10, ఫిబ్రవరి 2010, బుధవారం

నన్నయ్యపై వ్రాసిన పుట - ఆత్మావలోకనం

 

క్రిందటి సంవత్సరం జులై నెలలో ఏడవ తారీఖున నేను పూజ్యనీయులైన నన్నయపై ఒక పుట వ్రాసాను. ఆ తరువాత కొంతకాలానికి ఆ పుటని నేను పునఃపరిశీలించాను. అప్పుడు నాలో నాపై కలిగిన ఆలోచనలు, భావనలు, స్పందనలు, వగైరా వగైరా నన్ను ఆత్మావలోకనం చేసుకునేటట్టు చేసాయి. అలాంటి ఆత్మావలోకనం లోంచి ఉద్బవించినదే ఈ పుట. మరి మీ ఆలోచనలేమిటో సెలవివ్వండి

మొదటగా నా ఆలోచనలు.

అచ్చంగా అర ఠావు నిండా అచ్చు తప్పులు లేకుండా వ్రాయడం చేతగాని నేను.. ఆది కవి అని ఎంతో మంది చేత జేజేలు అందుకున్న మహానుభావుని గురించి (హాస్యాస్పదంగా నైనా సరే..) వ్రాయడమా. ఎంతటి మూర్ఖత్వము? గూగుల్ వాళ్ళని అడిగి కొన్ని కొన్ని వెబ్ సైట్లలో జరిగిన చర్చలను తీసుకుని వచ్చి ఏదో పాయింట్ ఉంది అని వ్రాయడం ఎంత మాత్రం హర్షదాయకం. ఒక వేళ్ళ నేను ఉదహరించిన పాయింట్స్ నిజమై ఉండొచ్చు, అన్నంత మాత్రాన నా భాషలో అంతటి చులకనా భావం అవసరమా!! అక్కడ స్పందించిన వారిలో మరో పూజ్యనీయులైన డా॥ పాండు రంగ శర్మగారు ఉదహరించిన పాయింట్ లాజికల్ గానే ఉంది. కానీ, నిజం చెప్పాలంటే, నాకు సదురు "పాండు రంగ శర్మగారి లాంటి వారితో ఈ విషయంపై చర్చించటం.." అనే విషయాన్ని కాదు కదా అస్సలు అలాంటి విషయాన్ని వీరిని అడగటానికి సరైన పదాలే నావద్ద లేవంటే, నాకు తెలుగు భాషపై ఉన్న పట్టు మీకే అర్దం అవుతుంది. అలాంటి నేను, అల్పులలో అత్యంత అల్పుడను, నన్నయ్య వంటి (ఘనాపాటి అనచ్చో లేదో తెలియదు) మహాను భావులను తూలనాడటమా.. ఎంతటి ఘోర తప్పిదము? నా స్వార్దం కోసం ఇలాంటి మహానుభావులు బలి కాకూడదు.

అంతటితో ఆగకుండా నాకు విద్యా బుద్దులు నేర్పిన గురువులను చులకనగా ప్రస్తావించడం ఏమాత్రమూ మెచ్చుకోదగినది కాదు. ఇది ఒక విధంగా గురు ధూషణే అని నా అభిప్రాయం. మరి దీనికి ప్రాయశ్చిత్తం ఏమిటని ఆలోచిస్తే, భహిరంగంగా చేసిన తప్పుని ఒప్పుకోక తప్పదని నా మనసుకు అనిపించింది. తత్ ఫలితమే ఈ పుట. అందుకని సభా పూర్వకంగా, బ్లాగు ముఖంగా ..

నన్నయ్య గారికి మరియు నాకు విధ్యా బుద్దులు

నేర్పిన గురువులకు హృదయపూర్వక క్షమాపణలు.

మన్నించండి.. క్షమించండి..

 
Clicky Web Analytics