26, జనవరి 2011, బుధవారం

రిపబ్లిక్ డే ప్రతిజ్ఞ

భారత దేశం నా మాతృభూమి. భారతీయులు అందరు నా సహోదరులు. నేను నా దేశమును ప్రేమించుచున్నాను. శుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణము. సుసంపన్నమైన, బహువిధమైన నాదేశ వారసత్వసంపద నాకు గర్వకారణము. దీనికి అర్హుడనగుటకై సర్వదా నేను కృషి చేయుదును. నేను నా తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను, పెద్దలందరిని గౌరవింతును. ప్రతివారితోను మర్యాదగా నడచుకొందును. నా దేశముపట్లను, నా ప్రజలపట్లను సేవానిరతి కలిగియుందునని ప్రతిజ్ఞ చేయుచున్నాను. వారి శ్రేయోభివృద్ధులే నా ఆనందమునకు మూలము.

 

ఇలా చిన్నప్పుడు ప్రతిజ్ఞ చేసినట్టు జ్ఞాపకము. ఈ రోజుల్లో అస్సలు ఎవ్వరికైనా ఇది గుర్తుందా?? ఇలా ఏ పాఠశాలలోనైనా పదిమంది చేత చెప్పిస్తున్నారా??(డౌటే) ఇందులో మార్పు చెయ్యాల్సిన విషయాలు ఏమిటబ్బా!! మరోసారి ఆలోచిస్తాను. అంతవరకూ .. జైహింద్.

కామెంట్‌లు లేవు:

 
Clicky Web Analytics