చ మొదలు పెట్టగా, నాకు అందిన మొదటి స్పందన రమణ మహర్షి వారి రచనల గురించి.

అంతకు ముందు వరకూ నాకు రమణ మహర్షిగారి గురించి తెలియక పోవడం వల్ల కించిత్ తడబడ్డా, రమణ మహర్షిగారి భావనలోని మూలం ఏదిశగా సాగుతుందో అర్దం అయ్యింది. ఈ పుట వ్రాస్తున్నప్పటికి నాకు రమణ మహర్షిగారి గురించి పూర్తిగా కాకపోయినా సూచనా మాత్రంగా అణువంత మాత్రమే తెలుసు, వీలు చేసుకుని వీరి గురించి మరోసారి కూలంకుషంగా అర్దం చేసుకునే ప్రయత్నం చేస్తాను.

దైవంపై నేను వ్రాసిన మొదటిపుట చాలా మందిలో నాపై లేదా నా వ్యక్తిత్వంపై ఓ రకమైన అభిప్రాయాన్ని ఏర్పరచి నన్ను అపార్దం చేసుకునేటట్టు చేసింది. అలా వారు అనుకునే విధంగా పుట వ్రాయడంలో నేను ఆశించినది నూటికి నూరు శాతం సిద్దించింది. ఎక్కువ మంది నన్ను లేదా నా వ్యక్తిత్వాన్ని నిర్ణయించే కొలమానంగా నేను వ్రాసే వ్రాతలనే తలచి నందువల్ల వీరు నన్ను అపార్దం చేసుకున్నారు.

నేను జీవితాన్ని చాలా తక్కువ చూసాను, కానీ నా ఈ చిన్ని జీవన ప్రయాణంలో నేను గమనించిన ఓ విషయమేమిటంటే ..

ఎక్కువ మంది ఎదుటి వారి ప్రవర్తనను పూర్తిగా గమనించకుండా స్వల్ప కాలంలోనే నిర్ణయించేస్తారు. ఇదే విషయాన్ని ఆంగ్లంలో, Most of the people judge others in అ very short time and spontaneously without studying for a long time

ఈ విషయాన్ని ఇక్కడ ఎందుకు ప్రస్తావించానంటే, మన మధ్య జరుగుతున్న ఘటనల నుండి మనం తేరుకుని జరిగిన విషయాన్ని జీర్నించుకుని ఏవి జరిగాయో అది ఎందుకు జరిగిందో అవగతం చేసుకునేంత వ్యవధి ఇవ్వకుండా దైవంపై అప్పుడు నేను పేలినట్టు అవాకులు చెవాకులు చేస్తుంటాము. ముఖ్యంగా దైవంపై. ఎందుకంటే, మనం చేసిన నిందలకు పరదైవం వచ్చి వివరం ఇచ్చుకోరుగదా. నామరూప ప్రధానమైన ఈ జగత్తులో అందునా ప్రస్తుత సామజిక జీవనంలో ఉన్న న్యాయ వ్యవస్థ ఉదాహరణగా తీసుకుంటాను. ప్రస్థుత న్యాయ వ్యవస్థ ప్రకారం ఎవ్వరైనా మరొకరిపై దొంగతనం కేసు వేస్తే, అభియోగం మోపబడ్డ ముద్దాయి, ఆ దొంగతం తాను చెయ్యలేదన్న నిరూపణ చేయ్యవలసిన భాద్యత వహించ వలసి వస్తుంది.

ఈ విధమైన ఆలోచన కలిగిన వాళ్ళే చాలా మంది, ఏదీ దేవుడ్ని చూపించు చూద్దాం అని దైవ భక్తులను నిలదీస్తుంటారు. మరో పుటలో మనకు కనబడని ఏదో ఒక అతీత శక్తి గురించి మరోసారి. అంత వరకూ .. ఓం, నమః శివాయః

 
Clicky Web Analytics