25, జులై 2009, శనివారం

నన్నయ్య ఆది కవి - నేనొప్పుకోను !!

తెలుగు మాట్లాడేనేను నన్నయ్యను ఆది కవిగా ఒప్పుకోను. ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నన్నయ్యను ఆది కవిగా నిర్ణయించి నా మనోః భావాలను దెబ్బదీసినది. ఇందుకు అసమ్మతిగా నేను న్యాయస్థానంలో ప్రజా వాఙ్మయాన్ని (సరిఅయినదో కాదో .. ఆంగ్లంలో చెప్పాలంటే, Public Litigation Interest) వేయ తలంచాను. ఖబడ్ దార్ !! అందరూ ఇక కాచుకోండి. చిన్నప్పుడు నాకు విధ్యా భుద్దులు నేర్పిన గురువులారా!! సిద్దం కండి.. చెరసాలలో ఊచలు లెక్క పెట్టడానికి. అబద్దపు విధ్యను భోదిస్తారా!! హన్నన్నా .. ఎంత కండ కావరము .. వీరికి తోడు మన అన్న తారక రామారావు గారు నన్నయ్యకు టాంక్ బండ మీద విగ్రహం కూడా కట్టిస్తారా!! చూస్తా అది ఎంత వరకూ నిలుస్తుందో, కట్టించిన ప్రభుత్వమే దిగి వచ్చి తమ తప్పు ఒప్పుకుని ఆ విగ్రహం తీసేటంత వరకూ పోరాడుతాను.


భళా !! ఏమి ఈ వైపరీత్యం .. ఎందుకీ పక్షపాతం.. నాకు తెలిసి నన్నయ్య వీళ్ళందరికీ లంచం ఇచ్చుంటాడు. కమాన్ నన్నయ్య.. కమాన్ .. ఏదీ నాకు లంచం ఇచ్చి చూడు. నిన్ను తీసుకెళ్ళి బొక్కలో పెట్టిస్తా.. అలాగే ఒరేయ్ తొక్కలో తెలుగోళ్ళలారా .. సభా ముఖంగా మీ అందరికీ ఇదిగో ఇదే నా హెచ్చరిక.. మర్యాదగా అందరూ కలసి ముక్త ఖంఠంతో నా మాటని ఒప్పుకున్నారా, సరి, పోనీలే యదవలు తెలియక తప్పు చేసారని క్షమించి ఒదిలేస్తాను. కాదని మొండికేశారా.. అంతే మరి .. ఇకపై మాటలుండవు.. ఓన్లీ చేతలే..


ఏమిటిది వీడికేమైందనుకుంటున్నారా !! ఏమీ కాలేదు .. నా ఈ పుటకు సాక్ష్యాలు చాలా ఉన్నాయి. ఇవిగో వాటిల్లో మచ్చుకు కొని..


మొదటిది ) కాళ్ళకూరు నారాయణరావు గారన్న్ట్లట్లు పూజ్య పాదుడనే తెలుగు కవి కాణ్వ వ్యాకరణం గురించి ప్రస్తావించాడంట. ఎప్పుడనుకుంటున్నారు క్రీ.పూ. 28వ సంవత్సరంలో అనుకుంటా. అందుమూలంగా నన్నయ్య కన్నా దాదాపు 1000 సంవత్సరాలకు ముందే ఈయన గురించి జనాలకు తెలుసు, ఆఫ్ కోర్స్ ఈయన కన్నడంలో రచించాడు అనేది ఓ నిజం అనుకోండి, అన్నంత మాత్రాన తెలుగులో రచించ లేదంటారా!!


రెండవది ) అంతెందుకండి, మాకు విధ్యా భుద్దులు చెప్పిన గురువులే చెప్పారు, గాధా సప్తశతి అనేదేదో కావ్యం ఉందంట. దానిని రచించిన వారిలో తెలుగోళ్ళు ఉన్నారంట. మరి ఆ తెలుగోళ్ళు ఈ కావ్యం కాకుండా ఏమీ పీకలేదా!! (అన్నమయ్య సినిమాలో తనికెళ్ళ భరణి అన్నమయ్యకు చెప్పిన డైలాగ్ .. "రాజుగారిమీద కవిత్వం చెప్పవయ్యా అంటే.. చక్కగా, నువ్వది పీకావో, నువ్విది పీకావో .." అన్న వైనంలో ఈ డైలాగ్) ఏదో ఒకటి పీకే ఉంటారు .. మరి అలాంటప్పుడు మన నన్నయ్యను ఆది కవి అని ఎలా అన గలుగుతున్నారు !! కమాన్ .. ఐఆమ్ హర్ట్.. ఐ వాన్ట్ టి స్పీక్ టు పెద్దారెడ్డి నౌ


మూడవది ) తెలుగు కవిత్రయము గా పేరు పొందిన నన్నయ, తిక్కన, ఎర్రన (ఎఱ్ఱాప్రగడ)లుకు ధీటుగా కన్నడ భాషకూ మరో కవిత్రయం ఉంది. గౌరవనీయులైన నాగయ్య గారు ప్రస్తావించినట్లుగా, కన్నడ కవిత్రయం (పంపడు, రన్నడు, పొన్నడు) లోని పద్మ కవి (క్రీ.శ.950 నాటి సర్వ దేవుడు) తెలుగు దేశంలోనే పుట్టినా కన్నడ రచనలు చేసినారని , మొదట్లో వారు తెలుగు రచనలు చేసి ఉంటారని, కొందరు పండితుల అభిప్రాయం. మరి అట్లాంటప్పుడు మన పంపడు కూడా తెలుగోడేగా .. ఏంది కాదంటారా.. మరి ఈయన ఏమీ ఈ(పీ)కలేదంటారా!!


ఇవ్వన్నీ మనకొద్దు భాయ్ .. ఇప్పుడు సచ్చిన ఈళ్ళందర్నీ ఈడకు రప్పియాలే.. మన ప్రభుత్వ నిరంశ ధోరణి పై కోర్ట్ల కేసేయ్యాలా !! అప్పుడు గాని నాకు నిద్ర రాదు !!


చదివే మీరే ఏమంటారు?

ఈ పుట చదివిన తరువాత మీ అభిప్రాయాన్ని నిస్కర్షగా తెలియ జేయగలరు ..

-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్
కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి
 
Clicky Web Analytics